హైకోర్టును ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబసభ్యులు

హైకోర్టును ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబసభ్యులు
x
Highlights

దిశా నిందితుల కుటుంబసభ్యులు మరోసారి సుప్రీంకోర్టుకు సంబంధించిన జ్యూడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించారు. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నిర్మిస్తున్న దిశా...

దిశా నిందితుల కుటుంబసభ్యులు మరోసారి సుప్రీంకోర్టుకు సంబంధించిన జ్యూడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించారు. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నిర్మిస్తున్న దిశా ఎన్‌కౌంటర్ చిత్రాన్ని నిలిపి వేయాలని జ్యూడిషియల్ కమిషన్‌ను కోరారు. ఇంతకు ముందు కూడా దిశా తండ్రి శ్రీధర్ రెడ్డి సైతం ఈ చిత్రాన్ని ఆపాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మూవీలో తమ వాళ్లను రౌడీలుగా చిత్రీకరిస్తున్నారని నిందితుల కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులచే ఎన్‌కౌంటర్‌కు గురైన జోళ్లు శివ, జోళ్ళు నవీన్, చెన్నకేశవులు, హైమ్మద్ ఆరీఫ్ కుటుంబ సభ్యులు సోమవారం హైకోర్టుకు చేరుకున్నారు. ఈ చిత్రం చిన్నపిల్లలపై కూడా ప్రభావం చూపుతుందని ఈ మూవీని నిలిపివేయాలని కమిషన్‌ను నిందితుల కుటుంబసభ్యులు కోరారు. ఒక పక్క ఎంక్వయిరీ కొనసాగుతుంటే దిశ కథను ఎలా తెరకెక్కిస్తారని ఫిర్యాదులో ప్రశ్నించారు. రామ్ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వెంటనే నిలిపి వెయ్యాలని కమిషన్‌ను కోరారు. నిందితుల తరుఫున న్యాయవాదుల సమక్షంలో కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories