మహేష్ బాబు దుబాయ్ టు పొల్లాచి

మహేష్ బాబు దుబాయ్ టు పొల్లాచి
x
Highlights

కొత్త సంవత్సర వేడుకలు పూర్తయ్యాయి. పార్టీలతో బిజీగా ఉన్న సెలబ్రిటీలు కూడా తిరిగి షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

కొత్త సంవత్సర వేడుకలు పూర్తయ్యాయి. పార్టీలతో బిజీగా ఉన్న సెలబ్రిటీలు కూడా తిరిగి షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ నేపధ్యం లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సంవత్సరాన్ని తన కుటుంబ సభ్యులతో దుబాయిలో సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడే ఉన్న పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరియు ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జంటను కూడా కలిసి కొత్త సంవత్సరానికి సంతోషంగా ఆహ్వానం పలికారు. పది రోజుల పాటు దుబాయ్ లోనే ఉన్న మహేష్ బాబు, నమ్రత, గౌతమ్ మరియు సితార తిరిగి ఈ వారంలో హైదరాబాద్ రానున్నారు.

అలాగే 'మహర్షి' సినిమా షూటింగ్ షెడ్యూల్ ను కూడా త్వరలో మొదలుపెట్టనున్నారు. ఈ షూటింగ్ కోసం మహేష్ బాబు మరియు చిత్రబృందం పొల్లాచి వెళ్లనున్నారు. ఇప్పటికే చాలావరకు సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది. పొల్లాచి షెడ్యూల్ కూడా పూర్తి అయిపోతే సినిమా ఒక కొలిక్కి వచ్చినట్టే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories