Live Updates: ఈరోజు (ఆగస్ట్-29) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 29 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం ఏకాదశి (ఉ. 9-45 వరకు) తదుపరి ద్వాదశి, పూర్వాషాఢ నక్షత్రం (మ. 3-21 వరకు) తదుపరి ఉత్తరాషాఢ, అమృత ఘడియలు (ఉ. 10-38 నుంచి 12-12 వరకు) వర్జ్యం (రాత్రి 11-24 నుంచి 1-01 వరకు) దుర్ముహూర్తం లేదు రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-౧౫

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 29 Aug 2020 7:38 AM GMT

    Amaravati updates: ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...

    అమరావతి..

    -ట్విట్టర్లో టీడీపీ అధినేత చంద్రబాబు...

    -నందమూరి హరికృష్ణగారంటే ఆపన్నులకు అండగా నిలిచే ఆత్మీయత, క్రమశిక్షణ, నిరాడంబరతలకు ప్రతిరూపం.

    -హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆయన స్మృతికి నివాళులు

  • 29 Aug 2020 7:25 AM GMT

    Amaravati updates: టిడిపి దళిత నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..

    అమరావతి..

    -టిడిపి దళిత నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

    -పాల్గొన్న టిడిపి ప్రజాప్రతినిధులు, దళిత నాయకులు

    -చిత్తూరు టిడిపి నాయకుల గృహ నిర్బంధాన్ని ఖండించిన చంద్రబాబు.

    -టిడిపి పట్టుబట్టడం వల్లే ఓం ప్రతాప్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ జరిపారు.

    -హడావుడిగా అంత్యక్రియలు జరపడం ఒక తప్పు.

    -రహస్యంగా పోస్ట్ మార్టమ్ జరపడం ఇంకో తప్పు

    -మృతుడి సెల్ ఫోన్ ను పోలీసులే లాగేసుకోవడం మరో తప్పు.

    -కేసు లేకపోతే ఓం ప్రతాప్ సెల్ ఫోన్ ఎందుకు తీసుకెళ్లారు..?

    -ఈ కేసులో మృతుడు ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ కీలకం.

    -ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ ను బైట పెట్టాలి.

    -అప్పుడే బెదిరింపులన్నీ బైటకు వస్తాయి.

    -బెదిరించి, ప్రలోభాలు పెట్టి జరిగిన నేరాన్ని కప్పి పెట్టలేరు.

    -చౌటపల్లిలో మరో దళితుడి ప్రాణాలు తీశారు.

    -ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయాడని నమ్మించారు.

    -ట్రాక్టర్ బోల్తాపడి చనిపోతే ఒళ్లంతా కాలిన గాయాలు ఎలా ఉన్నాయి..?

    -గతంలో ట్రిపుల్ మర్డర్ ను మించిన నేరాలు చిత్తూరులో జరుగుతున్నాయి.

    -చిత్తూరులో దళితులపై దమనకాండకు మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలే కారణం.

    -చిత్తూరు జిల్లాలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.

    -3నెలల్లో వరుసగా 2జిల్లాలలో శిరో ముండనాలు మానవత్వానికే సిగ్గుచేటు.

    -తూర్పుగోదావరి జిల్లాలో వర ప్రసాద్ శిరో ముండనం, విశాఖలో శ్రీకాంత్ శిరోముండనం.. వైసిపి ప్రభుత్వానికి సిగ్గుచేటు.

  • 29 Aug 2020 7:17 AM GMT

    Amaravati updates: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

    అమరావతి..

    -టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

    -*వాడుక భాషలో పుస్తకాలు రాయడానికి ఒక ఉద్యమమే చేసారు మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తిగారు.

    -ఆ ఫలితంగానే ఈరోజు తెలుగు భాష ద్వారా ప్రపంచ సాహిత్యం, చరిత్ర, విజ్ఞానం సామాన్యుల చేతికి అందింది.

    -అటువంటి తెలుగు భాషను రాష్ట్రంలో కనుమరుగు చేయాలని కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొడదాం.

    -ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ తెలుగుభాషాదినోత్సవ శుభాకాంక్షలు.

    -గిడుగు రామమూర్తిగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.

  • 29 Aug 2020 5:39 AM GMT

    Hyderabad updates: గాంధీ హాస్పిటల్ నుండి పరార్ అయిన ఖైదీల కోసం గాలిస్తున్న పోలీసులు..

    -గాంధీ హాస్పిటల్ నుండి పరార్ అయిన ఖైదీల కోసం గాలిస్తున్న పోలీసులు..

    -రెండు స్పెషల్ టీం లను ఏర్పాటు చేసిన పోలీసులు..

    -ఖైదీల ఆచూకీ తెలిపిన వారికి రీవార్డ్ ప్రకటించిన పోలీసులు..

    -నలుగురు నిందితులు సోమ సుందర్, నర్సింహా,ఆర్భాజ్, జావీద్ కరోనా పాజిటివ్..

    -కరోనా పాజిటివ్ ఉన్న నలుగురు బయట తిరగడం వలన ప్రమాదం అంటున్న పోలీసులు..

    -ఇప్పటికే నలుగురు ఖైదీల ఫోటోలు విడుదల చేసిన పోలీసులు.

    -ఖైదీల ఇంటి వద్ద తనిఖీలు చేసిన పోలీసులు.

  • 29 Aug 2020 5:34 AM GMT

    Amaravati updates: విద్యార్థుల గురించి అనగాని సత్య ప్రసాద్ వ్యాఖ్యలు...

    అమరావతి..

    -అనగాని సత్య ప్రసాద్ టీడీపీ MLA

    -మీ ప్రచార ఆర్భాటం కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతారా?

    -రాష్ట్రంలో స్కూళ్లు ఓపెన్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు.

    -కరోనా కి భయపడి తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు ముందుకు రావడం లేదు.

    -రాష్ట్రంలో రోజుకి 10 వేల కు పైగా కరోనా కేసులు నమోదవుతుంటే ఈ సమయంలో స్కూళ్లు ఓపెన్ చేస్తారా?

    -మీ ప్రచార అర్భాటం కోసం పిల్లల ప్రాణాల తో చెలగాటమాడుతారా?

    -జగనన్న విద్యా కిట్స్ పంపిణీ చేయాలంటే వాలంటీర్ల చేత ఇంటిఇంటికి వెళ్ళివిద్యార్థులకు అందజేయాలి.

    -అంతే తప్ప మీ రాజకీయ ప్రచారం కోసం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టొద్దు.

    -విద్యా శాఖ మంత్రి కరోనా బారిన ఇతర రాష్ట్రాల్లో ఉండి ఏపీలో మాత్రం స్కూళ్లు తెరుస్తామనటం వింతగా ఉంది.

  • 29 Aug 2020 5:25 AM GMT

    Vizianagaram updates:నెల్లిమర్లలోని మిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం..

    విజయనగరం..

    -నెల్లిమర్లలోని మిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం..

    -చనిపోయిన కరోనా బాధితుడిని తొలగించని వైనం..

    -రాత్రి చనిపోగా బోడీని తరలించకుండా వార్డులో ఉంచిన హాస్పిటల్ సిబ్బంది.

    -కరోనా రోగి చనిపోయిన 7గంటల వరకు వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందన్న కారణంగానే డేడ్ బాడిని మార్చురికి తరలించలేదని తెలుపుతున్న వైద్యులు

    -పక్క బెడ్లో డెడ్బాడి ఉండటంతో ఆందోళనకు గురవుతున్న తోటి రోగులు..

  • 29 Aug 2020 5:19 AM GMT

    Visakha updates: విశాఖ పెందుర్తి లో దళిత యువకుడు..

    విశాఖ...

    -విశాఖ పెందుర్తి లో దళిత యువకుడు

    -శిరోముండనం కేసును ఎస్సీ ఎస్టీ ఏసీబీకి బదిలీ చేసిన పోలీసులు..

    -శ్రీకాంత్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు.. ఈరోజు నూతన్ నాయుడు కుటుంబ సభ్యుల్ని సిబ్బందిని విచారించి అదుపులోకి తీసుకునే అవకాశం..

    -దర్యాప్తు జరుగుతోంది....ఆరోపణలు రుజువు అయితే కఠిన చర్యలు తీసుకుంటాం..

    త్రినాధ్ ఏసిపి ఎస్సీ ఎస్టీ సెల్ విభాగం..

  • 29 Aug 2020 5:10 AM GMT

    Amaravati latest news: మరికాసేపట్లో కౌంటర్ దాఖలుపై నేతలతో పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్

    అమరావతి..

    -మరికాసేపట్లో కౌంటర్ దాఖలుపై నేతలతో పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్...

    -రాజధాని తరలింపు వాజ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్ని రాజకీయ పక్షాలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో పార్టీ నేతల మనోగతం తెలుసుకోవాలని పవన్ కల్యాణ్ విర్చువల్ మీటింగ్...

    -ఉదయం 11 గంటలకు ఈ సమావేశం...

    -రాజధాని అంశంపై చోటు చేసుకొంటున్న పరిణామాలు,భూములు ఇచ్చిన రైతులకు న్యాయం అనే అంశాలే ప్రధాన చర్చ...

    -మీటింగ్ లో పాల్గొనున్న జనసేన న్యాయవిభాగం,పీఏసీ సభ్యులు,మూడు ప్రాంతాల నాయకులు....

  • 29 Aug 2020 4:20 AM GMT

    Rajamahendravaram updates: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని కోలుకున్న కోవిడ్ సోకిన ఖైదీలు

    తూర్పుగోదావరి..

    -రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని కోలుకున్న కోవిడ్ సోకిన ఖైదీలు

    -ఇటీవల కరోనా బారినపడిన ఖైదీలలో 281 మందికి నెగిటీవ్

    -జైలులోనే క్వారంటైన్‌ లో వుంచిన పాజిటీవ్ ఖైదీలకు రెండువారాలు దాటింది

    -దీంతో రెండో దఫా పరీక్షలు నిర్వహించగా మొత్తం 281 మంది ఖైదీలకు నెగెటివ్‌ వచ్చింది సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు.

    -ప్రస్తుతం పాజిటివ్‌ వచ్చిన అయిదుగురు ఖైదీలు చికిత్స పొందుతున్నారు

    -కోలుకున్న అయిదుగురు జైలు సిబ్బంది తిరిగి విధులకు హాజరయ్యారు...

  • 29 Aug 2020 4:15 AM GMT

    Visakhapatnam updates: భీమిలీ పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్సై షణ్ముక రావు తుపాకీ తో కాల్చుకొని మృతి..

    విశాఖ..

    -భీమిలీ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కాపులుప్పడా గ్రేహౌండ్స్ లో ఎస్సై షణ్ముక రావు తుపాకీ తో కాల్చుకొని మృతి..

    -అనారోగ్యంతో ఇబ్బందిపడడం తో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం..

    -కేసు నమోదు చేసిన భీమిలీ పోలీసులు..

Print Article
Next Story
More Stories