అడవుల్లో తిరగనున్న సూపర్ స్టార్

అడవుల్లో తిరగనున్న సూపర్ స్టార్
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా అయిన 'మహర్షి' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా అయిన 'మహర్షి' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ ఆఖరి వారంలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ మహేష్ బాబు కోసం అడవి నేపథ్యంలో ఒక కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ ఈ సినిమాలో ముఖ్య అంశం అని తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా తరచుగా జరుగుతూనే ఉంటుంది. దీనిపై రోజుకో వార్త మనం చూస్తుంటాం. ఈ స్మగ్లింగ్ అంశాన్నే నేపథ్యంగా తీసుకొని సుకుమార్ ఈ సినిమా కథను తయారుచేసుకున్నారని అంటున్నారు. ఇంతకుముందు 'రంగస్థలం' సినిమా కోసం చరణ్ ను పల్లెటూరిలో తిప్పిన సుకుమార్ ఇప్పుడు మహేష్ బాబుని అడవి ప్రాంతాల్లో తిప్పనున్నాడన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories