స్టాఫ్ ను టూర్ కి పంపించిన దిల్ రాజు

స్టాఫ్ ను టూర్ కి పంపించిన దిల్ రాజు
x
Highlights

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు 2018లో మూడు వరుస డిజాస్టర్ లను అందుకున్నారు. 'లవర్', 'శ్రీనివాస కళ్యాణం' లాంటి సినిమాలు డిజాస్టర్ అయిన తర్వాత 'హలో...

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు 2018లో మూడు వరుస డిజాస్టర్ లను అందుకున్నారు. 'లవర్', 'శ్రీనివాస కళ్యాణం' లాంటి సినిమాలు డిజాస్టర్ అయిన తర్వాత 'హలో గురు ప్రేమకోసమే' సినిమా పర్వాలేదనిపించింది. అయితే 2019 లో మాత్రం దిల్ రాజు అదృష్టం బాగానే నడుస్తుంది. సంవత్సరం మొదట్లోనే 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు దిల్ రాజు. వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో నే 60 కోట్ల కలెక్షన్లను నమోదు చేసుకుంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో తనతో పాటు శ్రమించిన ఆఫీస్ స్టాఫ్ అందరికీ దిల్ రాజు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ను ఇచ్చారట. హైదరాబాద్ మరియు వైజాగ్ ఆఫీస్ లలో పని చేసిన కీలకమైన 20 మంది సభ్యులను బ్యాంకాక్ టూర్ కి పంపిస్తున్నారు దిల్ రాజు. 20 మందిని బ్యాంకాక్ టూర్ కి పంపడం అంటే కనీసం 25 నుండి 30 లక్షలు అవుతుంది. అయినా 'ఎఫ్ 2' కి వచ్చిన కలెక్షన్లతో పోలిస్తే ఇది అంత పెద్ద అమౌంట్ లా కనిపించదు.

Show Full Article
Print Article
Next Story
More Stories