Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు శనివారం, 27 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, సప్తమి (రా.02:52 వరకు), పుబ్బనక్షత్రం (ఉ.10:11వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 27 Jun 2020 10:30 AM GMT

    - ఏల్లవరం గ్రామపంచాయతీ వాలంటీర్లు పై దాడి చేసిన కొరుప్రొలు సతీష్...

    - పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వాలెంటిర్లు..

    - ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సచివాలయ సిబ్బంది భోజనాలు చేస్తుండగా కార్యాలయానికి వచ్చిన సతీష్ విచక్షణారహితంగా వాలంటీర్ పై దాడి చేసి ఫోను లాక్కున్నాడు..

    - 2 రోజుల క్రితం కుల దృవపత్రం కావాలంటూ సచివాలయంలో దరఖాస్తు చేసినట్లు సమాచారం...

    - ఎందుకు కుల దృవపత్రం ఇంకా చేయలేదని వాలెంటర్ల్లు పై దాడి చేసి గాయపరిచాడు.

    - వాలెంటిర్లు గొలుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


  • 27 Jun 2020 9:37 AM GMT

    - అనంతపురం: కలెక్టర్ గంధం చంద్రుడు కి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్.

    - హిందూపురం ను జిల్లా కేంద్రం గా ప్రకటించాలని కోరిన బాలకృష్ణ.

    - జిల్లా ఏర్పాటుకు కావలసిన అన్ని సౌకర్యాలు హిందూపురం లో ఉన్నాయని స్పష్టం చేసిన ఎమ్మెల్యే.

    - హిందూపురం సమీపంలోని మలుగూరు వద్ద మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే బాలకృష్ణ

  • 27 Jun 2020 9:37 AM GMT

    - నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ కేంద్రంలో హరితహారం లో పాల్గొని మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.....

  • 27 Jun 2020 9:36 AM GMT

    - నల్గొండ : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్. బ్రాహ్మణ వెళ్ళేంల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయిస్తా... కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్లు ఖర్చు పెట్టిన సీఎం కేసీఆర్...50 కోట్లు ఖర్చుపెడితే బ్రాహ్మణ వెళ్లేంల ప్రాజెక్టు పూర్తయ్యేది కాదా ? ప్రాజెక్టు పూర్తయ్యితే నకిరేకల్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతుంది... రైతుల దగ్గర బాగా డబ్బు ఉన్నదని కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారు.. గ్రౌండ్ రియాల్టీ పరిశీలిస్తే ఆ పరిస్థితి లేదు.రైతులంతా అప్పుల్లో కూరుకు పోయారు.. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా నేటి నుంచి రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు అందిస్తాం.

  • 27 Jun 2020 9:36 AM GMT

    >> ఎంసిహెచ్ఆర్డి

    - ప్రభుత్వ భూముల రక్షణ పైన మంత్రి కేటిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం

    - రాజధానిలో పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైన ఈరోజు మంత్రులు కేటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కూమార్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

    - హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు, జిహెచ్ఎంసి, దేవాదాయ శాఖ అధికారులు

    - ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు- కేటిఆర్

    - ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తులకు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి

    - ముఖ్యంగా రెవిన్యూ, దేవాదాయ భూముల పైన ప్రత్యేక దృష్టి సారించాలి

    -  ప్రభుత్వ భూములను కాపాడటం కోసం ఇప్పటికే ఆయా శాఖల వద్ద ఉన్న సమాచారం మేరకు ఆయా స్థలాలకు జియో పెన్సింగ్ వేయడంతో పాటు జిఐఎస్ మ్యాపింగ్ చేయాలి

    - ప్రభుత్వ భూములపైన ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులను మంత్రులు కేటిఆర్, తలసాని అదేశం

  • 27 Jun 2020 9:35 AM GMT

    @విశాఖ: చిటీల పేరుతో టోకరా

    - సుమారు రెండు కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ

    - 140 కుటుంబాల నుంచి రెండు కోట్ల రూపాయలు వసూలు

    - చంద్రానగర్ లో కొణతాల లక్ష్మీమాధురీ, అప్పలరాజు దంపతుల నిర్వాకం

    - అప్పలరాజు రైల్వే ఉద్యోగి కావడంతో నమ్మకంగా చిటీ వేసిన స్థానికులు

    - రైల్వేలో సీనియర్ కమర్షియల్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న అప్పలరాజు

    - కోట్ల రూపాయల వసూలు చేసి చేతులెత్తేసిన దంపతులు

    - ఇటీవల లక్ష్మీమాధురీ మరణంతో చెల్లింపుల బాధ్యత తీసుకున్నభర్త అప్పలరాజు

    - నెలలు గడుస్తున్నా పైసా కూడా చెల్లించని అప్పలరాజు

    - డబ్బు కోసం నిలదీయగా రాత్రికి రాత్రే ఇల్లు మారిపోయిన అప్పలరాజు

    - లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితులు

  • 27 Jun 2020 9:34 AM GMT

    - జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన దాసరి ప్రభు...

    - తన సోదరుడు దాసరి అరుణ్ పై ఈ నెల 25 న జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదు...

    - పోలీస్ స్టేషన్ కు మరోసారి ప్రభు ను పిలిచిన జూబ్లీహిల్స్ పోలీసులు.

  • 27 Jun 2020 9:34 AM GMT

    - కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తో భేటియైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

    - కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేయనున్న రఘురామకృష్ణరాజు

  • 27 Jun 2020 9:01 AM GMT

    - కాంట్రవర్సీలో చిక్కుకున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’

    - సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాధ్, శీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’..సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై వివాదం నెలకొంది.. అయితే ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు అయిన హీరోయిన్లుకి హిందూ దేవతల పేర్లు పెట్టారని, వారితో అధిక మోతాదులో రొమాన్స్ నడిపారని రాకేష్ అనే వ్యక్తి చిత్రంపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. దీనితో ఈ చిత్రాన్ని వెంటనే ఆపేయాలని రాకేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు..

  • 27 Jun 2020 8:44 AM GMT

    - లోకసభ స్పీకర్ ఓం బిర్లాతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ.

    - సుమారు 50 నిమిషాల పాటు*జరిగిన చర్చ.

    - తనకు రక్షణ కల్పించే విషయంపై ప్రధానంగా మాట్లాడినట్లు సమాచారం.

    - రఘురామకృష్ణ రాజు భద్రతకు సంబంధించి తన ఓఎస్డీ ద్వారా హోం శాఖకు సమన్వయం చేస్తున్నట్లు చెప్పిన స్పీకర్.

    - కమిటీ సమావేశాలు, పార్లమెంటు సమావేశాల నిర్వహణపై కూడా ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం..

    - ఈ ఉదయం 10 గం.లకు రాజ్నాథ్ సింగ్ తో సమావేశం అయిన రఘురామ కృష్ణంరాజు.

    - పలువురు బీజేపీ సీనియర్ నేతలనూ కలిసే అవకాశం..

Print Article
More On
Next Story
More Stories