ఆ సినిమాను, పాత్రను మిస్‌ అవుతున్నా..కానీ తప్పుకోక తప్పలేదు!

ఆ సినిమాను, పాత్రను మిస్‌ అవుతున్నా..కానీ తప్పుకోక తప్పలేదు!
x
Highlights

అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు నిర్మాతలుగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ...

అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు నిర్మాతలుగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతోంది. ఈ సినిమాలో ఒక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు ఇటీవల సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై జగపతి బాబు క్లారిటీ ఇచ్చారు. సినిమా నుంచి తప్పుకోవడం నిజమే అని చెప్పిన ఆయన, తన సినీ జీవితంలో ఒక విషయం పై వివరణ ఇవ్వడం ఇదే మొదటిసారని చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన ఇలా చెప్పారు.

" చిత్ర పరిశ్రమ నా ఫ్యామిలీలాంటిది. అందుకే దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టంలేదు. కానీ, ఒక విషయంలో స్పష్టత ఇవ్వక తప్పడం లేదు. నా 33ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఇలా వివరణ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఇదే మొదటిసారి. అనిల్‌రావిపూడి-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా నుంచి నేను తప్పుకొన్నానని సోషల్‌మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ఇప్పటికీ ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ సినిమా కోసం మరో రెండు సినిమాలు వదులుకోవడం కూడా నిజం. కానీ, ఇండస్ట్రీలో కొన్ని కారణాల వల్ల ఇంకొన్ని విషయాలు జరుగుతాయి. తప్పవు. ఆ పరిస్థితి వల్ల సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాను, పాత్రను మిస్‌ అవుతున్నా. ఏదేమైనా చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్" అని జగపతి బాబు చెప్పుకొచ్చారు.

మొత్తమ్మీద సరిలేరు నీకెవ్వరు సినిమా జగపతిబాబుకు చెప్పలేని ఇబ్బంది కలిగించినట్టే కనిపిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories