బన్నీకి.. త్రివిక్రమ్ కి మధ్య 'ఐటం'?

బన్నీకి.. త్రివిక్రమ్ కి మధ్య ఐటం?
x
Highlights

అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మధ్య ఐటం సాంగ్ చిచ్చుపెట్టిందని తెలుస్తోంది. నాపేరు సూర్య తరువాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. దీనికి...

అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మధ్య ఐటం సాంగ్ చిచ్చుపెట్టిందని తెలుస్తోంది. నాపేరు సూర్య తరువాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. దీనికి త్రివిక్రమ్ దర్శకుడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి.. సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాతో వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా సినిమా చేస్తున్నారు. నాపేరు సూర్య అనుకున్నంత బాగా పోకపోవడంతో బన్నీ ఇప్పుడు ఈ సినిమా మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా అభిమానుల్లో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమాని పూర్తిగా అవుట్ అండ్ అవుట్ కామెడీ గా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే, ఈ సినిమాలో మాస్ మసాలా ఐటం సాంగ్ ఒకటి పెట్టాలని త్రివిక్రమ్ కి ఆలోచన వచ్చిందట. కానీ, బన్నీ ఈ ప్రతిపాదనకు నో చెప్పాడని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు ఈ విషయంలో ఈ దర్శక హీరోల మధ్య చిన్నపాటి వార్ నడుస్తోందట. తండ్రీ కొడుకుల అనుబంధం మధ్యలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అటువంటి సినిమాలో ఐటం సాంగ్ బాగోదని బన్నీ అభిప్రాయపడుతుంటే, గత రెండు సినిమాల్లోనూ ఐటం సాంగ్ లేదు కాబట్టి ఈ సినిమాలో ఐటం సాంగ్ ఉంటె బావుంతుందనేది మాటల మాంత్రికుడి అభిప్రాయమాట. ఇప్పుడు ఈ విషయం పై టాలీవుడ్ లో రరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. మరి ఇందులో నినమెంతో తెలియాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరువిప్పాల్సిందే.

కాగా, గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి 'నాన్న నేను' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. తండ్రి సెంటిమెంట్ తో ఉన్న స్క్రిప్ట్ కి త్రివిక్రమ్ మార్క్ కామెడీ కలిపి సినిమాని వండుతున్నారట. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పూజా హెగ్డే జోడీగా నటిస్తోంది. అలాగే ఒక ముఖ్యపాత్రలో టబుతో పాటు హీరో సుశాంత్, హీరోయిన్ నివేద సేతురారు కూడా నటిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories