హైదరాబాద్ లో మొక్కలు నాటిన సంజయ్ దత్!

హైదరాబాద్ లో మొక్కలు నాటిన సంజయ్ దత్!
x
Highlights

తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సంజయ్ దత్ పాల్గొన్నారు. పాన్ ఇండియా సంచలనం కేజీఎఫ్-2లో నటిస్తున్నసంజయ్ దత్, గచ్చిబౌలీలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో 8 మొక్కలు నాటారు.

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. ఇలా నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది.

అయితే తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సంజయ్ దత్ పాల్గొన్నారు. పాన్ ఇండియా సంచలనం కేజీఎఫ్-2లో నటిస్తున్నసంజయ్ దత్, గచ్చిబౌలీలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో 8 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను సంజయ్ అభినందించారు. 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' తో ప్రకృతిని ప్రేమించే చేతులన్నీ ఒక్కటవుతున్నాయని అన్నారు. ఇకపోతే ప్రతీ ఒక్కరు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలి, మొక్కలు నాటాలని సంజయ్ దత్ పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories