Live Updates:ఈరోజు (జూలై-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు గురువారం, 09 జూలై, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, కృష్ణపక్షం, చవితి (ఉ.10:10 వరకు), శతభిష నక్షత్రం (తె.03:09 వరకు) సూర్యోదయం 5:48am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు



Show Full Article

Live Updates

  • 9 July 2020 1:49 PM GMT

    యు ఎస్ ఐ బి సి ఇన్వెస్ట్మెంట్ వెబీనార్ లో మంత్రి కేటిఆర్

    - తెలంగాణలో పెట్టుబడుల వాతావరణాన్ని ప్రశంసించిన అమెరికన్ కంపెనీలు

    - నూతన పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రదేశమన్న అమెరికన్ కంపెనీల అధినేతలు

    - తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి అండగా ఉంటామన్న మంత్రి కేటీఆర్

    - టియస్ ఐపాస్ అద్భుతమైన విధానమన్న కంపెనీలు

  • 9 July 2020 1:25 PM GMT

    ప్రధాని నరేంద్రమోడీకి వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు లేఖ

    - ప్రధాని నరేంద్రమోడీకి వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు మరో లేఖ రాసారు.

    - వైసీపీ ఎంపీ రాసిన లేఖలో మోడీ పై ప్రశంసలు కురిపించారు.

    - వ్యవసాయరంగానికి మౌళిక సదుపాయాల కోసం లక్ష కోట్లు కేటాయిస్తూ మోడీ తీసుకున్న నిర్ణయానికి రఘురామకృష్ణం రాజు కృతజ్ఞతలు తెలిపారు.

    - పీఎం ఆవాజ్ యోజనా పథకం ద్వారా వలస కార్మికులకు కరోనా కష్టకాలంలోనూ అండగా నిలిచారని తెలిపారు.

    - పీఎం గరీభ్ కళ్యాణ్ యోజనా పథకం నవంబర్ వరకూ పొడిగించారు.

    - 81 కోట్ల మంది పేదల ఆకలి తీర్చిన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



  • 9 July 2020 1:09 PM GMT

    పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న గోదావరి వరద

    ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది.

    - అటు కాపర్ డ్యాం వద్ద నీటిమట్టం 20.95 మీటర్లకు చేరింది.

    - పోలవరం వద్ద కూడా నీటిమట్టం 6.89 మీటర్లకు చేరింది.

  • 9 July 2020 9:02 AM GMT

    - తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్ కి కరోనా భయం

    - స్థానిక జగ్గయ్య చెరువులో స్కీం పేరుతో ప్రజలను మోసం పచేసిన వ్యక్తుల్లో ఒకరికి కరోనా పాజిటివ్

    - విచారణ చేసే సమయంలో పోలీసులతో కలిసి ఉన్న వైనం

    - అరెస్టుకు ముందు పరీక్షలు నిర్వహించగా నేడు కరోనా పాజిటివ్గా నిర్ధారణ

    - అతడితో కాంటాక్ట్ అయిన వారందరికీ కరోనా భయం...

  • 9 July 2020 8:21 AM GMT

    @ విజయవాడలో ఈ మొబైల్ టెస్టింగ్ వాహనాల ద్వారా కోవిడ్ నమూనాలు తీసుకునే ప్రాంతాలు:

    1. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం

    2. గాంధీ మున్సిపల్ హైస్కూల్, వన్ టౌన్

    3. కృష్ణలంక

    4. విజయవాడ రైల్వే స్టేషన్

    5. బసవపున్నయ్య స్టేడియం, అజిత్ సింగ్ నగర్

    6. మేరీమాత టెంపుల్, గుణదల

    ఉదయం 8 నుంచి 5గంటల వరకు

    అపాయింట్మెంట్ కోసం కాల్ చేయాల్సిన నంబర్: 9963112781

    ఆన్ లైన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు: https://covid-andhrapradesh.verahealthcare.com/

  • భారత్ లో ఒక్కరోజులో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు
    9 July 2020 4:34 AM GMT

    భారత్ లో ఒక్కరోజులో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు

    Coronavirus: 24,879 కరోనా పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో నమోదు

    - అతి పెద్ద ఒక్కరోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇది

    - దీంతో  ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య  7.67 లక్షలు

    - మరణాలు 21,129 


  • 9 July 2020 4:25 AM GMT

    ఎనిమిది మంది పోలీసులను చంపిన వి కాస్ దుబే అరెస్ట్

    - యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అరెస్ట్

    - మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో అరెస్టు చేసిన పోలీసులు

    - నాలుగు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ లో 8  మంది పోలీసులను చంపి తప్పించుకున్న వికాస్ దుబే 

    - వికాస్ దుబే అనుచరుడిని నిన్న రాత్రి కాల్చి చంపిన పోలీసులు 

  • 9 July 2020 3:15 AM GMT

    అక్కడ కూడా కరోనాకు ఉచితంగా చికిత్స..

    - కరోనా వైరస్ వ్యాప్తిని ఈ మద్యకాలంలో నిరోధించే పరిస్థితి కనిపించడం లేదు.

    - పెరుగుతున్న కేసులకు అనుగుణంగా వీలైనంత మేర వైద్య సదుపాయాలు కల్పించాలన్నదే ప్రభుత్వాలు చేస్తున్న ఆలోచనగా కనిపిస్తోంది.

    - అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం కరోనా సోకితే ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

    - పూర్తి వివరాలు 

  • 9 July 2020 3:00 AM GMT

    ఏపీ సీఎంవోలో కీలక మార్పులు..

    - ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సీఎంవోలో మార్పులకు శ్రీకారం చుట్టారు.

    - ఇప్పటికే కొన్ని విభాగాలను చూస్తున్న వారికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

    - ఈ మార్పులు తొందర్లోనే అమల్లోకి వస్తాయని సీఎంవో ప్రకటించింది.

    - ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేషీలో పలు కీలక మార్పులు జరిగాయి. 

    - పూర్తి వివరాలు 

  • 9 July 2020 2:12 AM GMT

    ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి: మండల యస్ఐ రవికృష్ణ

    గుంటూరు : కారంపూడి పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర కళాశిల్క్ బజార్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ వీధి ని పూర్తిగా కట్టడి చేసినట్లు మండల యస్ ఐ రవికృష్ణ తెలిపారు.

    - ఈ సందర్భంగా కారంపూడి పట్టణంలో ఎక్కడైన ప్రజలు గుంపులుగా ఉండటం కానీ తిరగడం కానీ లేక షాప్ ల ముందు దుకాణాల ముందు ఎక్కువగా జనాలు ఉన్నట్లు గా ఉంటే మొదట ఆ షాప్ ని క్లోజ్ చేసి ఆ షాప్ ను పూర్తిగా నెల రోజుల పాటు క్లోజ్ చేయడమే కాక అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని యస్ఐ తెలిపారు.



Print Article
Next Story
More Stories