Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 26 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి ఉ.11-16వరకు తదుపరి ఏకాదశి | ధనిష్ఠ నక్షత్రం ఉ.07-40 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: మ.03-15 నుంచి 04-56 వరకు | అమృత ఘడియలు రా.01-21 నుంచి 02-42 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2:30 నుంచి 03:17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Merugu Nagarjuna: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రారంభించడం ఆనందదాయకం...
    26 Oct 2020 1:09 PM GMT

    Merugu Nagarjuna: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రారంభించడం ఆనందదాయకం...

    అమరావతి....

    - మేరుగ నాగార్జున, ....వైసీపీ ఎమ్మెల్యే

    - రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రారంభించడం ఆనందదాయకం

    - ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను అని సీఎం ని ఈ దేశంలో ఎప్పుడన్నా చూసామా

    - ఈ రోజు మేము ధైర్యంగా ప్రరిశ్రమల స్థాపనలో ముందుకువెళతారు

    - స్కిల్ డెవలెప్మెంట్ తో ఎన్నో సౌకర్యాలు దీనిలో ఉన్నాయి

    - మొత్తం రాయతీలతో, ఇండస్ట్రియల్ పార్క్ లో మాకు ప్రత్యేక కేటాయింపులు చేయడం శుభపరిణామం

    - అందుకే మేమంతా ముఖ్యమంత్రిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం

    - కోవిడ్ సమయంలో 270 కోట్ల రూపాయలు దళిత పారిశ్రామికవేత్తలకు మేలు జరిగింది

    - సాయం చేయడం చేతకాని వారు సంక్షేమ పథకాలు దళితులకు అందకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు

  • Amaravati Updates: అధికారులతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష...
    26 Oct 2020 12:55 PM GMT

    Amaravati Updates: అధికారులతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష...

    అమరావతి...

    * కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై అధికారులతో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

    * క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌,     ఇతర ఉన్నతాధికారులు.

  • East Godavari Updates: భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తోట త్రిమూర్తులు...
    26 Oct 2020 12:29 PM GMT

    East Godavari Updates: భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తోట త్రిమూర్తులు...

    తూర్ప గోదావరి జిల్లా....

    మండపేట....

    -- మండపేటలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మండపేట వైసీపీ ఇన్చార్జ్ తోట త్రిమూర్తులు

    -- మండపేటలోని విజయలక్ష్మి నగర్ లో మెయిన్ రోడ్డు అనుకునే మండపేట నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నిర్మాణం

  • Thammineni Seetharam Comments: ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు..
    26 Oct 2020 12:01 PM GMT

    Thammineni Seetharam Comments: ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు..

    శ్రీకాకుళం జిల్లా..

    - స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..

    - బిసి కార్పొరేషన్ పదవులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావనేది తెలుగుదేశం పార్టీ అభిప్రాయం..

    - అందుకే టిడిపి హయాంలో బిసిలకు అవకాశం కల్పించలేదు..

    - మా ప్రభుత్వానికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి..

    - అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు..

    - ప్రతీ రాజకీయ పార్టీకి ఎన్నికలే గీటురాయి..

    - మేము దౌర్జన్యాలు చేస్తున్నాం అని చెప్పుకుని టిడిపి ఎన్నికల్లోకి వెళ్ళాలి..

    - మేము అభివృద్ధి, సంక్షేమం చేస్తున్నాం అని ప్రజల్లోకి వెళతాం..

    - మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి పాజిటివ్ దృక్పథంతో ప్రజలకు పాలన అందిస్తున్నారు..

  • Seediri Appalaraju Comments: క్యాబినెట్ కూర్పులో జగన్ బిసిలకు ప్రాధాన్యత ఇచ్చారు..
    26 Oct 2020 11:56 AM GMT

    Seediri Appalaraju Comments: క్యాబినెట్ కూర్పులో జగన్ బిసిలకు ప్రాధాన్యత ఇచ్చారు..

    శ్రీకాకుళం జిల్లా..

    మంత్రి అప్పలరాజు కామెంట్స్..

    -బిసి కార్పొరేషన్ ల ద్వారా వెనుకబడిన తరగతుల వారికి రాజ్యాధికారం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన..

    -బిసిలకు ఇచ్చిన కార్పొరేషన్ పదవులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు అని అచ్చెన్నాయుడు మాట్లాడడం హాస్యాస్పదం..

    -తనను రాష్ట్ర అధ్యక్షుడు చేయడంతోనే తెలుగుదేశం బిసిలకు పెద్దపీట వేసిందని అచ్చెన్నాయుడు చెబుతున్నారు..

    -గతంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బిసి కాదా ?

    -బిసి, ఎస్సి, ఎస్టీ లకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని చట్టం చేసిన ఘనత జగన్ ది..

    -ఏ రకంగా టిడిపి బిసిల పార్టీ అనేది అచ్చెన్నాయుడు సెలవివ్వాలి..

  • Ananthapur Updates: కొడికొండ వద్ద వాహనాల తనిఖీల్లో పోలీసుల చేతి వాటం..
    26 Oct 2020 11:51 AM GMT

    Ananthapur Updates: కొడికొండ వద్ద వాహనాల తనిఖీల్లో పోలీసుల చేతి వాటం..

    అనంతపురం :

    - వ్యాపారి వద్ద బిల్లులు లేకపోవడంతో మద్యం బాటిళ్లు పగులకొట్టి రెండు బిస్కెట్లు తీసుకుని వదిలేసిన కానిస్టేబుళ్లు

    - ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన భాగోతం

    - ఒక ఎక్సైజ్, ఒక సివిల్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్న చిలమత్తూరు పోలీసులు.

  • West Godavari Updates: లోకేష్ పర్యటన అపశృతి...
    26 Oct 2020 11:36 AM GMT

    West Godavari Updates: లోకేష్ పర్యటన అపశృతి...

    పశ్చిమగోదావరి జిల్లా

    - సిద్దాపురం ఈ పర్యటనలో అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయిన ట్రాక్టర్

    - స్వయంగా ట్రాక్టర్ నడుపుతున్న నారా లోకేష్

    - పార్టీ నేతలు ఎలర్ట్ అవడంతో తప్పిన ప్రమాదం

  • Kishan Reddy: చైనా సరిహద్దులో బీజేపీ పాగా...
    26 Oct 2020 10:50 AM GMT

    Kishan Reddy: చైనా సరిహద్దులో బీజేపీ పాగా...

    కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రి.

    # లద్దాక్ అటాన్మెస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందజ

    # మెత్తం 26సీట్లకు ఎన్నికలు

    # ఫలితాలు వెలువడిన స్థానాలు 14

    # ఆధిక్యతలో బీజేపీ

    # 10స్థానాలు గెలుచుకున్న బీజేపీ

    # రెండు కాంగ్రెస్, రెండు స్థానాలు గెలుచకున్న ఇండిపెండెంట్లు

    # ఎన్నికల ఇంఛార్జ్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

  • Vizianagaram Updates: పార్వతీపురం ఐటిడిఎ వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా...
    26 Oct 2020 10:45 AM GMT

    Vizianagaram Updates: పార్వతీపురం ఐటిడిఎ వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా...

    విజయనగరం :

    * పార్వతీపురం మండలం సంగంవలస, రావికోన గ్రామాలలో ఎక్సైజ్ అధికారులు మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని గిరిజనుల ఆందోళన

    * పోలీసులను నిలదీస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపణ

    * ఐటిడిఎ పీవో కి వినతిపత్రం ఇచ్చిన గిరిజనులు

  • Vizianagaram Updates: ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ...
    26 Oct 2020 10:42 AM GMT

    Vizianagaram Updates: ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ...

     విజయనగరం :

    -ఎమ్ ఆర్ కాలేజీ లో ఇంటర్ విద్య ని మూసివేస్తామని ప్రభుత్వానికి తెలియజేశారు

    -ఎమ్ ఆర్ కాలేజి లోని ఇంటర్ విద్యార్దులను ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అడ్మిషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం

    -మాన్సాస్ లో జరుగుతున్న వివాదాలు కుటుంబ తగాదాలు

    -మాన్సాస్ లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు

    -ఆస్తులు అన్యాక్రాంతం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది

Print Article
Next Story
More Stories