Live Blog: ఈరోజు (మే-24-ఆదివారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 24మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. బయటకు వెళ్ళినపుడు తగిన జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఈరోజు తాజా సమాచారం



Show Full Article

Live Updates

  • 24 May 2020 10:23 AM GMT

    -- నెల్లూరు జిల్లా లోని కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

    - ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..

    - ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు

  • 24 May 2020 10:23 AM GMT

    ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్

    ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..

    కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..

    రంగంలోకి పోలీసులు

  • 24 May 2020 9:56 AM GMT

    అది చార్రిత్రాత్మక కట్టడం అని నిరూపిస్తే రాజీనామా.. ఎమ్మెల్యే సవాల్!

    విజయనగరం మూడు లాంతర్ల కట్టడం కూల్చివేతపై ఎమ్మెల్యే కోలగ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి మాట్లాడుతూ..

    అది చారిత్రాత్మక క‌ట్టడ‌మ‌ని నిరూపిస్తే త‌న‌ ప‌దవికి రాజీనామా చేస్తాన‌ని, ఆర్కియాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో ఈ క‌ట్టడం న‌మోదైంద‌ని నిరూపిస్తారా? అని స‌వాల్ విసిరారు.

    - పూర్తి వివరాలు 

  • 24 May 2020 9:53 AM GMT

    ఉంఫాన్ తుపానుతొ పశ్చిమ బెంగాల్ లో 86 మంది మృతి!

    ఒక పక్క కరోనా కేసులతో దేశం వణుకుతున్న వేళా మరోపక్క ఉంఫాన్ తుఫాన్ విరుచుకుపడింది.

    ఈ తుఫాన్ తాకిడికి పశ్చిమబెంగాల్‌లో 86 మంది మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

    తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్ లో విద్యుత్, నీటి సరఫరా సమస్య తీవ్రం అయింది.                                 - పూర్తి వివరాలు 


  • 24 May 2020 8:03 AM GMT

    ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 66 కేసులు

    -రాష్ట్రంలో గత 24 గంటల్లో11,357 సాంపిల్స్ ని పరీక్షించగా, 66 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.

    -29 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

    -56 మంది కరోనా బారిన పడి మరణించారు.

    -ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చికిత్స పొందుతున్నవారి సంఖ్య 764గా ఉంది. 

  • ఎమ్మెల్యే సీతక్క సేవలకు ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రశంశలు
    24 May 2020 4:59 AM GMT

    ఎమ్మెల్యే సీతక్క సేవలకు ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రశంశలు

    - కరోనా కష్టకాలంలో కొండకోనలు దాటి దారిడొంక లేని గూడేలకు వెళ్లి ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న సేవ అద్భుతం.

    - వలస కూలీలకు అండగా నిలిచిన తీరు అనిర్వచనీయం.

    - వివిధ రంగాల్లో సేవలందించి చరిత్రలో నిలిచిన మహిళల గురించి విన్నాం.. చదివాం..

    - సీతక్కను కళ్లారా చూస్తున్నాం.

    - భావితరాలకు సీతక్క మార్గదర్శి..

    - ట్విట్టర్ లో మాజీ మంత్రి సోమిరెడ్డి

     



  • 24 May 2020 4:33 AM GMT

    దేశంలో పెరుగుతూనే ఉన్న కరోనా కేసులు

    దేశంలో 24 గంటల్లో 6,767 మందికి కొత్తగా కరోనా

    ➡️24 గంటల్లో 147 మంది మృతి

    ➡️కరోనా మృతుల సంఖ్య మొత్తం 3,867

    ➡️కరోనా కేసుల సంఖ్య మొత్తం 1,31,868

    ➡️73,560 మందికి ఆసుపత్రుల్లో చికిత్స

  • 24 May 2020 4:22 AM GMT

    - వికారాబాద్ జిల్లా.... కొడంగల్ లో మున్సిపల్ సిబ్బంది పనులకు హాజరు కాకుండా ధర్నా చేపట్టిన కార్మికులు.

    - తమ విధులు నిర్వహిస్తుండగా ఎస్సై ప్రభాకర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపణ.

    - ప్రజల కోసం పని చేస్తున్న మమ్మల్ని చిన్న చూపుతో మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని వ్యాఖ్య.

  • 24 May 2020 3:33 AM GMT

    టీటీడీ జేఈవో ఇంటిలో బంగారం చోరీ!

    - ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ రవీంద్రనాద్ తెలిపిన వివరాల ప్రకారం 

    - దాదాపు 6.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ 

    - టీటీడీ తిరుపతి జేఈవో బసంత్ కుమార్ బంగ్లాలో ఘటన 

    - శనివారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో మారు తాళాలతో బీరువా తెరిచి సొత్తు కొల్లగొట్టిన దుండగులు 

    - 18 తులాల బంగారం, 5 తులాల వెండి ఆభరణాలు పోయినట్టు బసంత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసుల దర్యాప్తు 


  • 24 May 2020 3:05 AM GMT

    రేపు వాతావరణం చల్లబడే చాన్స్!

    - నాలుగురోజులుగా ఎండ వేడిమితో అల్లాడిపోతున్న హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. 

    - మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణా మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ చెబుతోంది.

    - దీంతో రేపు ఎల్లుండి అంటే 25, 26 తేదీల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    - ఇకపోతే ప్రస్తుతం మాత్రం భానుడు బాగ్గుమంటూనే ఉన్నాడు.

    - ఎండా వేడిమి, ఉక్కపోత, వేడిగాలులు ముప్పేట దాడితో నగర జీవులు నరకయాతన పడుతున్నారు.

    - శనివారం  గరిష్ఠంగా 42.8, కనిష్ఠంగా 26.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. 

Print Article
More On
Next Story
More Stories