మళ్ళీ రిపీట్ అవ్వనున్న 'జోష్' కాంబో

మళ్ళీ రిపీట్ అవ్వనున్న జోష్ కాంబో
x
Highlights

ఎప్పుడో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాతో హిట్ అందుకున్న నాగచైతన్య ఆ సినిమా తర్వాత మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ అందులో ఒక్క సినిమా...

ఎప్పుడో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాతో హిట్ అందుకున్న నాగచైతన్య ఆ సినిమా తర్వాత మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ అందులో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ప్రస్తుతం తన భార్య సమంత తో 'మజిలీ' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు చై. పెళ్లయిన తర్వాత సామ్, చై కలిసి నటిస్తున్న మొట్ట మొదటి సినిమా కాబట్టి ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తరువాత 'వెంకీ మామ' సినిమా లో నటించనున్నాడు నాగచైతన్య.

తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య తన మొదటి సినిమా అయిన 'జోష్' ను నిర్మించిన దిల్ రాజు తో మళ్లీ చేతులు కలపనున్నాడని తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ ఒక్క కొత్త దర్శకుడు దిల్ రాజు కు ఒక కథ వినిపించాడట. ఆ కథ చాలా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడు దిల్ రాజు. అంతేకాక ప్రీ ప్రొడక్షన్ పనులను సైతం మొదలు పెట్టేశాడు. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించనున్నాడు అని తెలుస్తోంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. 2018లో ఒక్క హిట్టు కూడా అందుకోన్నప్పటికీ 2019 మొదట్లోనే 'ఎఫ్ 2' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు దిల్ రాజు.

Show Full Article
Print Article
Next Story
More Stories