Allu Sneha Reddy Accept Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అల్లు స్నేహ రెడ్డి

Allu Sneha Reddy Accept Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అల్లు స్నేహ రెడ్డి
x
Allu Sneha Reddy participated in Green India challenge with her children's
Highlights

Allu Sneha Reddy Accept Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి

Allu Sneha Reddy Accept Green India Challenge: టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge)కి వీపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. సినీ,రాజకీయ ప్రముఖులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. అందులో భాగంగా తాజాగా హీరో అల్లు అర్జున్‌ భార్య స్నేహా రెడ్డి ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ఆమె తన పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. ఆమె నాటిన మొక్కలకు అయాన్‌, అర్హలు మొక్కలకు నీళ్లు పోశారు. అనంతరం ఆమె ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేసిన సుష్మితకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింతగా విజయవంతం కావాలని, తెలంగాణ మొత్తం పచ్చని నేలగా మారాలని కోరుకుంటున్నానని ఆమె వెల్లడించింది.అనంతరం ఆమె భర్త అల్లు అర్జున్ తో పాటుగా తన స్నేహితులు జూపల్లి మేఘనారావు (మైహోమ్స్ కన్‌స్ట్రక్షన్ డైరెక్టర్), ఆర్. సింగారెడ్డిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు స్నేహ నామినేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories