బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 28 : సరదాగా శనివారం.. వాళ్ళిద్దరూ సేఫ్!

బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 28 : సరదాగా శనివారం.. వాళ్ళిద్దరూ సేఫ్!
x
Highlights

బిగ్ బాస్ ఎపిసోడ్ 28 ఆహ్లాదంగా మొదలైంది. బ్లూ సూట్ లో నాగార్జున వచ్చేశారు. వచ్చిన వెంటనే హౌస్ మేట్స్ తో ఆట మొదలెట్టేశారు. మాస్క్ తీసుకు వచ్చిన నాగ్ హౌస్ లో అందరూ ముసుగేసుకుని ఆడుతున్నారు. వారి ముసుగులు తొలిగించేద్దాం అంటూ హోస్ మేట్స్ తొ మాటలు కలిపేశారు. శివజ్యోతి, వరుణ్ లు సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు.

బిగ్ బాస్ ఎపిసోడ్ 28 ఆహ్లాదంగా మొదలైంది. బ్లూ సూట్ లో నాగార్జున వచ్చేశారు. వచ్చిన వెంటనే హౌస్ మేట్స్ తో ఆట మొదలెట్టేశారు. మాస్క్ తీసుకు వచ్చిన నాగ్ హౌస్ లో అందరూ ముసుగేసుకుని ఆడుతున్నారు. వారి ముసుగులు తొలిగించేద్దాం అంటూ హోస్ మేట్స్ తొ మాటలు కలిపేశారు. ముందుగా అందరికీ అవార్డులు ఇస్తానని ప్రకటించారు. బాబా భాస్కర్ కి మొదట విజిల్ అవార్డ్ ఇచ్చారు. ఇక శ్రీముఖికి లౌడ్ స్పీకర్ అవార్డ్ ఇచ్చారు. పునర్నవికి అంపైర్ అవార్డు ఇచ్చారు. తరువాత రాహుల్ వంతు.. రాహుల్ శ్రీముఖి కి సారీ చెప్పి వచ్చి తరువాత ఆమె గురించి కామెంట్ చేశాడు. అలా నువ్వు సారీ చెప్పకూడదు. చెపితే మనసులోంచి చెప్పాలి కానీ ముసుగు వేసుకుని చెప్పకూడదు. తరువాత అషు రెడ్డి కి ఆటలో అరటి పండు అవార్డు ఇచ్చి నవ్వుల పువ్వులు పూయించారు. మహేష్ కి పుల్లలు పెడుతున్నందుకు గానూ మహేష్ కు అగ్గిపుల్ల అవార్డు ఇచ్చాడు. ఎక్కడ అంటిస్తావో అది ఎక్కడ కాలుతుందో తెలియదు అంటూ నాగార్జున కామెంట్ చేశారు. అది నా గేమ్ స్ట్రాటజీ అని మహేష్ చెప్పాడు. అది అందరికీ విప్పి చెప్పెస్తున్నావు అని నాగ్ అంటే, వీళ్ళకి అంత అర్థం కాదు సర్ అని చెప్పుకొచ్చాడు. భూతద్దం అవార్డు వితిక కి ఇచ్చారు నాగార్జున. తరువాత శివజ్యోతి సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు. తరువాత శివజ్యోటికి ఉల్లిపాయ అవార్డు ఇచ్చారు..అలీకి ఫ్లూట్..కత్తెర..రోహిణికి, ఫ్రూట్ వరుణ్ కి, రవికి ఇయర్ ఇలా అవార్డులు ఇచ్చి అందరితోనూ మాట్లాడారు నాగార్జున. సరదాగా ఎపిసోడ్ నడిపించిన నాగార్జున.. చివర్లో వెళుతూ వరుణ్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు.

పళ్లు తోమించిన బిగ్ బాస్

శనివారం సరదాగా మొదలైంది బిగ్ బాస్ షో. పునర్నవి.. రాహుల్ ప్రేమకథ పాకాన పడుతోంది. వితిక వీరిద్దిరి మధ్యలో అడ్డుగా వస్తోంది. రాహుల్ పునర్నవి మాట్లాడుకుంటుంటే, వచ్చిన వితిక టీ పెట్టు అంటూ వారి మధ్యలోకి వెళ్ళింది. పునర్నవి నువ్వే పెట్టు అని అక్కడ నుంచి కదల లేదు. వితిక ఆమెను సోఫాలోంచి ఎత్తి కింద పాడేసింది. ఇదిలా నడుస్తుంటే బిగ్ బాస్ మధ్యలో హౌస్ మేట్స్ కి పళ్లు తోమించాడు. రెండు తీములుగా విడిపోయి గార్డెన్ ఏరియాలో పెట్టిన పెద్ద సైజు దంతాలను ఒక టీము తోముతుంటే.. ఇంకో టీము నల్ల రంగు పోయాలి. బజార్ మొగేసరికి పళ్ళు మీద మరకలు ఉంటె, తోమిన టీము ఓడినట్టు. వరుణ్ దీనికి అంపైర్ గా వ్యవహరించాడు. బజర్ మొగినప్పటికీ బాబా భాస్కర్, అషు రెడ్డి రంగు పోయడంతో ఆ టీము ఓడిపోయినట్టు వరుణ్ ప్రకటించాడు.

మొత్తమ్మీద శనివారం నాగార్జున వచ్చి బిగ్ బాస్ లో సందడి చేశారు. అందరికీ ముసుగులు తీయిస్తానని చెప్పిన నాగ్ సరదా అవార్డులు ఇస్తూ వారి లోపాల్ని ఎత్తిచూపించి వ్యంగ్యంగా వారిని రియలైజ్ చేసిన విధానం బావుంది. ఇక శివజ్యోతి, వరుణ్ లను సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు నాగార్జున.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories