Bigg Boss 4 Telugu: సాక్షి సర్దేసింది.. ఈరోజు మెహబూబ్ సర్దేస్తాడా?

Bigg Boss 4 Telugu: సాక్షి సర్దేసింది.. ఈరోజు మెహబూబ్ సర్దేస్తాడా?
x

Swathi Deekshit eliminated from Bigg Boss 4 (Image courtesy Star Maa)

Highlights

Bigg Boss 4 : బిగ్ బాస్ ఇచ్చిన షాక్.. ఈవారం డబుల్ ఎలిమినేషన్!

బిగ్ బాస్ అంటేనే ట్విస్ట్ లు ఉంటాయి. ఎవర్ని ఎప్పుడు ఎందుకు పైకేత్తేస్తారో.. ఎవర్ని ఎందుకు కింద పడేస్తాడో షో చూసేవాళ్ళకు అర్ధం కాదు. అదే బిగ్ బాస్ స్టైల్. బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు నిలదొక్కుకోవడం సులువని అనుకుంటారు అందరూ. అయితే, అది తప్పని రుజువవుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఎలిమినేషన్ ప్రాసెస్ లో వచ్చే ట్విస్ట్ లు అన్నీ ఇన్నీ కాదు. అదీకాకుండా ఒక్కోసారి ఈ ఎలిమినేషన్ రౌండ్ లో అందరూ అనుకున్న వాళ్ళు కాకుండా అకస్మాత్తుగా వేరే వాళ్ళు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం చాలాసార్లు చూశాం. ఓట్ల లెక్కలతోనే అలా అవుతుంది అని ఎంత అనుకున్నా ఒక్కోసారి ఎందుకు అలా జరిగింది అన్న ఎన్నో అనుమానాలు ప్రేక్షకులు వ్యక్తం చేస్తుంటారు. అలాంటి ఎలిమినేషన్ బిగ్ బాస్ 4 లో పోయిన వారం చూశాం. దేవీ నాగవల్లి అనూహ్యంగా ఆమె బయటకు వెళ్ళిపోయారు. ఇక తరువాతి వారం అంటే ఈ వారం దేత్తడి హారిక, కుమార్ సాయి, సొహైల్, మెహబూబ్, లాస్య, అభిజిత్, సాక్షి దీక్షిత్ ఏడుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

వీరిలో లాస్య, హారిక, అభిజిత్, సోహైల్, సాక్షి దీక్షిత్ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. ఇక కుమార్ సాయి, మెహబూబ్, హారిక ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకుంటూ వచ్చారు. అందరూ అనుకుంటున్నట్టు జరిగితే అది బిగ్ బాస్ ఎందుకు అవుతుంది? నామినేషన్ ల ఘట్టం అయిపోయాకా జరిగిన కెప్తెన్సీ టాస్క్ లో కుమార్ సాయి అనూహ్యంగా ఇంటి కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. దీంతో కుమార్ సాయి హౌస్ లో ఉండాలి అనే భావన ప్రేక్షకుల్లో ఆటోమేటిక్ గా పెరిగిపోయింది. ఇక ఎక్కువ శాతం మాత్రం మెహబూబ్ బయటకు వెళ్లిపోతాడని అనుకున్నారు.

అనుకున్నట్టే శనివారం వచ్చింది. నాగార్జున వచ్చారు. బిగ్ బాస్ హౌస్ లోంచి ఎవరు సేవ్ అవుతారో ఆయన చెబుతారని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. హౌస్ మేట్స్ అందరితో ఆటలు ఆడించిన నాగ్.. మెల్లగా అసలు ఆట మొదలు పెట్టారు. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారో చెబుతాను అంటూ.. నామినేషన్ లో ఉన్నవారికి ఒక పిస్టల్ ఇచ్చారు. రెండు రౌండ్ లు నామినేషన్ లో ఉన్నవారు తుపాకీతో కాల్చుకోవాలి. ఎవరు కాల్చుకున్నపుడు తుపాకీ లోంచి బ్లాస్ట్ సౌండ్ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు. అని నాగ్ చెప్పారు. ఒక్కోరు సేవ్ అవుతూ వచ్చారు . అప్పుడు హౌస్ మేట్స్ అందరూ చప్పట్లతో అభినందించారు. కానీ, నాగార్జున మాత్రం ఇప్పుడు ఎవరూ సేవ్ అవడంలేదు. ఓన్లీ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇక రెండో రౌండ్ లో స్వాతి దీక్షిత్ దగ్గర పిస్టల్ పేలింది. దాంతో ఆమె ఎలిమినేట్ అయినట్టు ప్రకటించి శనివారం ఎపిసోడ్ ముగించారు.

ఎవ్వరూ ఊహించని విధంగా రెండు వారాలు ఇంకా సరిగ్గా చెప్పాలంటే పది రోజుల క్రితం సాక్షి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారంలోనే నామినేషన్స్ లోకి వచ్చేసింది. వచ్చిన వెంటనే ఎలిమినేట్ అయిపొయింది. ఈ ఎలిమినేషన్ దాదాపు ప్రేక్షకులు ఎవరూ ఊహించలేదు.

ఇదిలా ఉంటె మిగిలిన ఆరుగురిలో ఎవరూ సేవ్ కాలేదని చెప్పారు నాగ్. అంటే ఆదివారం కూడా ఒకరి ఎలిమినేట్ ఉందని అర్థం అవుతోంది. ఇప్పుడు లిస్టు లో దేత్తడి హారిక, కుమార్ సాయి, సొహైల్, మెహబూబ్, లాస్య, అభిజిత్ మిగిలారు. వీరిలో ఎవరు ఈరోజు బయటకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం మెహబూబ్ బట్టలు సర్దేశాడని తెలుస్తోంది. ఇప్పుడున్న వారిలో మెహబూబ్ ఒక్కడికే ఓట్లు తక్కువ వచ్చినట్టు తెలుస్తోంది. మెహబూబ్ తరువాత తక్కువ ఓట్లు వచ్చింది హారిక కు అని చెప్పుకుంటున్నారు. సో.. మెహబూబ్ బయటకు వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పవచ్చు.

మొత్తమ్మీద బిగ్ బాస్ 4 మెల్లగా ముందుకు సాగుతోంది. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండడం ఎవరూ ఊహించలేదు. దీంతో ఎవరు బయటకు వెళతారు అనేది మరి కొద్ది సేపట్లో తేలిపోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories