Kollywood: షూటింగ్ పోటీల్లో పసిడి పథకాన్ని సాధించిన హీరో అజిత్

Actor Ajith won the gold medal
x

ఇమేజ్ సోర్స్: ది హన్స్ ఇండియా


Highlights

Kollywood: కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్‌ నటించడమే కాదు.. ఆటల్లోనూ అగ్రగామి అని నిరూపించుకున్నాడు.

Kollywood: కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్‌ నటించడమే కాదు.. ఆటల్లోనూ అగ్రగామి అని నిరూపించుకున్నాడు.షూటింగ్ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలను అందుకున్నాడు. తమిళనాడులో జరిగిన 46వ రాష్ట్ర స్థాయి షూటింగ్​ ఛాంపియన్​షిప్​​ పోటీల్లో ఆయన ఈ ఘనత అందుకున్నారు. వివరాల్లోకి వెళితే...తమిళనాడు స్టేట్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో చెన్నై రైఫిల్ క్లబ్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ అజిత్‌ పాల్గొని అద్భుత ప్రదర్శన కనబరిచారు. పోటీల్లో భాగంగా ఆయన ఆరు పతకాలను గెలుచుకోగా.. అందులో నాలుగు స్వర్ణ పతకాలు. తమిళనాడులో జరిగిన ఈ పోటీలకు సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. నెటిజన్లు అజిత్‌కు అభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు, అజిత్‌కు షూటింగ్‌ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన చెన్నై రైఫిల్ క్లబ్‌లో పలుమార్లు గేమ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించారు.

అజిత్​ నటనతో పాటు పలు రంగాల్లో ప్రావీణ్యం ఉన్నవారు. ఆయనకు బైక్ ​రైడింగ్​, స్టంట్స్​, రైఫిల్​ షూటింగ్​ వంటి పలు సాహసాలు చేయడమంటే అమితమైన ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా ఇలాంటివి చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు.ప్రస్తుతం అజిత్​ 'వాలిమై' సినిమాలో నటిస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్‌ నిర్మాత. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటి హుమా ఖురేషీ కథానాయికగా నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories