ఎన్టీఆర్, ఏఎన్నార్ ల పై జమున షాకింగ్ కామెంట్స్

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల పై జమున షాకింగ్ కామెంట్స్
x
Highlights

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లలో ఒకరు జమున గారు. ఆమె కెరియర్ లో ఇప్పటిదాకా చాలానే చిత్రాల్లో నటించారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లలో ఒకరు జమున గారు. ఆమె కెరియర్ లో ఇప్పటిదాకా చాలానే చిత్రాల్లో నటించారు. అయితే ఈమె ముక్కుసూటి మనిషి అని అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆమె అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది మగవారు పనిచేసే చోట మహిళలతో పోటీ పడటానికి ఇష్టపడరు. ఆడవాళ్లు ఎప్పుడు వారికి తగ్గి ఉండాలనే భావన కలిగి ఉంటారు మరి మీకు ఎప్పుడైనా అలాంటి సందర్భాలు ఎదురయ్యాయాని అడుగగా జమున ఎన్టీఆర్ ఏఎన్నార్ ల పై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు. తన ఆత్మవిశ్వాసం కారణంగా ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్లు ఆమెతో మూడేళ్ల పాటు పని చేయలేదని చెప్పారు.

అయినప్పటికీ ఆమె వేరే వాళ్ళతో 20 సినిమాల్లో నటించిందని అందులో 18 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అని చెప్పారు. "కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది, పొగరుబోతు మనిషి, ఎవరిని పట్టించుకోదు, మాకు వంగి దండాలు పెట్టదు అంటూ అప్పట్లో ఏవో సిల్లీ ఆరోపణలు చేసి వాళ్ళు నన్ను బాయ్కాట్ చేశారు కానీ అది నాకు ఒక రకంగా కలిసి వచ్చింది. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు అన్ని అప్పుడు నా దగ్గరికి వచ్చాయి. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా హీరో ఎవరైనా పర్వాలేదు జమున ఉంటే చాలు ఆవిడే హీరో అన్నట్టుగా సినిమాలు కొనుక్కునేవారు. ఆ గొడవ మూడేళ్ల పాటు సాగింది. తరువాత మళ్లీ మా ముగ్గురినీ కలిపింది 'గుండమ్మ కథ' అని చెప్పుకొచ్చారు జమున.

Show Full Article
Print Article
Next Story
More Stories