ఏప్రిల్ లో మనముందుకు రానున్న 'చిత్ర లహరి'

Chitralahari
x
Chitralahari
Highlights

మెగా హీరోలు అందరిలో కనీసం ఒక్క హిట్టు కూడా అందుకోకుండా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరో సాయి ధరమ్ తేజ్. ఈ మెగా మేనల్లుడు ప్రస్తుతం 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

మెగా హీరోలు అందరిలో కనీసం ఒక్క హిట్టు కూడా అందుకోకుండా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరో సాయి ధరమ్ తేజ్. ఈ మెగా మేనల్లుడు ప్రస్తుతం 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 'చిత్రలహరి' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే టైటిల్ తో ఆకట్టుకున్న దర్శక నిర్మాతలు ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఏప్రిల్ 12 ఈ సినిమా విడుదల తేదీ గా లాక్ చేసినట్టు సమాచారం.

ఇప్పటికే 70% షూటింగ్ మొత్తం పూర్తయింది. మొత్తం షూటింగ్ పూర్తయ్యాక మార్చి నుండి నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలవనున్నాయి. యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్,నివేదా పేతురాజ్ హీరోయిన్లు గా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. తేజ్ కు ఈ సినిమా విజయం చాలా కీలకం. మరి ఈ 'చిత్రలహరి' అతని కెరీర్ కి ఎంత మాత్రం ఉపయోగ పడుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories