సోయగాల గోదావరి చెంత వయ్యారి భామ! ఎవరో తెలుసా?

సోయగాల గోదావరి చెంత వయ్యారి భామ! ఎవరో తెలుసా?
x
Highlights

గోదావరి అందాల గురించి ఎంత మంది ఎన్ని పుస్తకాలు రాసినా.. మనం ఎన్నిరకాలుగా చెప్పుకున్నా తనివి తీరదు. ఆ అందాలతో నేనూ పోటీ పడతా అంటూ వచ్చిన చిక్కినమ్మ రాశీ ఖాన్న అందాలు ఇప్పుడు నేట్టింట్లో వైరల్!

గలగలా గోదారి.. గట్టుమీద వయ్యారాల చిన్నది.. గోదారి పిల్ల గాలులు ఆ పిల్లను ముద్దాడుతుంటే.. ఆ సీన్ అదిరింది కదూ. ఇంతకీ ఈ భామ ఎవరో గుర్తుపట్టారా? గుర్తు పట్టే ఉంటారులెండి. అవును.. రాశీ ఖన్నా.. బొద్దుగా ముద్దుగా తెలుగు చిత్రసీమలోకి వచ్చిన ఈ అందాల రాశి.. ఇప్పుడు సన్నగా.. నాజూగ్గా.. సన్నజాజిలా మారిపోయింది. ఈ మేకోవర్ తో మళ్లీ ఇంకో కొత్త హీరోయిన్ వచ్చిన్దనేంత మార్పు వచ్చింది ఆమెలో.

రాశీఖన్నా.. మొన్న వరుణ్ తో తొలిప్రేమలో సందడి చేసింది.. ఇప్పుడు సాయి ధరం తేజ్ తో జత కట్టింది. మెగా కాంపౌండ్ లోని హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది ఈమె. సాయి ధరం తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిరోజూ పండగే షూటింగ్ ఇప్పుడు గోదావరి తీరాల్లో శరవేగంగా జరపుకుంటోంది. ఈ క్రమంలో అలా గోదారి ఒడ్డున వయ్యారంగా నిలబడి గోదారి అందాలకు పరవశించిపోతున్న రాశీ ఖంనాను క్లిక్ మనిపించి నేట్టింట్లో వదిలారు చిత్ర బృందం. ఇప్పుడు ఈ ఫోటోలు అందర్నీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. పసుపు పచ్చని లంగా ఒణీలో పదహారణాల పల్లెపడుచులా వన్నెలు ఆరబోస్తున్న రాశీ ని ఈ ఫోటోలో చోశాకా కుర్రకారు పండగ చేసుకోకుండా ఉంటారా చెప్పండి. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రతిరోజూ పండగే సినిమాలో తన అందచందాలతో ప్రేక్షకులకు పండగ చూపించాబోతోందని చెప్పడం కోసమే ఈ శాంపిల్ అందాన్ని నేట్టింట్లోలకి వదిలింది చిత్ర బృందం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories