Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 26 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి ఉ.11-16వరకు తదుపరి ఏకాదశి | ధనిష్ఠ నక్షత్రం ఉ.07-40 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: మ.03-15 నుంచి 04-56 వరకు | అమృత ఘడియలు రా.01-21 నుంచి 02-42 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2:30 నుంచి 03:17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati Updates: వ్యవసాయానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారు..
    26 Oct 2020 10:39 AM GMT

    Amaravati Updates: వ్యవసాయానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారు..

    అమరావతి....

    -Hmtv తో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే

    -నేను 14 ఎకరాలు పంట వేసాను..

    -5 ఎకరాల్లో 20 నుండి 25 సాతం ఈ నకిలీ విత్తనాలు వచ్చాయి..

    -సాధారణంగా 1.5 శాతం మాత్రమే బెరుకు విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుంది..

    -గుంటూర్ జిల్లా వ్యవసాయ అధికారులు దృష్టికి తీసుకువెళ్ళా..

    -పొలం పరిశీలించారు.. రిపోర్టు రాగానే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా..

    -ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, సీఎం దృష్టికి తీసుకువెళ్తా...

    -ఏపీ సీడ్స్ కి సరఫరా చేసే విత్తనాల కంపిణీలపై విజిలెన్స్ జరుగుతుందా లేదా చూడాలి..

    -ఇలాంటి విత్తనాలు సరఫరా చేసిన మంజీరా కంపిణీ పై చర్యలు తీసుకోవాలి..

    -విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా..

  • Nara Lokesh Comments: జగన్ బయటకు రాకపోవడం వల్లే నేను బయట తిరుగుతున్నాను..
    26 Oct 2020 10:35 AM GMT

    Nara Lokesh Comments: జగన్ బయటకు రాకపోవడం వల్లే నేను బయట తిరుగుతున్నాను..

     పశ్చిమ గోదావరి జిల్లా

     పశ్చిమలో నారా లోకేష్ కామెంట్స్

    -జగన్ చేతకాని తనం వల్లే నేను ఇప్పుడు బయట తిరగాల్సి వస్తుంది..

    -నేను బయట తిరగతాన్ని ఎగతాళి చేస్తూ ఓ మంత్రి నన్ను ఎద్దుతో పోల్చారు...నేను ఎద్దునైతే మీ ముఖ్యమంత్రి దున్నపోతా

    -వరద బాధితులకు కనీసం ఇవ్వాల్సిన 25 కేజీల బియ్యం కూడా ఇవ్వడం లేదు.

    -జగన్ రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించడం లేదు.

    -అనంతపురంలో ప్రకటిస్తుంటే మాపైనే దాడులు చేస్తున్నారు.

    -జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ కేవలం రైతులకు 25లక్షలు ఖర్చు చేశారు.

    -కొల్లేరుకు ఇంతకుముందు ఎన్నడూ లేని రీతిలో వరదలు వస్తే వారిని ఆదుకునే చర్యలు లేవు

    -ఉభయగోదావరి, కృష్ణా జిల్లా రైతలకు సూచిస్తున్నా.. మోటార్లకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించాలి

    -ఈ అంశంపై టీడీపీ రైతులకు అండగా ఉంటుంది

    -దళిత, బీసీ రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.. అది ఎలా రైతు సంక్షేమం అవుతుంది

    -రైతుబజార్లలో కిలో ఉల్లిపాయలు 40రూపాయలకు అమ్ముతున్నారు.. మరీ దారుణం

    -పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయకుండా.. కేంద్రం వద్ద తాకట్టు పెట్టేసారు

    -నిధులు రాకపోతే మాపై ట్విట్లు చేయడం కాదు.. పనికి మాలిన యంపీలు ప్రాజెక్టు నిధుల కోసం పోరాటం చేయాలి

    -అమరావతి కోసం రైతులు పోరాటం చేస్తుంటే, బయట నుంచి మనుష్యులను తీసుకు వచ్చి కేసులు పెడుతున్నారు

    -ఢిల్లీ చుట్టూ ప్రతిసారి 59లక్షల ఖర్చుపెట్టి అటూ ఇటూ తిరుగుతున్నాడు.. ఎందుకో తెలీదు.. రాష్ట్రానికి ఏమీ లాభం రాలేదు

  • Guntur District Updates: కేసు మిస్టరీని ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు...
    26 Oct 2020 10:31 AM GMT

    Guntur District Updates: కేసు మిస్టరీని ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు...

     గుంటూరు జిల్లా...

    -గుంటూరు జిల్లా,తెనాలి సుల్తానాబాద్ హత్య కేసు మిస్టరీని ఛేదించిన త్రీ టౌన్ పోలీసులు

    -ఈ నెల 21న జరిగిన చంద్రనాయక్ హత్యకు సంబంధించి భార్యే కీలక సూత్రధారిగా పోలీసులు నిర్ధారణ

    -వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో చంద్ర నాయక్ ను హత్యచేయించిన భార్య జ్యోతి బాయ్

    -అక్రమ సంబంధమే హత్యకు కారణమని తేల్చిన పోలీసులు

    -చంద్రనాయక్ భార్య జ్యోతితో పాటు ఆమె ప్రియుడు శివ నాగార్జున అరెస్టు

    -హత్యకు సహకరించిన జ్యోతి అక్క కొడుకు సాయి కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Visakha Updates: గీతం విధ్యా సంస్థలు ఆక్రమణల కు పాల్పడిన భూమిని ప్రభుత్వం స్వాధీనం పరచుకుంది....
    26 Oct 2020 10:28 AM GMT

    Visakha Updates: గీతం విధ్యా సంస్థలు ఆక్రమణల కు పాల్పడిన భూమిని ప్రభుత్వం స్వాధీనం పరచుకుంది....

    విశాఖ...

    ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ కామెంట్స్....

    -40 ఎకరాల గీతం విధ్యా సంస్థలు ఆక్రమణల కు పాల్పడిన భూమిని ప్రభుత్వం స్వాధీనం పరచుకుంది....

    -భూమి విలువ 800 కోట్ల పైచిలుకు

    -విశాఖ లో ప్రభుత్వ భూములు కాపాడాలని ప్రభుత్వం చూస్తుంది

    -దీనిని పొలిటికల్ కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు..

    -సామాన్య ప్రజలు ఎవరూ ఇది సరికాదు అని అనలేదు.. కేవలం టిడిపి నాయకులే అంటున్నారు

    -56 పేజీల రిట్ పిటీషన్ వేశారు,వచ్చిన కోర్ట్ ఆర్డర్ ను వక్రీకరించి ప్రజల ముందు పెట్టాలని చూస్తున్నారు

    -కోర్ట్ లో గీతం భూమి మాదే అని చెప్పలేదు

    -ప్రభుత్వ భూముల్లో ఆక్రమించి కట్టిన భూముల్ని ప్రభుత్వ అవసరాలకు రానున్న కాలంలో ఉపయోగిస్తాం

    -ఆగస్టు3 ముఖ్యమంత్రి కి గీతం వారు లేఖలో 40 ఎకరాలు అభివృద్ధి కోసం కావాలని రాసారు.ఇంతకన్నా అది ప్రభుత్వ భూమి అని చెప్పడానికి సాక్ష్యాలు   కావాలా...

    -గీతంలో ఒక్క పేద వాడైనా చదువుకొనే అవకాశం ఉందా..

    -చంద్రబాబు కు విద్యా దానం కంటే భూ దానం ఎక్కువయ్యింది .

  • Nellore District Updates: అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి...
    26 Oct 2020 10:19 AM GMT

    Nellore District Updates: అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి...

    నెల్లూరు :--

      ఏపి టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు. పీసీ

    -- రాష్ట్రంలో దళితులపై దాడులు,దళిత మహిళలపై అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి

    -- 5లక్షల భూమిని 50లక్షలకి పెంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే దళితుల భూమిని ప్రభుత్వం లాక్కుంటుంది

    -- అభివృద్ధి వికేంద్రీకరణకి టీడీపీ వ్యతిరేకం కాదు వికేంద్రీ కరణ పేరుతో అమరావతికి అన్యాయం చేయడానికి మేము వ్యతిరేకం

    -- గాంధీజి కలలను సాకారం చేస్తా అన్న ముఖ్యమంత్రి సచివాలయలను అడ్డుపెట్టుకుని దళారులకు ఉడిగం చేస్తున్నారు

    -- దళిత రైతు జైపాల్ పై అక్రమ కెలుసు పెట్టాడని మేము తీవ్రంగా కండిస్తున్నాం,దీనిపై కేంద్ర ఎస్సి ఎస్సి కమీషన్,హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకెళ్లతం

    -- దళితులు,రైతుల సంక్షేమం గురించి ఈ ప్రభుత్వనికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు,ధరల స్థిరీకరణ గురించి అస్సలు చర్యలే లేవు

    --దళారుల వెనకున్న మాఫీయాని బహిర్గతం చేసేవరకు మా పార్టీ పోరాటం చేస్తుం ది.

  • Kadapa District Updates: ప్రభుత్వ వైఫల్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది..
    26 Oct 2020 10:17 AM GMT

    Kadapa District Updates: ప్రభుత్వ వైఫల్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది..

    కడప :

    -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కామెంట్స్..

    -ప్రభుత్వ వైఫల్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది..

    -టీడీపీ అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఉండేది..

    -వైసీపీ అసమర్థత కారణంగా పోలవరంకు కేంద్రం నిధుల కేటాయింపులో వెనుకడుగు వేస్తోంది..

    -నిధులు కావాలని అడగటానికి వైసీపీ ఎంపీలకు నోరు రావడం లేదు..

    -పోలవరం పూర్తి కాకపోతే రాయలసీమ ప్రాంతం పూర్తి ఎడారిగా మారుతుంది..

    -హోదా విషయంలో ఢిల్లీ పెద్దల మెడలు వంచుతామన్న వైసీపీ నేతలు వారి వద్దే వంగి వంగి మెడలు వంచుతున్నారు..

    -పోలవరం నిధులు రాబట్టలేకపోతే ఎంపీలు రాజీనామా చేయాలి..

    -వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతూ, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ...

    -గీతం, నారాయణ విద్యాసంస్థలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గు చేటు..

  • Amaravati Updates: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే కేంద్రం నిధులు..
    26 Oct 2020 9:58 AM GMT

    Amaravati Updates: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే కేంద్రం నిధులు..

    అమరావతి..

    -పునరావాసంతో సంబంధం లేదంటున్న కేంద్రం..

    -ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారంలో వెలుగులోకి కీలక అంశాలు..

    -2016 సెప్టెంబర్‌ నాటి కేంద్ర ఆర్థిక శాఖ మెమో ప్రకారం..

    -పోలవరం నిర్మాణం నిధులు మాత్రమే కేంద్ర భరిస్తుందని స్పష్టీకరణ..

  • C.M.Jaganmohan reddy: దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం...
    26 Oct 2020 9:42 AM GMT

    C.M.Jaganmohan reddy: దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం...

      ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ కామెంట్స్:

    – ఇది నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా.

    – ఎస్సీలు ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలి.

    – ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామిక వేత్తలుగా, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

    – రాష్ట్రంలో ఎప్పుడూ , ఎక్కడా జరగని విధంగా రూ. 1 కోటి రూపాయిలు కూడా ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం.

    – ఎస్సీలు, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేసేలా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాం.

    – వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్యక్రమాలను చేపడుతున్నాం.

    – ఫెసిలిటేషన్‌ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం.

    – 16.2 శాతం ఎస్సీలకు, 6శాతం ఎస్టీలకు ఇండస్ట్రియల్‌ పార్కుల్లో భూముల కేటాయింపు .

    – స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్‌.. పేటెంట్‌ రుసుముల్లో రాయితీలు... ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్నాయి.

    – ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి, వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టాం.

    – సచివాలయాల్లో కూడా 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి.

    – పూర్తి ఫీజు రియింబర్స్‌ మెంట్‌ అమలుచేస్తున్నాం.

    – అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందడానికి గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను చేపట్టాం.

    – ఆసరా, చేయూత లాంటి పథకాలనుకూడా చేపట్టాం.

    – మార్కెటింగ్‌లో ఇబ్బందులు పడకూడదని అమూల్‌ను, పీ అండ్‌జీని, రిలయన్స్‌లాంటి సంస్థలను తీసుకు వచ్చాం.

    – చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు నష్టపోకుండా చూశాం.

    – ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

    – రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని ఈ కార్యక్రమాలు చేపట్టాం .

    – అందరికీ మంచి జరగాలని, అలాగే మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

    – ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఎలా చేయాలి? ఎవరిని కలవాలి? దీనిపై అధికారులు దృష్టిపెట్టాలని సమావేశంలోఆదేశించిన సీఎం

  • Amaravati Updates: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకోసం ప్రత్యేక పారిశ్రామిక విధానం...
    26 Oct 2020 9:13 AM GMT

    Amaravati Updates: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకోసం ప్రత్యేక పారిశ్రామిక విధానం...

    అమరావతి:

    // ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం

    // ‘‘జగనన్న వైయస్సార్‌ బడుగు వికాసం’’ను క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన సీఎం వైయస్‌.జగన్‌

  • 26 Oct 2020 9:10 AM GMT

    West Godavari Updates: ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి...

    పశ్చిమ గోదావరి జిల్లా.. 

    // ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి అశ్వియుజమాస నిజకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

    // శ్రీవారిని అమ్మవార్లను పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తెలు గా అలంకరణ చేసి తంతు సంకల్పం నిర్వహించారు.

    // ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు S.V.సుధాకరరావు మరియు MP. మార్గాని.భారత్ రామ్.

Print Article
Next Story
More Stories