Nagarjuna: మల్టీస్టారర్‌లో నాగార్జున, అఖిల్?

Akkineni Nagarjuna and Akhil in a Multi-Starrer?
x

అక్కినేని నాగర్జున, అఖిల్ (ఫొటో: ది హన్స్ ఇండియా)

Highlights

Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన తాజా చిత్రం 'వైల్డ్ డాగ్' తో ఏప్రిల్ 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన తాజా చిత్రం 'వైల్డ్ డాగ్' తో ఏప్రిల్ 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే మరికొన్ని సినిమాలు లైన్ పెట్టి, త్వరగా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.

తాజాగా నాగార్జున పై ఓ వార్త బజ్ క్రియోట్ చేసింది. తన రెండవ కుమారుడు హీరో అఖిల్ తో కలిసి మల్టి స్టారర్ గా ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. కాగా, ఈ డైరెక్టర్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో తీస్తున్న లూసీఫర్ రిమేక్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయ్యాక అక్కినేని వారితో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేయనున్నాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

ఇక తండ్రీకొడుకులు కలిసి రెండు సార్లు స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. వాటిలో బ్లాక్ బస్టర్ మూవీ 'మనం' ఒకటి కాగా, అఖిల్ తొలి సినిమా తన పేరుతోనే వచ్చిన 'అఖిల్' రెండవది. మనం సినిమాలో అఖిల్ క్లైమాక్స్ లో కొద్దిసేపు కనిపిస్తే... అఖిల్ సినిమాలో నాగార్జున కూడా కొద్దిసేపే కనిపించి సందడి చేశారు. కాగా ప్రస్తుత మల్టీస్టారర్ లో మాత్రం ఫుల్ టైం కనిపిస్తారని అంటున్నారు.

ఈ మల్టీస్టారర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే నాగార్జున తన పెద్ద కుమారుడు నాగ చైతన్యతో కలిసి "బంగర్రాజు" అనే చిత్రాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ వార్తలు నిజమైతే.. ఓకేసారి టాలీవుడ్ కింగ్ తన కుమారులతో కలిసి రెండు ఆసక్తికరమైన మల్టీస్టారర్లతో ప్రేక్షకులను అలరించనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories