Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ నుంచి కళ్యాణి బయటకు.. హీరో ఎవరో జీరో ఎవరో తేల్చాలన్న నాగార్జున!


Bigg Boss 4 Telugu Episode 14 highlights
Bigg Boss 4 : నాగార్జున వచ్చారు.. అందరినీ కోప్పడ్డారు. సీరియస్ గా ఉండాలని చెప్పారు. హీరో..జీరో తేల్చాలని చెప్పారు. గంగవ్వను హౌస్ లో ఉండాలని చెప్పారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు.
శనివారం వస్తే ఇక బిగ్ బాస్ హడావుడే వేరు కదా. నాగార్జున వస్తారు.. ఎవరు బతికి బట్ట కట్టారో చెబుతారు. ఇక హౌస్ లో గత వారం రోజుల్లో అందరూ ఏమి చేశారో చెబుతారు. ఎలా చేశారో చెబుతారు. ఆడిస్తారు. ఇక ఈరోజు విశేషాల్లోకి వెళితే..గంగవ్వ ఆరోగ్యం సరిగా అయిపోయింది. అందరితో కలిసి మామూలుగానే తన హడావుడి మొదలు పెట్టింది. అవినాష్ ని బర్రె ముక్కోడా అని ఏడిపించింది. ఇక ఫోన్ తో ఫోతోగ్రఫే పోటీ పెట్టారు. నాగార్జున వచ్చారు.. అందరికీ క్లాస్ పీకారు.. అనుకున్నట్టుగా కల్యాణి బయటకు వెళ్ళిపోయింది. డబుల్ ఎలిమినేషన్ అన్నారు. రెండో వారు ఎవరో రేపు తెలుస్తుంది.
ఒప్పో ఫోటోగ్రఫీ..
ఫొటోలు తీయడంలో నాలుగు టీంలు గా తయారయి తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. రాజశేఖర్ మాస్టర్.. దివి-మొహబూబ్లను స్విమ్మింగ్ పూల్లోకి దింపి మరీ ఫొటోలు తీస్తే.. మొనాల్-అభికి కిస్లు ఇస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. మరి ఆ సమయంలో అఖిల్ ఎక్కడ ఉన్నడో కనిపించలేదు.
నాగార్జున వచ్చారు..క్లాస్ పీకారు..
నామినేషన్ లో ఉన్నవాళ్ళను పిలిచి అందరికీ క్లాస్ పీకారు. ఎవరికీ వారు సేఫ్ గేమ్ ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే సింపతీ వస్తుందని అనుకుంటున్నారా? బిగ్ బాస్ అంటే జోక్ గా ఉందా అంటూ సీరియస్ అయ్యారు. మీ అందరికీ గేమ్ ఎలా ఆడాలో నేను చూపిస్తా. ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను. అందులో మీరు సేఫ్ గేమ్ ఆడటానికి ఉండదు అన్నారు. అందరికీ.. గేమ్ ఇచ్చారు..
ఎవరు హీరో..ఎవరు జీరో!
ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు.. మీలో ఎవరు హీరో, జీరో అని భావిస్తున్నారో తెలియజేస్తూ.. హీరో అని భావించిన వాళ్లను కుర్చీలో కూర్చోబెట్టాలని.. అలాగే జీరో అని భావించిన వాళ్లను మెడపట్టుకుని బయటకు నెట్టాలని చెప్పారు నాగార్జున. మొదట నోయల్ కు ఆ పని చెప్పారు. నోయల్ హీరోగా రాజశేఖర్ ను..జీరోగా కుమార్ సాయి ని పేర్కొన్నారు. - సుజాత.. కళ్యాణిని జీరోగా అమ్మా రాజశేఖర్ని హీరోగా చెప్పింది. సొహైల్.. నోయల్ని హీరోగా కళ్యాణిని జోరోగా చెప్పాడు. దేవి అరియానా గ్లోరీని హీరోయిన్ గా..అమ్మా రాజశేఖర్ పెద్ద జీరోగా చెప్పింది. మొహబూబ్.. హీరోగా లాస్యను కుమార్ సాయిని జీరో - కుమార్ సాయి సింగర్ నోయల్ని జీరోగా అభిజిత్ను హీరోగా చెప్పారు. - లాస్య.. గంగవ్వను హీరోగా అమ్మా రాజశేఖర్ని జీరోగా పేర్కొంది. ఇక కళ్యాణి యాంకర్ సుజాతని జీరోగా గంగవ్వను హీరోగా చెప్పింది. అఖిల్ గంగవ్వను హీరోగా కుమార్ సాయిని జీరోగా చెప్పాడు. అరియానా గ్లోరీ గంగవ్వ హీరో అలాగే కరాటే కళ్యాణిని జీరోగా పేర్కొంది. అవినాష్ రాజశేఖర్ని హీరోగా..కుమార్ సాయి జీరోగా చెప్పాడు. దివి అమ్మ రాజశేఖర్హీరో అని.. kumar సాయి జీరో అని చెప్పింది. గాన్గావ్వ రాజశేఖర్ను హీరోగా kumar సాయి ని జీరోగా చెప్పింది. అభిజిత్ గంగవ్వ్ హీరోగా.. అరియాన గ్లోరీ జీరోగా తెలిపాడు. రాజశేఖర్ నోయల్ ను హీరోగా.. దేవిని జీరోగా అన్నాడు. మోనాల్ గంగావ్వను హీరోగా.. కుమార్ సాయి జీరో గా చెప్పింది.
ఇక ఈ టాస్క్ లో కూడా ఎవరికీ వారు సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశారు. మొత్తమ్మీద ఎక్కువ మంది రాజశేఖర్ ను హీరోగా చెప్పారు. కుమార్ సాయిని జీరోగా చెప్పారు.
ఇక ఎలిమినేషన్ లో ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని నాగార్జున చెప్పారు. మొదటి ఎలిమినేషన్ కల్యాణి అని ప్రకటించారు. రెండో ఎలిమినేషన్ ఎవరనేది రేపు చెబుతాను అని చెప్పారు.
ఈ ఎపిసోడ్ హైలైట్ ఏమిటంటే.. నాగార్జున ఎవరు హీరో ఎవరు జీరో తేల్చాలి అన్నపుడు ఎవరికీ వారు పిచ్చి పిచ్చి రీజన్లు చెప్పడం. ఇక రేపు ఎవరు ఎలిమినేట అవుతారనేది దాదాపుగా తేలిపోయింది. కుమార్ సాయి బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



