Yatra 2 : యాత్ర2లో వైఎస్ జగన్ గా ఎవరో తెలుసా?

Yatra 2 : యాత్ర2లో వైఎస్ జగన్ గా ఎవరో తెలుసా?
x

Yaatra 2

Highlights

Yatra 2 : దివంగ‌త మహానేత వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజకీయ జీవితంలో ప్రధాన ఘట్టం అయిన పాదయాత్రను ఆధారంగా దర్శకుడు

Yatra 2 : దివంగ‌త మహానేత వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాజకీయ జీవితంలో ప్రధాన ఘట్టం అయిన పాదయాత్రను ఆధారంగా దర్శకుడు మ‌హి వి.రాఘ‌వ తెరకెక్కించిన చిత్రం `యాత్ర`.. ఇందులో వై.ఎస్‌.ఆర్ పాత్రలో మలయాళ నటి మెగాస్టార్ మమ్ముట్టి నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు మ‌హి వి.రాఘ‌వ ఇప్పటికే స్పష్టం చేశారు. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర ఆధారంగా పార్ట్ 2 తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమాలో వైఎస్ జగన్ గా ఎవరు కనిపించనున్నారు అన్నది ఆసక్తి నెలకొంది.. అప్పట్లో అల్లు అర్జున్ పేరు వినిపించింది. తాజగా ఇప్పుడు ఆ ప్లేస్ లోటాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున పేరు వినిపిస్తోంది. ఇప్పటికే కథను సిద్దం చేసుకున్న దర్శకుడు మ‌హి వి.రాఘ‌వ నాగార్జునకి నరేషన్ ఇవ్వగా ఆయనకి బాగా నచ్చిందని సమాచారం.. అయితే దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక యాత్ర 2 కోసం వైఎస్సార్ మరియు జగన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, అటు నాగార్జునకి వైఎస్ కుటుంబానికి మంచి సంబధాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే..

ప్రస్తుతం నాగార్జన బిగ్ బాస్ సీజన్ 4 లో బిజీగా ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం నాగ్ వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. కరోనా తరవాత మళ్ళీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమాని ఓటీటీ ద్వారా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమాని చేస్తున్నాడు నాగార్జున..

Show Full Article
Print Article
Next Story
More Stories