వారు నకిలీ కథనాలను ప్రచారం చేసే ఇడియట్స్ : పూనమ్ కౌర్

వారు నకిలీ కథనాలను ప్రచారం చేసే ఇడియట్స్ : పూనమ్ కౌర్
x
Highlights

తన గురించి సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని హీరోయిన్ పూనమ్ కౌర్ మండిపడ్డారు. నకిలీ వార్తలపై ఆమె కౌంటర్ ట్వీట్ చేశారు. అందులో.....

తన గురించి సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని హీరోయిన్ పూనమ్ కౌర్ మండిపడ్డారు. నకిలీ వార్తలపై ఆమె కౌంటర్ ట్వీట్ చేశారు. అందులో.. 'నా గురించి కొన్ని ఫేక్ వార్తలు పుట్టిస్తున్నారు. అవి నేను చేసినవి కావు ఎన్నికలు ముగిశాయి.. వారు ఇప్పుడు నా కుటుంబానికి చేయగలిగిన అన్ని నష్టాలను చేశారు... కాని వారు (నకిలీ కథనాలను ప్రచారం చేసే ఇడియట్స్)... ఇప్పటికీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఉన్నారు.... ముఖ్యంగా నన్ను లక్ష్యంగా చేసుకొని చవకబారుగా వ్యక్తిత్వ దాడులు చేశారు. ఇటువంటి వారు ఓడిపోయారు.' అని పేర్కొన్నారు.

కాగా 'ఉదయమే మంచి వార్త విన్నాను. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు పలువురి మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నా. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు' అని పూనమ్ ట్వీట్ చేసినట్టు వార్త వైరల్ వైరల్ అయింది. దీనిపై ఆమె వివరణ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories