Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 25 Aug 2020 11:17 PM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 25 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం సప్తమి: (సా. 4-47 వరకు) తదుపరి అష్టమి; విశాఖ నక్షత్రం (రా. 7-05 వరకు) తదుపరి అనూరాధ; అమృత ఘడియలు (ఉ. 10-50 నుంచి 12-20 వరకు) వర్జ్యం (రా. 10-51 నుంచి 12-21 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా. 10-53 నుంచి 11-39 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • MLA Laxma Reddy : యూరియా పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
    25 Aug 2020 3:48 PM IST

    MLA Laxma Reddy : యూరియా పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

    మహబూబ్ నగర్ జిల్లా: జడ్చర్ల మండల కోడుగల్ గ్రామంలో రైతులకు యూరియా పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, లింగంపేట్, గంగాపూర్ గ్రామాల సమీపంలో ఉన్న చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..

    నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో విధి నిర్వహణలో కరోనా బారిన పడి మృతి చెందిన వైద్య సిబ్బందికి నివాళులు అర్పించిన నారాయణపేట జిల్లా వైద్యాధికారులు

  • CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కుల పంపిణి.
    25 Aug 2020 3:45 PM IST

    CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కుల పంపిణి.

    సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫౌండ్ లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదుగా చెక్కుల పంపిణి. ఈ కార్యక్రమం లో డీసీఎంస్ చేర్మెన్ శివకుమార్, సీడీసీ చేర్మెన్ బుచ్చిరెడ్డి, జడ్పీటీసీలు, మనోహర్ గౌడ్, కొండల్ రెడ్డి, మండల్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి.

  • 25 Aug 2020 3:42 PM IST

    సంగారెడ్డి జిల్లా కొహీర్ మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణి. హాజరైన ఎమ్మెల్యే మనిక్ రావు, ఎమ్మెల్సీ ఫారీదుద్దీన్, ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ సభ్యులు రాందాస్.

  • V.Hanumantha Rao: పిచ్చి రాతలు రాస్తే.. భ‌ట్టి, ఉత్తమ్ లు ఎందుకు నోరు విప్పడం లేదు: వి.హన్మంత్ రావు
    25 Aug 2020 3:38 PM IST

    V.Hanumantha Rao: పిచ్చి రాతలు రాస్తే.. భ‌ట్టి, ఉత్తమ్ లు ఎందుకు నోరు విప్పడం లేదు: వి.హన్మంత్ రావు

    - మా నాయకురాలి పై సోషల్ మీడియా లో పిచ్చి రాతలు రాస్తే డిసిప్లేన్ కమిటీ , బట్టి , ఉత్తమ్ లు ఎందుకు నోరు విప్పడం లేదని వి.హన్మంత్ రావు, మాజీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

    - మరోసారి ఏఐసిసి అధ్యక్ష రాలు గా సోనియా గాంధీ బాధ్యతలు తీసుకోవడం సంతోషకకమైన విషయం.

    - 23 మంది లేఖ రాయడం గత కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు లేదు.

    - సోనియా వయసు అయిపోయింది. రాహుల్ పని అయిపోయిందని మా పార్టీ లో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. 

    కోర్ కమిటీ ఎందుకు పెట్టడం లేదో స్పష్టం చెయాలి

    రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గతంలో లేని కొత్త కల్చర్ వచ్చింది. మా లాంటి సీనియర్ల పై ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తున్నారు.

    దీనికి ఫుల్ స్టాప్ పడకపోతే భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు.

    - రాష్ట్ర పార్టీలో జరుగుతున్న తంతు పై చాల సార్లు ఢిల్లీ నేతలకు చెప్పాను. పట్టించుకొనే పరిస్థితి లేదు.

    - కాంగ్రెస్ లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న వారు ఎవరో ఎంక్వేరి జరగాలి.

    - లేఖ రాసిన వారికి , రాష్ట్రంలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నేతల కు బీజేపీ మీద , మోడీ మీద రాహుల్ , సోనియాగాంధీ లు చేస్తున్న పోరాటం కనిపించడం లేదా?

    - సోషల్ మీడియా వచ్చినప్పుటి నుండి కాంగ్రెస్ లో ఎవరికి వారు పిచ్చి రాతలు రాయించిన వారిపై చర్యలు తీసుకోవాలి.

    - ఉత్తమ్ , బట్టి లు సోనియాగాంధీ , రాహుల్ గాంధీ ల విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.

    - ఒక ఎంపీ గాంధీ కుటుంభంపై సోషల్ మీడియా లో పిచ్చి రాతలు రాయిస్తూ నాకు తెలియదని చేతులు ఎత్తేస్తున్నరు

    - అతని మీద ఎంక్వేరి జరగాలి. లేదా నినె స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తాను

  • కరోనాపై అలుపెరగని యుద్ధం చేస్తున్నాం: డీఎంఈ రమేష్ రెడ్డి
    25 Aug 2020 3:12 PM IST

    కరోనాపై అలుపెరగని యుద్ధం చేస్తున్నాం: డీఎంఈ రమేష్ రెడ్డి

    DME రమేష్ రెడ్డి

    వైద్య సిబ్బంది అలుపెరగని యుద్ధం కరోనా పై చేస్తున్నాం..

    2 వేలకు మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా భారిన పడ్డారు..

    హైదరాబాద్ లోనే కాకుండా, జిల్లాల్లో సైతం కరోనా ట్రీట్మెంట్ అందిస్తున్నాం..  

    రిమోట్ ఏరియాల్లో కూడా కరోనా ట్రీట్మెంట్ అందుతుంది..

    యాంటీ వైరల్ డ్రగ్స్ ను అన్ని ఆస్పత్రులకు సప్లై చేస్తున్నాం..

    కరోనా , కాకుండా ఇతర రోగాల విషయంలో కూడా చికిత్స అందించాల్సిన అవసరం ఉంది.

    వైద్య సిబ్బంది బాగోగుల పై మా మొదటి ప్రాధాన్యత..

    వైద్య సిబ్బందిలో 16 మంది వరకు కరోనా తో చనిపోయారు..

  • కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
    25 Aug 2020 2:47 PM IST

    కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి

    మెదక్ జిల్లా రామాయంపేట మండలం లో 140 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి

  • Minister Harish Rao: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు
    25 Aug 2020 2:41 PM IST

    Minister Harish Rao: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

    సిద్దిపేట జిల్లా: గజ్వేల్ నియోజకవర్గంలో రూ. 4 కోట్ల 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

  • Srisailam fire Accident: శ్రీశైల ప్రమాద బాధిత కుటుంబానికి టీడీపీ అండా: చ‌ంద్ర‌బాబు
    25 Aug 2020 2:35 PM IST

    Srisailam fire Accident: శ్రీశైల ప్రమాద బాధిత కుటుంబానికి టీడీపీ అండా: చ‌ంద్ర‌బాబు

    సూర్యపేట జిల్లా: శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన సూర్యపేట జిల్లా కు చెందిన దరావత్ సుందర్ నాయక్ కుటుంబాన్ని ఫోనులో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.....

    తెలుగు దేశం పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చిన చంద్ర బాబు నాయుడు...


     

  • సీజనల్ డీసీజ్ లను నిర్లక్ష్యం చేయొద్దు: వైద్య‌శాఖ
    25 Aug 2020 2:27 PM IST

    సీజనల్ డీసీజ్ లను నిర్లక్ష్యం చేయొద్దు: వైద్య‌శాఖ

    ప్రతి పది లక్షల మందికి 27502 పరీక్షలు చేస్తున్నాం

    హైదరాబాద్ లోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో పక్క రాష్ట్రాల రోగులు కూడా ఉన్నారు..

    వరుస వర్షాల వల్ల సీజనల్ రోగాలు కూడా పెరిగాయి..

    సీజనల్ డీసీజ్ లకు వుండే లక్షణాలు కోవిడ్ కు కూడా ఉంటాయి..

    సీజనల్ డీసీజ్ లను నిర్లక్ష్యం చేయొద్దు.. టెస్టులు చేయించుకోవాలి..

    వైద్య సిబ్బంది అలుపెరగని యుద్ధం కరోనా పై చేస్తున్నాం..

    2 వేలకు మందికి పైగా వైద్య సిబ్బంది కరోనా భారిన పడ్డారు..

  • Bandi Sanjay Press Meet: దేవుణ్ణి నమ్మని మంత్రి కేటీఆర్: బండి సంజయ్
    25 Aug 2020 2:20 PM IST

    Bandi Sanjay Press Meet: దేవుణ్ణి నమ్మని మంత్రి కేటీఆర్: బండి సంజయ్

    నల్లగొండ జిల్లా చిట్యాల మండలం కేంద్రం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్ కామెంట్స్.

    1,తెలంగాణా లో హిందువుల పండుగలను జరుపుకొనివ్వని కేసీఆర్.

    2,తెలంగాణా ని వ్యతిరేకించిన ఎంఐఎం తో పొత్తు పెట్టుకుని తెలంగాణా సమాజాన్ని హిందువులను అవమనిస్తున్న కేసీఆర్.

    3,నిరంకుశంగా పరిపాలన చేస్తూ రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుండు.

    4.దొంగ పూజలు దొంగ యాగాలు చేస్తూన్న కేసీఆర్

    5,తండ్రి పూజలు చేస్తే నాస్తికుడు కేటీఆర్ అయినాడు

    6,దేవుణ్ణి నమ్మని మంత్రి కేటీఆర్

K V D Varma

K V D Varma

Next Story