యాక్షన్ మూవీకి నష్టాలు.. విశాలే భరించలంటూ కోర్టు తీర్పు!

యాక్షన్ మూవీకి నష్టాలు.. విశాలే భరించలంటూ కోర్టు తీర్పు!
x

Vishal 

Highlights

Vishal Action Movie : విశాల్‌, తమన్నా జంటగా నటించిన చిత్రం 'యాక్షన్'.. సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ లో రిలిజైంది. సినిమాకి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు రాలేదు..

Vishal Action Movie : విశాల్‌, తమన్నా జంటగా నటించిన చిత్రం 'యాక్షన్'.. సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ లో రిలిజైంది. సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు రాలేదు.. ఈ సినిమా తమిళనాడులో రూ.7.7 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లను రాబట్టగలిగింది. అయితే ముందుగా ఈ సినిమాని తక్కువ బడ్జెట్‌లో నిర్మించాలని చిత్ర నిర్మాణ సంస్థ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ భావించింది. అయితే సినిమా కనీసం రూ.20 కోట్లు వసూలు చేయకపోతే ఆ నష్టాన్ని తానూ భరిస్తానని విశాల్‌ మాట ఇవ్వడంతో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ సంస్థ రూ.44 కోట్లతో ఈ సినిమాని నిర్మించారు.

చివరికి సినిమాకి నష్టాలే వచ్చాయి. వచ్చిన నష్టాల గురించి నిర్మాతలు విశాల్ తో చర్చించగా తన తదుపరి చిత్రం 'చక్ర' సినిమాని ట్రైడెంట్‌ బ్యానర్‌పైనే చేస్తానని మాట ఇచ్చాడట విశాల్.. అయితే ఇప్పుడు ఆ సినిమాని విశాల్ తన సొంత బ్యానర్ లోనే చేస్తున్నాడు అంటూ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మాతలు మద్రాస్ కోర్టును ఆశ్రయించారు. తాజాగా దీనిపైన విచారణ జరిపిన కోర్టు తీర్పును వెల్లడించింది. నష్టాలు భర్తీ చేసే విధంగా రూ.8.29 కోట్లకు విశాల్‌ గ్యారెంటీ ఇవ్వాలని న్యాయమూర్తి తెలిపారు.

ఇక ప్రస్తుతం విశాల్ తన సొంత బ్యానర్ లో 'చక్ర' అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ఇందులో విశాల్ సరసన జెర్సీ ఫేం శ్రద్ధాశ్రీనాథ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రెజీనా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాని తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారిగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేయగా విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఎం.ఎస్‌. ఆనందన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో సినిమాని ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories