మహేష్తో సినిమాపై కత్రినా క్లారిటీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒక బాలీవుడ్ భామను రంగంలోకి దింపాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ సంప్రదించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ మధ్యనే మీడియాతో ముచ్చటిస్తూ కత్రినాకైఫ్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'భరత్' సినిమా తరువాత ఏ సినిమా ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. అలాగే మహేష్ బాబు సినిమా గురించి తనకు ఎలాంటి ఆఫర్ ఇంకా రాలేదని తనను ఇంకా ఎవరూ అడగలేదని కుండబద్దలు కొట్టింది. ఇంతకుముందు వెంకటేష్ సరసన 'మల్లీశ్వరి' సినిమాలో మరియు బాలకృష్ణ 'అల్లరి పిడుగు' సినిమాలో నటించిన కత్రినాకైఫ్ మళ్లీ తెలుగులో ఎప్పుడు నటిస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందేనేమో.
జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT