వరుణ్ తేజ్ కోసం కంపోజిషన్ మొదలుపెట్టిన దేవిశ్రీ

వరుణ్ తేజ్ కోసం కంపోజిషన్ మొదలుపెట్టిన దేవిశ్రీ
x
Highlights

తమిళంలో సూపర్ హిట్ అయి ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతున్న సినిమాలలో 'జిగర్తాండ' కూడా ఒకటి. సిద్ధార్థ్, బాబి సింహ నటించిన ఈ సినిమా ప్రస్తుతం తెలుగులో...

తమిళంలో సూపర్ హిట్ అయి ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతున్న సినిమాలలో 'జిగర్తాండ' కూడా ఒకటి. సిద్ధార్థ్, బాబి సింహ నటించిన ఈ సినిమా ప్రస్తుతం తెలుగులో రీమేక్ కానుంది. 'వాల్మీకి' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వరుణ్ తేజ్ మునుపటి సినిమా 'ఎఫ్ 2' కి సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం దేవి శ్రీ 'వాల్మీకి' సినిమా కోసం చెన్నై స్టూడియోలో కంపోజిషన్ పని మొదలు పెట్టారని తెలుస్తోంది. మ్యూజిక్ పని ఎంతవరకు వచ్చిందో చూడటానికి దర్శకుడు హరీష్ శంకర్ ఈ మధ్యన చెన్నై వెళ్ళి వచ్చినట్లు సమాచారం. నిజానికి తమిళంలో 'జిగర్తాండ' హిట్ అవ్వడానికి సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం కూడా ముఖ్యపాత్ర పోషించింది. తెలుగులో కూడా అలాంటి ఇంపాక్ట్ చేయడానికి దేవిశ్రీప్రసాద్ ప్రయత్నిస్తున్నాడట. ఇక ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories