'చిత్రలహరి' సినిమాపై వైరల్ అవుతున్న తేజ కామెంట్స్

చిత్రలహరి సినిమాపై వైరల్ అవుతున్న తేజ కామెంట్స్
x
Highlights

గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న ఒకే ఒక్క మెగాహీరో సాయిధరమ్తేజ్ అని చెప్పుకోవచ్చు. 'తేజ్ ఐ లవ్ యు' సినిమా డిజాస్టర్ గా మారిన తర్వాత...

గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న ఒకే ఒక్క మెగాహీరో సాయిధరమ్తేజ్ అని చెప్పుకోవచ్చు. 'తేజ్ ఐ లవ్ యు' సినిమా డిజాస్టర్ గా మారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చిత్రలహరి సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు మెగా హీరో. ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు తేజ్. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా మేనల్లుడు ఈ సినిమా హిట్టవుతుందన్న నమ్మకం తనకు ఉందని వెల్లడించాడు.

"నా క్రిటిక్స్ అందరికీ 'చిత్రాలహరి' సినిమా జవాబు లాంటిది. ఇది ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్. కథ మొత్తం తండ్రి కొడుకు ల చుట్టూ తిరుగుతుంది. చాలా వరకు యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు" అని చెప్పుకొచ్చాడు తేజ్. నివేద పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories