Live Updates:ఈరోజు (ఆగస్ట్-25) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 25 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం సప్తమి: (సా. 4-47 వరకు) తదుపరి అష్టమి; విశాఖ నక్షత్రం (రా. 7-05 వరకు) తదుపరి అనూరాధ; అమృత ఘడియలు (ఉ. 10-50 నుంచి 12-20 వరకు) వర్జ్యం (రా. 10-51 నుంచి 12-21 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా. 10-53 నుంచి 11-39 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Aug 2020 4:41 PM IST
KTR Meeting on industries: పరిశ్రమల శాఖ పైన మంత్రి కేటీఆర్ సమీక్ష
ఇప్పటికే భూముల పొంది కార్యకలాపాలు ప్రారంభించకుండా ఉన్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశం
నిర్ణీత గడువు లోపల కార్యకలాపాలు ప్రారంభించకుంటే, కంపెనీలకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటాం
స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పైన మంత్రి కేటీఆర్ సమీక్ష
ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యకలాపాల విస్తరణకు సూచన
ఈ- స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ ఫార్మా సిటీ పై మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలు శాఖల ముఖ్య కార్యదర్శులు.
హైదరాబాద్ ఫార్మా సిటీ కాలుష్య రహితంగా ఉండబోతుంది.
- 25 Aug 2020 4:37 PM IST
Jurala Project Updates: జూరాల ప్రాజెక్టుకు తగ్గుముఖం పట్టిన వరద
మహబూబ్ నగర్ జిల్లా : జూరాల ప్రాజెక్టుకు తగ్గుముఖం పట్టిన వరద...
09 గేట్లు ఎత్తి వేత
ఇన్ ఫ్లో: 1 లక్ష 02 వేల క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 93 వేల క్యూసెక్కులు.
పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం: 9.657 టీఎంసీ.
ప్రస్తుత నీట్టి నిల్వ: : 9.111 టీఎంసీ.
పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
ప్రస్తుత నీటి మట్టం: 318.250 మీ.
- 25 Aug 2020 4:35 PM IST
Corona Updates In Manchiryala: మంచిర్యాలలో కరోనా కలకలం
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మహాలక్ష్మి వాడాలో 19 మందికి కరోనా రావడంతో కంటోన్మెంట్ జోన్ గా చేసిన మెడికల్ ఆఫీసర్,స్థానిక అధికారులు
- 25 Aug 2020 4:31 PM IST
BJP Protest: ఉద్యోగుల తొలగింపుపై బిజెపి ఆందోళన
మంచిర్యాల. ఎంసీసీ పరిశ్రమ లో ఉద్యోగుల తొలగింపు పై బిజెపి అందోళన..
సిమెంట్ పరిశ్రమలో తోలగించిన ఉద్యోగులను విదుల్లోకి తీసుకోవాలని డిమాండ్.
- 25 Aug 2020 4:09 PM IST
Online Classes: సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ లో తరగతులు
సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులకు ఆన్లైన్ లో తరగతులు
ఈనెల 27 నుంచి అధ్యాపకులు విధులకు హాజరు అవ్వాలి
ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత విద్యా మండలి
- 25 Aug 2020 4:05 PM IST
ChandaNagar: చందానగర్ లో దారుణం
చందానగర్ లో దారుణం
సిరి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ ను చితకొట్టిన మహిళ..
అపార్ట్ మెంట్ లోకి వెళ్లకుండా అడ్డుకున్న వాచ్ మెన్....
అనుమతి లేకుండా అపార్ట్ మెంట్ లోకి వెళ్తున్నా యువతి....
అపార్ట్ మెంట్ లోకి అనుమతి లేదంటూ నిలిపి వేసిన వాచ్ మన్..
ఆగ్రహంతో కారు దిగి వచ్చి వాచ్ మన్ ని చితకొట్టిన మహిళ....
చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వాచ్ మన్.
- 25 Aug 2020 4:01 PM IST
Old Man Dead With Corona: మంచిర్యాలలో విషాదం.. కరోనా వచ్చిదని తెలియగానే వృద్దుడికి గుండెపోటు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో పాత మంచిర్యాల కోవిడ్ నిర్దారణ కేంద్రం వద్ద కుప్పకూలిన వృద్ధుడు
కరోన పాజిటివ్ రావడంతో విషయం తెలియడంతో అక్కడే గుండేపోటుతో మ్రుతి చెందిన వృద్దుడు
విలపిస్తున్నా వృద్దుని కుటుంబ సభ్యులు
- 25 Aug 2020 3:53 PM IST
Black Magic: మంత్రాల నెపంతో వ్యక్తి పై గ్రామస్తుల దాడి..
యాదాద్రి భువనగిరి జిల్లా: రాజపేట మండలం దూదివేంకటాపురంలో మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఎల్లయ్య అనే వ్యక్తి పై గ్రామస్తుల దాడి......
తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు....
సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
- 25 Aug 2020 3:52 PM IST
Jagityal: గొల్లపల్లి మండలం శంకర్ రావుపేట గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన ....
జగిత్యాల జిల్లా :
- గొల్లపల్లి మండలం శంకర్ రావుపేట గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన ....
- పెద్దచేరువులో చేపపిల్లలను వదిలిన మంత్రి
- అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత,జిల్లా కలెక్టర్ రవి...
- 25 Aug 2020 3:52 PM IST
Karimnagar District: హుజూరాబాద్ పట్టణంలో సినిమా సీన్ తలపించిన ప్రేమ వ్యవహారం...
కరీంనగర్ జిల్లా
- హుజూరాబాద్ పట్టణంలో సినిమా సీన్ తలపించిన ప్రేమ వ్యవహారం...
- పెళ్లి చేసుకుని బరాత్ లో ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో వధువును అడ్డుకున్న ప్రియుడు....
- తనను ప్రేమించి వేరే వ్యక్తితో ఎలా పెళ్లి చేసుకున్నావ్ అంటూ ప్రశ్నించిన ప్రియుడు వంశీ...
- నన్ను ప్రేమించి నీకు మోసం ఎలా చేయాలి అనిపించిందంటూ బరాత్ లో వీరంగం..
- పెళ్లి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంశీ పై కేసు నమోదు చేసిన పోలీసులు.
- అనంతరం అవమానంతో పెళ్లి కూతురుని వదిలి వెళ్లిపోయిన వరుడు..











