మళ్లీ తెలుగులోకి సిద్ధార్థ్.. శర్వానంద్ తో మల్టీస్టారర్!

మళ్లీ తెలుగులోకి సిద్ధార్థ్.. శర్వానంద్ తో  మల్టీస్టారర్!
x

siddharth 

Highlights

Siddharth Come Back : నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్, ఆట మొదలగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు

Siddharth Come Back : నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఓయ్, ఆట మొదలగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు హీరో సిద్ధార్థ్.. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్లు రావడంతో తెలుగులో కనుమరుగైపోయాడు. అప్పుడప్పుడు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.. చివరగా గృహం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు సిద్ధార్థ్.. అయితే చాలా సంవత్సరాల తరవాత మళ్లీ తెలుగులో డైరెక్ట్ గా మూవీ చేస్తున్నాడు సిద్ధార్థ్..

RX 100 లాంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి 'మ‌హాస‌ముద్రం' అనే సినిమాని చేస్తున్నాడు.. దీనికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్‌ ని తాజాగా చిత్రనిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేసింది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తర్వాత తమ బ్యానర్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ అంటూ వెల్లడించింది.

ఇందులో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తునన్నట్టుగా ప్రకటించింది.. ఇక తాజాగా సిద్ధార్థ్ ని మరో హీరోగా అనౌన్స్ చేసింది.. వెల్ కం అగైన్ సిద్ధార్థ్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.. ఇక ప్రతి వారం సినిమా నుంచి ఏదొక అప్డేట్ ఉంటుందని ఇప్పటికే వెల్లడించింది. తెలుగు, త‌మిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి..

ముందుగా ఈ సినిమాని రవితేజతో చేయాలనీ అనుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి.. కానీ ఏమైందో తెలియదు కానీ అక్కడి నుంచి కథ శర్వానంద్‌కి వెళ్ళింది. ఇందులో శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని సమాచారం.. ఇక సిద్ధార్థ్ సరసన కీర్తి సురేష్ ని అనుకుంటున్నారు మేకర్స్.. త్వరలొనే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఆఫీషియల్ గా రానున్నాయి..



Show Full Article
Print Article
Next Story
More Stories