Chiranjeevi : చిరు-త్రివిక్రమ్ : కథ సిద్దం, ఆచార్య తరవాత సెట్స్ పైకి?

Chiranjeevi : చిరు-త్రివిక్రమ్  : కథ సిద్దం, ఆచార్య తరవాత సెట్స్ పైకి?
x

Trivikram, Chiranjeevi

Highlights

Chiranjeevi : రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా

Chiranjeevi : రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నట్టుగా వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి.. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నట్టుగా ఆ వేడుకలో వెల్లడించారు చిరు.. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలేక్కుతుంది అన్నదానిపైన క్లారిటీ లేదు..

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నాడు. ఆ తరవాత లూసిఫర్, వేదాళం రీమేక్ లు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.. అటు త్రివిక్రమ్ కూడా ఈ ఏడాది అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఎన్టీఆర్ తో ఓ సినిమాని చేస్తున్నారు.. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. చిరు ఆచార్య కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది..

సో అప్పుడు లూసిఫర్, వేదాళం రీమేక్ లను పక్కన పెట్టి త్రివిక్రమ్ కథనే చేయాలనీ చిరు భావిస్తున్నట్టుగా సమాచారం.. ఇప్పటికే చిరు, త్రివిక్రమ్ మధ్య కథ చర్చలు జరిగినట్టుగా సమాచారం.. క్రైం బ్యాక్ డ్రాప్ లో న‌కిలీ స్వామిజీ క‌థ ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.. ఆచార్య షూటింగ్ కూడా ముగిసిన తర్వాతే త్రివిక్రమ్ మూవీ పైన క్లారిటీ వస్తోంది.

గతంలో విజయభాస్కర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించాడు. ఇక ఇప్పటివరకు త్రివిక్రమ్ మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, బన్నీతో చెరో మూడు సినిమాలు చేశాడు. కానీ చరణ్, చిరంజీవితో మాత్రం ఒక్కసారి కూడా పని చేయలేదు. ఇప్పుడు ఆ కల ఈ సినిమాతో తీరనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories