Jathi Ratnalu: 'జాతి రత్నాలు' టీజర్ రిలీజ్

Jathi Ratnalu:  జాతి రత్నాలు టీజర్ రిలీజ్
x

జాతి రత్నాలు 

Highlights

నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో రూపొందిన లెటెస్ట్ మూవీ 'జాతి రత్నాలు'. నవీన్‌ పోలిశెట్టికి...

నవీన్‌ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో రూపొందిన లెటెస్ట్ మూవీ 'జాతి రత్నాలు'. నవీన్‌ పోలిశెట్టికి జోడీగా ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ముర‌ళీ శ‌ర్మ రూ.500 కోట్ల ప్రాజెక్టుతో ఈ ముగ్గురు హీరోలకు ఉన్న సంబంధమే చిత్ర కథగా టీజర్‌ను చూస్తే తెలుస్తోంది.

అదే ఈ ముగ్గురి జీవితంలో 'లైఫ్‌ అండ్‌ డెత్‌' పరిస్థితి వచ్చిన నవ్వులు పంచుతూ సాగుతుంది ఈ టీజర్‌. స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ సిద్దం మ‌నోహ‌ర్, సంగీతం రాధన్‌ అందిస్తున్నాడు. ఈ సినిమాలో వీకే నరేశ్‌, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 11వ తేదీన 'జాతి రత్నాలు' థియేటర్‌లలో రీలీజ్ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories