Sharmila Mandre : అల్లరి నరేష్ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్!

Sharmila Mandre : అల్లరి నరేష్ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్!
x
Highlights

Sharmila Mandre : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. అయితే ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినీ

Sharmila Mandre : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. అయితే ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కరొనా బారిన పడ్డారు. తాజాగా కన్నడ నటి శర్మిలామండ్రేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది..ఆమెతో పాటుగా ఆమె కుటుంబ సభ్యులకి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో పాజిటివ్‌గా వచ్చినట్లు ఆమె వెల్లడించింది. "అందరికీ హాయ్.. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ వచ్చింది. ఇంట్లోనే ఐసోలేషన్ అయ్యాం. వైద్యుల సలహాలను పాటిస్తున్నాం" అని సోషల్ మీడియాలో పేర్కొంది. ఆమె తెలుగులో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కెవ్వు కేక సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కన్నడ సినిమాలతో ఆమె బిజీగా ఉంది.

ఇక అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో రికార్డ్ స్థాయిలో 83,341 కేసులు నమోదు కాగా, 1096 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 66,659 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశంలో మొత్తం 39,36,748 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,31,124 ఉండగా, 30,37,151 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 68,472 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.15 శాతంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories