Bigg Boss 3 Telugu Episode 99: విజయ్ పంచ్ ల పటాసులు..శివజ్యోతి ఎలిమినేషన్ ఎమోషన్స్

Bigg Boss 3 Telugu Episode 99: విజయ్ పంచ్ ల పటాసులు..శివజ్యోతి ఎలిమినేషన్ ఎమోషన్స్
x
Highlights

బిగ్ బాస్ ఈ సీజన్ 14 వారాలు పూర్తి అయిపోయాయి. 17 మందితో ప్రారంభం అయిన బిగ బాస్ లో 14 వ వారం పూర్తయేసరికి 5 గురు మాత్రమే మిగిలారు. వీరు ఫైనల్స్ కి...

బిగ్ బాస్ ఈ సీజన్ 14 వారాలు పూర్తి అయిపోయాయి. 17 మందితో ప్రారంభం అయిన బిగ బాస్ లో 14 వ వారం పూర్తయేసరికి 5 గురు మాత్రమే మిగిలారు. వీరు ఫైనల్స్ కి చేరిపోయారు. వీరు ఐదుగురు వచ్చేవారం..చివరి వారం ఫైనల్స్ లో ప్రైజ్ మనీ కోసం పోటీపడబోతున్నారు. ఆదివారం నాటికి టాప్ ఫైవ్ లో రాహుల్..శ్రీముఖి..బాబా భాస్కర్ మాత్రమె ఉన్నారు. ఇక మిగిలిన వారిలో వరుణ్..శివజ్యోతి..అలీ రెజాల్లో శివజ్యోతి అందరూ అనుకున్నట్టే ఈవారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

సన్ డే..ఫన్ డే అంటూ బిగ్ బాస్ లో ఆదివారం పలకరించే నాగార్జున ఈరోజు ఒక ప్రత్యేక అతిథిని తీసుకొచ్చారు. యువ సినీ సంచలనం రౌడీ విజయ్.. ఈరోజు బిగ్ బాస్ లో సందడి చేశారు. ''మీకు మాత్రమే చెబుతా'' అంటూ సినిమా నిర్మించిన విజయ్ తన హీరో తరుణ్ భాస్కర్ ఇతర సినీ బృందంతో ఈరోజు బిగ్ బాస్ లో హంగామా సృష్టించారు. నవ్వుల టపాసులు.. విజయ్ పంచ్ ల పటాసులు.. ఎలిమినేషన్ ఎమోషన్స్ తో దీపావళి బిగ్ బాస్ సాగింది. ఆ విశేషాలు..

ఎవరిని లేపెయాలని ఉంది?

బిగ్ బాస్ హౌస్ లోకి విజయ్ దేవరకొండ వచ్చారు. ఆయనను కన్ఫెషన్ రూమ్ లో ఉంచి.. హౌస్ మేట్స్ ఒక్కోరిగా అక్కడకు పంపించారు. అక్కడకు వెళ్ళివచ్చిన వారు అక్కడ ఏమి జరిగిందీ హౌస్ లో చెప్పకూడదని నాగార్జున కండిషన్ పెట్టారు.

మొదట శ్రీముఖి విజయ్ వద్దకు వెళ్ళింది. విజయ్ ను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. విజయ్ తో ముచ్చట్లకు దిగింది. ఈ సందర్భంగా ఎవరిని హౌస్ నుంచి లేపెయాలనుంది అని విజయ్ శ్రీముఖిని అడిగారు. దానికి ఆమె తడుముకోకుండా బాబా భాస్కర్ అని చెప్పింది. ఎందుకు అని అడిగితే, అయన ఆతిత్యుడ్ నచ్చటం లేదని చెప్పింది. ఇలా అందరినీ ఒక్కో సీక్రెట్ విషయాలపై అడిగారు విజయ్. అందరూ సరదాగా చెప్పారు.

పునర్నవి కొరికిందట!

రాహుల్ విజయ్ కి ఓ సీక్రెట్ చెప్పారు. కెమెరాలకు కూడా ఈ సీక్రెట్ అందలేదని రాహుల్ చెప్పారు. రాహుల్‌ని పునర్నవి చేతిపై కరిచిందట. ఈ విషయం ఇప్పటివరకూ ఎవారికీ తెలియదని విజయ్ కు రాహుల్ చెప్పారు.

ఎలిమినేషన్ సీక్రెట్..

విజయ్ అందరికీ నల్లటి బెలూన్ లు ఇచ్చారు. ఆ బెలూన్ లలో ఎలిమినేషన్ సీక్రెట్ ఉందని చెప్పారు. తరువాత అయన స్టేజి మీదకు వెళ్ళిపోయారు. ఇక అక్కడ నాగార్జున తో తన సినిమా బృందంతో కలసి సందడి చేశారు.

బుడగ పేలింది.. వరుణ్ సేఫ్!

హౌస్ మేట్స్ కి ఇచ్చిన బుడగలు ఒకరి తరువాత ఒకరిని పెల్చమన్నారు నాగార్జున. దానిలో సేఫ్ అయ్యేవారి పేర్లుంటాయని చెప్పారు. అందరూ బుడగలు వరుసగా పగలగొట్టారు. కానీ అందులో ఏ విషయమూ బయట పడలేదు. తరువాత స్పెషల్ గెస్ట్ విజయ్ దేవరకొండ చేతికి నాగార్జున ఓ బెలూన్ ఇచ్చి అది పగలగొట్టమన్నారు. దానిని విజయ్ పగల గోడితే.. వరుణ్ పేరు వచ్చింది. దీంతో వరుణ్ సేఫ్ గా ఫైనల్స్ కి వెళ్ళిపోయాడు.

శివజ్యోతి వెళ్ళిపోయింది!

సందడిగా.. ఉండే శివజ్యోతి ఈవారం హౌస్ నుంచి వెళ్ళిపోయింది. విజయ్ దేవరకొండ టీం వెళ్ళిపోయిన తరువాత నాగార్జున శివజ్యోతి ఎలిమినేషన్ ప్రక్రియ జరిపారు. బిగ్ బాస్ అని అక్షరాలున్న కార్డులు తీసుకొచ్చారు. ఆ కార్డులు ఒక్కోటి వెనక్కి తిప్పితే.. అందులో ఎవరు ఎలిమినేట్ అవుతారో వారి పేరు ఉంటుంది. చివరి నుంచి రెండో ఎస్ అనే అక్షరంలో శివజ్యోతి పేరు వచ్చింది. దీంతో ఆమె ఎలిమినేట్ అవుతున్నట్టు నాగార్జున ప్రకటించారు.

శివజ్యోతి.. ట్రంకు పెట్టె..

నిజామాబాద్ నుంచి ట్రంకు పెట్టె పట్టుకు వచ్చా.. వెళ్ళేటప్పుడు బోలెడు అనుభవాలు మోసుకు వెళతా అని చెప్పిన శివజ్యోటికి తన ట్రంకు పెట్టె తనకు ఇచ్చేశారు నాగార్జున. అంతకు ముందు హౌస్ లో కొంత ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. శివజ్యోతి వేల్లిపోతుండడం తో శ్రీముఖి బాగా ఎమోషనల్ అయింది. ఇక అలీ కూడా కంట తడి పెట్టుకున్నాడు. శివజ్యోతి అందరికీ జాగ్రత్తలు చెప్పింది. బాబా భాస్కర్ కాళ్ళకు నమస్కారం చేసి హౌస్ నుంచి బయటకు వచ్చింది.

నాగార్జున ఆమె జ్ఞాపకాల ట్రంకు పెట్టెను ఆమెకు అందిస్తూ దీనితో మీరు ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఐదుగురితో ఒక మంచి జ్ఞాపకం, ఒక చెడ్డ జ్ఞాపకాన్ని తీసుకెళ్లిపోవచ్చని శివజ్యోతికి నాగార్జున చెప్పారు. శివజ్యోతి బాబా భాస్కర్‌తో మొదలుపెట్టింది. ఇంట్లో తాను నవ్వడానికి 90 శాతం కారణం బాబా భాస్కరేనని శివజ్యోతి వెల్లడించింది. అయితే, కాలేజ్ టాస్క్‌లో ఆయన ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పారని, అదొక్కటి తప్ప ఆయనతో బ్యాడ్ మెమొరీస్ ఏమీ లేవని చెప్పింది.

ఇక శ్రీముఖితో నామినేషన్ సమయంలో తప్ప పర్సనల్‌గా ఎలాంటి బ్యాడ్ మెమొరీస్ లేవని శివజ్యోతి కాస్త ఎమోషనల్‌గా చెప్పింది. గుడ్ మెమొరీ ఏంటని నాగార్జున అడగగా.. ''పొద్దున లేచినప్పటి నుంచి చిన్న పిల్లలా అది నన్ను ఎత్తుకుంటది, తినిపిస్తది'' అని శివజ్యోతి తెలిపింది. అదే విధంగా హౌస్ మొత్తం మీద తాను 'అన్న' అని పిలిచిన ఏకైక వ్యక్తి వరుణ్ అని శివజ్యోతి చెప్పింది. తామిద్దరి మధ్య ఒక రెస్పెక్టబుల్ రిలేషన్ ఉందనీ, ఆటల్లో ఏవో చిన్న చిన్న గొడవలు అయ్యాయి తప్ప పర్సనల్‌గా ఎలాంటి బ్యాడ్ మెమొరీ లేదని చెప్పింది. ఆయనను చూస్తే తన అన్నను చూసినట్టు ఉంటుందని ఎమోషనల్ అయ్యింది. అలీతో ఎలిమినేట్ కావడమే తనకు బ్యాడ్ మెమొరీ అని శివజ్యోతి చెప్పింది. అదే బ్యాడ్ మెమొరీ ఈరోజు అలీకి తాను ఇచ్చి వెళ్తున్నానని ఏడుస్తూ చెప్పింది. ఆమెను చూసి అలీ కూడా కంటతడి పెట్టుకున్నాడు. రాహుల్‌తో కూడా బ్యాడ్ మెమొరీ ఒక్కటి కూడా లేదని.. అన్నీ గుడ్ మెమొరీసే అని శివజ్యోతి నవ్వుతూ చెప్పింది.

ఆ తరవాత స్టోర్ రూంలో నుంచి ఐదు మాలలను తెచ్చారు. అందులో ఒకటి పూలమాల, నాలుగు ముళ్ల మాలలు. వీటిలో పూలమాలను శ్రీముఖికి మిగిలిన ముళ్ల మాలలు అబ్బాయిలకు అని శివజ్యోతి చెప్పింది. హౌస్‌లో ఒక్కతే అమ్మాయి శ్రీముఖి కాబట్టి ఆమెకే పూల మాల వేయాలని అన్నది. ఆ తరవాత ఏడుస్తూ అందరి నుంచీ సెలవు తీసుకుంది.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ వినోదాత్మకంగా సాగి.. శివజ్యోతి ఎలిమినేషన్ తో ఎమోషనల్ గా ముగిసింది. ఇక చివరి వారం లోకి బిగ్ బాస్ వచ్చేసింది. ఇప్పుడు టైటిల్ పోటీలో ఐదుగురు మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ రెజా వీరు టైటిల్ రేసులో నిలిచారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఎవరు ఎంత బాగా ఆడతారు.. ప్రేక్షకులు ఎవరికీ బ్రహ్మరధం పడతారు అనేది వేచి చూడాల్సిందే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories