Live Updates: ఈరోజు (25 అక్టోబర్, 2020 ) బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
అందరికీ దసరా శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. రెండు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో వైభవంగా కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా కొన్ని నెలలుగా పండుగలకు దూరం అయిపోయిన ప్రజలు ఈసారి దసరా పండుగను కరోనా నిబంధనల నేపథ్యంలోనే సంబరంగా జరుపుకుంటున్నారు.
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Oct 2020 8:19 PM IST
Kurnool updates: మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి...
కర్నూలు...
//మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా...
//మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారని ఎంతైటి వారైనా ఏపార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలి..
//కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ప్యాలకుర్తి గ్రామంలో 8వ తరగతి చదువుతున్న బాలికపై శుక్రవారం దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
//భాదిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరుపున అండగా ఉంటామని బాలిక తల్లిదండ్రులకు భారోసా ఇచ్చిన తెలుగుదేశం నాయకులు
- 25 Oct 2020 8:08 PM IST
Amaravati updates: విశాఖ గీతం యూనివర్సిటీ కట్టడాలు కూల్చివేత నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు స్టే...
అమరావతి...
//నవంబర్ 30 వరకు కట్టడాలు కూల్చివేత నిలుపుదలపై స్టే ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు
//కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
//స్టే ఆర్డర్ ఆదేశాలు ఇచ్చి తదుపరి విచారణ నవంబర్ 30కి వాయిదా వేసిన న్యాయస్థానం
- 25 Oct 2020 8:05 PM IST
Hyderabad updates: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించనున్న మంత్రులు..
హైదరాబాద్..
//రేపు హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని, ప్రశాంత్ రెడ్డి
//జియగూడా, గోడే క కబర్, కట్టెల మండి ...
//ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను ప్రారంభం చేయనున్న మంత్రులు
- 25 Oct 2020 8:02 PM IST
Adilabad updates: పిప్పరవాడ టోల్ ప్లాజా వద్ద కంటైర్ లో అకస్మాత్తుగా మంటలు....
ఆదిలాబాద్..
//మంటలు చెలరేగడంతో దగ్దమైనా కంటైనర్..
//ముప్పై లక్షల అస్తినష్టం
//డిల్లీ నుండి చెన్నై వెళ్లుతున్నా కంటైనర్
- 25 Oct 2020 7:58 PM IST
Vijayawada updates: ముగిసిన దసరా ఉత్సవాలు..
విజయవాడ...
//ప్రారంభం అయిన దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఊరేగింపు
//డప్పులు, మేళతాలాలు, సింగారి మేళం నడుమ ఘనంగా జరుగుతున్న నగర ఊరేగింపు.
//మరికాసేపట్లో ఊరేగింపుగా తప్పోత్సవానికి ఉత్సవమూర్తులను తీసుకురానున్న అధికారులు.
//నదీ విహారం లేకపోవడంతో హంస వాహనంలో ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించనున్న వేద పండితులు
- 25 Oct 2020 7:56 PM IST
Vijayawada Durgamma updates: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వేణుగోపాల్..
విజయవాడ
-చల్లబోయిన వేణుగోపాల్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
-ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
-చెడు పై మంచి సాధించడమే విజయదశమి.
-నవరాత్రులలో అమ్మవారు ప్రజలకు ఎలా వరాలు ఇస్తున్నారో అలాగే ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు.
-బలహీన వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచిన దసరా ఈ సంవత్సరం దసరా.
-బలహీన వర్గాలకు చెందిన తనను మంత్రిగా జగన్ చేశారు.
-మరిన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే విధంగా అమ్మవారి కరుణా కటాక్షాలు సీఎం జగన్ కి ఉండాలి.
- 25 Oct 2020 4:50 PM IST
Tirumala updates: సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను తిరుపతిలో జారీ..
తిరుమల..
//శ్రీవారి దర్శనార్థం ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను అక్టోబరు 26వ తేదీ నుండి తిరుపతిలో జారీ
//తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో గల కౌంటర్లలో జారీ చేస్తారు. రోజుకు 3 వేల టోకెన్లను ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుండి భక్తులకు అందజేస్తారు .
//శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒక రోజు ముందు టోకెన్లు ఇస్తారు.
//టోకెన్లు పొందిన భక్తులు మరుసటి రోజు దర్శనానికి రావలసి ఉంటుంది.
//దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి తిరుమలకు అనుమతిస్తారు.
- 25 Oct 2020 4:44 PM IST
East Godavari updates: వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి..
తూర్పు గోదావరి జిల్లా
//కోరుకొండ మండలం కనుపూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని, వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.
//కోరుకొండ సీతానగరం మండలాల్లో వివిధ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.
- 25 Oct 2020 4:38 PM IST
Botsa Satyanarayana Comments: గీతం యూనివర్సిటీ పై బొత్స వ్యాఖ్యలు..
//గీతం తమవని చెప్పుకుంటున్న భూములు ప్రభుత్వానివి
//చంద్రబాబు హయాంలో గీతం యూనివర్సిటీ భూ కబ్జా చేసింది
//ముందస్తు నోటీసులు ఇచ్చాకే ఆక్రమణలు తొలగించారు.
//పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తాం
//పోలవరం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేశారు.
//పోలవరం పూర్తి చేయడం పై మా ప్రభుత్వం ప్రాధాన్యత
- 25 Oct 2020 4:35 PM IST
Botsa Satyanarayana Comments: చంద్రబాబు బాబు గ్రాఫిక్స్ తో మెట్రో చూపెట్టారు..
విశాఖ..
//విశాఖ లో మెట్రో రైల్ త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష
//మీడియం మెట్రో కంటే లైఫ్ మెట్రో ఖర్చు తక్కువుగా ఉంటుంది
//స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం వరకు మెట్రో, బీచ్ , పోస్ట్ ఆఫీస్ వరకు మెట్రో ప్రణాళికలు
//మహారాష్ట్ర కు చెందిన విఎంటీఎస్ కంపెనీ కు కు మెట్రో ప్రాజెక్ట్ అందజేత
//మెట్రో రైలు కు 1.25 నుంచి 1.5 కిలోమీటర్ల వరకు స్టాప్ లు ఉండాలి
//ఢిల్లీ, బొంబాయి, పట్టణాలతో సమానంగా విశాఖ కూడా అభివృద్ధి చెందుతుంది
//బి ఆర్ టి ఎస్ ఇంకా ల్యాండ్ అక్విజిషన్ లో ఉంది













