Bigg Boss 4 Telugu: ఫేక్ ఎలిమినేషన్.. కొత్త ఆటను మొదలు పెడుతుందా బిగ్ బాస్!

Bigg Boss 4 Telugu: ఫేక్ ఎలిమినేషన్.. కొత్త ఆటను మొదలు పెడుతుందా బిగ్ బాస్!
x
Highlights

Bigg Boss 4 : ఫేక్ ఎలిమినేషన్.. కొత్త గ్రూపులను క్రియేట్ చేసి కొత్త గేమ్ మొదలయ్యేలా చేస్తుందా?

సండే ఫన్ డే.. నాగార్జున వచ్చారు.. కల్యాణి ని పంపించారు. అందరితో ఆటలు ఆడించారు. ఆటలతో ఒకరికి ఒకరికి మధ్యలో పుల్లలు పెట్టె కార్యక్రమాలు చేశారు. ఇక డబుల్ ఎలిమినేషన్ పేరుతో పెద్ద ఫేక్ డ్రామా నడిపి షో ను ఎదో చేయాలని ప్రయత్నించారు. అందులో సుజాతను బలిపశువును చేశారు. ఇదీ ఈ ఆదివారం బిగ్ బాస్ తీరూ తెన్నూ..

ఒక పక్క ఐపీఎల్ ప్రారంభం అయి.. అతి పెద్ద రియాల్టీ షో కు సవాల్ విసురుతోంది. మరో పక్క వంటలక్క ఎక్కడా తగ్గడం లేదు. మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో పదిహేను రోజులు గడిచిపోయినా..ప్రేక్షకులను టీవీల ముందు కూచోపెట్టేలా ఎటువంటి సహకారమూ బిగ్ బాస్ నిర్వాహకులకు కంటెస్టెంట్ ల నుంచి దొరకడం లేదు. ఈ నేపధ్యంలో ఈ శని ఆదివారాలు నాగార్జున తో క్లాస్ పీకించి.. అందరినీ ఆడించేలా చేయాలని ఫేక్ ఎలిమినేషన్ స్టోరీ నడిపించారు.

దేవిని నామినేషన్ లో పెట్టిన కల్యాణి!

కల్యాణి వెళుతూ వెళుతూ దేవిని పాముతో పోల్చడమే కాదు.. వచ్సువారానికి ఎలిమినేషన్ కి నామినేట్ కూడా చేశారు. నిన్న బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినెట్ అయిన కల్యాణి..ఈరోజు నాగార్జున వద్దకు వచ్చారు. ఆమెతో టాప్ 5..లీస్ట్ 5 ఎవరో చెబుతూ ఫోటోలు పెట్టమన్నారు నాగార్జున. లీస్ట్ 5 లో సోహైల్ (5), సుజాత (4), అరియానా గ్లోరీ (3), కుమార్ సాయి (2), గంగవ్వ (1) ఫోటోలను ఉంచారు కల్యాణి. తరువాత దేత్తడి హారిక (1), 'అమ్మ' రాజశేఖర్ (2), మోనాల్ (3), దివి (4), అభిజిత్ (5) ఫొటోలను టాప్ 5 లిస్టులో పెట్టారు కల్యాణి. ఈ సందర్భంగా సుజాత పై విపరీతంగా విరుచుకు పడ్డారు కల్యాణి. దీని తరువాత బిగ్ బాంబ్ ఎవరి మీద వేస్తారు అని అడిగారు నాగార్జున. బిగ్ బాంబ్ ఏమిటంటే వచ్చేవారం ఎవరినైనా ఒకరిని నేరుగా నామినేషన్ లో పెట్టాలి. దానికి కల్యాణి వెంటనే దేవి నాగవల్లి పేరు చెప్పారు. దీంతో వచ్చే వరం దేవి నేరుగా నామినేషన్ కు వెళ్ళిపోయారు.

ఇక తరువాత ఎల్మినేషణ్ నుంఛి బయట పడిన పేర్లను ఒక్కోటీ రివీల్ చేస్తూ వచ్చారు నాగార్జున. చివరకు దేత్తడి హారిక..మోనాల్ ఇద్దరూ మిగిలారు. వీరిలో ఒకరు హౌస్ నుంచి వెళ్ళిపోక తప్పదు అని చెప్పారు. అయితే, ఆ ఎవరనేది..నామినేషన్ లో లేని ఏడుగురు నిర్ణయిస్తారని చెప్పారు నాగార్జున. దానికి రెండు రంగుల నీళ్ళు తెప్పించి హారిక ముందు ఒకటి.. బౌల్స్ పెట్టి దానిలో ఎవరిని ఎలిమినేట్ చేయాలని అనుకుంటే వారి బౌల్ లో రంగు నీళ్ళు పోయాలని చెప్పారు. మొదటి ఆరుగురు ఇద్దరికీ సమానంగా నీళ్ళు పోశారు. స్కోరు సమానం అయింది. ఈ దశలో సుజాత మిగిలిపోయింది. ఆమె నిర్ణయం కీలకమైంది. దీంతో ఆమె హారిక బౌల్ లో రంగునీళ్ళు పోసింది. ఇక హారిక ఎలిమినేట్ అయిపోయిందని నాగార్జున ప్రకటించారు. ఇక్కడ నుంచి హౌస్ లో డ్రామా మొదలైంది. అందరూ హరికను చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. హాగ్ లు .. ముద్దులతో ఆమెకు వీడ్కోలు చెప్పడానికి సిద్ధం అయిపోయి గేటు వద్దకు తీసుకు వెళ్లారు. అప్పుడు నాగ్ హారిక ను వెనక్కి వెళ్ళమని చెప్పారు. దీంతో అందరూ కేరింతలు కొడుతూ ఆమెను వెనక్కి తీసుకువచ్చారు.

మొత్తమ్మీద ఫేక్ ఎలిమినేషన్ తో ఎమోషన్స్ పెంచి టీఆర్పీలు లాగాలని ప్లాన్ చేసినట్టు కనిపించింది. కాకపోతే, హారిక ఎలిమినేట్ అవుతుంది అని ప్రేక్షకులు ఎవరూ భావించకపోవడం కొసమెరుపు. ఇక ఈ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. గంగవ్వ.. కుమార్ సాయిల మధ్య జరిగిన సరదా ఆటను చెప్పుకోవాలి. అదేవిధంగా కల్యాణి వెళుతూ వెళుతూ శ్రీరాముని వంశ వృక్షం గుక్కతిప్పుకోకుండా హరికథ రూపంలో చెప్పడం ఆకట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories