నాగార్జున సినిమా సీక్వెల్ లో 'ఆర్ ఎక్స్ 100' పిల్ల

నాగార్జున సినిమా సీక్వెల్ లో ఆర్ ఎక్స్ 100 పిల్ల
x
Highlights

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న లక్కీ బ్యూటీ లలో ఒకరు పాయల్ రాజ్ పుత్. కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన బోల్డ్ ప్రేమ కథ...

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న లక్కీ బ్యూటీ లలో ఒకరు పాయల్ రాజ్ పుత్. కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన బోల్డ్ ప్రేమ కథ 'ఆర్ ఎక్స్ 100' లో హీరోయిన్ గా నటించింది పాయల్. గ్లామర్ విషయంలో హద్దులు దాటిన ఈ భామ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మధ్యనే 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో మెరుపు తీగలా వచ్చి వెళ్లిన పాయల్ రాజ్ పుత్ చేతిలో ప్రస్తుతం ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. అదే 'డిస్కో రాజా'. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ సినిమా తరువాత మరో పెద్ద సినిమాలో పాయల్ కు అవకాశం లభించని తెలుస్తోంది. యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం నాగార్జున కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన 'మన్మధుడు' సినిమాకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడని తెలిసిన విషయమే. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్కు వెళ్ళింది పాయల్ రాజ్ పుత్. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన 'మన్మధుడు' సినిమాకు సీక్వెల్ అంటే అది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. అలాంటి పెద్ద సినిమాలో ఛాన్స్ వస్తే పాయల్ రాజ్ పుత్ చేతిలో మరిన్ని ఆఫర్లు వచ్చి పడతాయని చెప్పచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories