Live Updates: ఈరోజు (సెప్టెంబర్-24) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 24 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | అష్టమి: రా.11-44 తదుపరి నవమి | మూల నక్షత్రం రా.11-36 తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం: ఉ.8-11 నుంచి 9-43 వరకు తిరిగి రా.10-04 నుంచి 11-36 వరకు | అమృత ఘడియలు: సా.5-26 నుంచి 6-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.9-52 నుంచి 10-40 వరకు తిరిగి మ.2-41 నుంచి 3-29 వరకు | రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-54

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 24 Sep 2020 11:34 AM GMT

    Medak ACB updates: నగేష్ కేసులో ముగిసిన ఏసీబీ కస్టడీ విచారణ..

    ఏసీబీ అప్ డేట్స్ మెదక్ కేసు....

    -మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో ముగిసిన ఏసీబీ కస్టడీ విచారణ.

    -నాలుగు రోజులుగా ఏసీబీ ఆఫీస్ లోనే విచారణ చేసిన ఏసీబీ

    -బినామిల పాత్రపై క్లారిటీ తీసుకున్న ఏసీబీ.

    -6గురు బినామిలను నాలుగు రోజుల పాటు విచారణ.

    -మెదక్ తో పాటు హైదరాబాద్ శివరాళ్లలో బినామిల పేర్లతో అస్స్తులు ఉన్నట్టు గుర్తింపు.

    -నగేష్ భినమిలా నుండి వివరాలు సేకరించిన ఏసీబీ..

    -నిందితులను ఏసీబీ ఆఫీస్ నుంచి వైద్య పరీక్షలకు తరలించిన ఏసీబీ

    -అనంతరం న్యామూర్తి ముందు హాజరు పరచనున్న ఏసీబీ.

    -కేస్ లో నిందితులు ఇచ్చిన స్టేట్ మెంట్ పై కొనసాగుతున్న దర్యాప్తు..

  • 24 Sep 2020 11:32 AM GMT

    Mahabubabad updates: ఇసుక మాఫియాకు యువకుడు బలి, మరో యువకుడి పరిస్థితి విషమం.

    మహబూబాబాద్ జిల్లా :

    -మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లిలో బైక్ ను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్

    -వీఎస్ లక్మీపురం గ్రామానికి చెందిన ఓయువకుడు మృతి, మరో యువకుడికి గాయాలు

    -ఎలాంటి అనుమతులు లేకుండా రేయంబవళ్లు నడుస్తున్న ఇసుక ట్రాక్టర్లు, పట్టించుకోని అధికార యంత్రాంగం

    -అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్లు తమ ఊరి నుంచి వెళ్లినందుకు డబ్బులు వసూలు చేస్తు అక్రమార్కులను ప్రోత్సహించిన గుండంరాజుపల్లి గ్రామ   పంచాయతీ

  • 24 Sep 2020 11:22 AM GMT

    Rangareddy district updates: ఆంధ్ర బ్యాంకు లో నకిలీ గోల్డ్ పెట్టుకొని బ్యాంకుకు టోకరా చేసిన వ్యక్తి..

    రంగారెడ్డి జిల్లా..

    -మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ లో ఆంధ్ర బ్యాంకు లో గోల్డ్ కొలతలు చూసుకునే సిబ్బంది చేతివాటం

    -నకిలీ గోల్డ్ పెట్టుకొని బ్యాంకుకు టోకరా చేసిన వ్యక్తి. రెండున్నర కోట్ల వరకు బ్యాంకు నుంచి రుణాలు పొందిన వ్యక్తి.

    -అతన్ని పరిచయస్తులు పేర్ల మీద గోల్డ్ తాకట్టు పెట్టి బ్యాంకు నుండి లోన్ తీసుకున్న వ్యక్తి.

    -నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అతనికి సహకరించిన బ్యాంకు సిబ్బంది మొత్తం ముగ్గురు వ్యక్తులు.

    -పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

    -పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ చేరుకున్న ఎల్బినగర్ జోన్ డిసిపి సన్ ప్రీత్ సింగ్.

    -పలువురు బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు

  • Mancherial district updates: భారీ వర్షాలకు అన్నారం బ్యారేజ్ లోకి వచ్చి చేరుతున్న వరద నీరు..
    24 Sep 2020 11:19 AM GMT

    Mancherial district updates: భారీ వర్షాలకు అన్నారం బ్యారేజ్ లోకి వచ్చి చేరుతున్న వరద నీరు..

    మంచిర్యాల జిల్లా :-

    -ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు అన్నారం బ్యారేజ్ లోకి వచ్చి చేరుతున్న వరద నీరు.

    -అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తక పోవడంతో ఎగువ ప్రాంతాల్లో ని పంట పొలాలను ముంచిన వరద నీరు.

    -త్వరితగతిన గేట్లు ఎత్తి పంట పొలాలను కాపాడాలని కోరుతూ అన్నారం బ్యారేజ్ వద్ద రైతుల ఆందోళన,


  • 24 Sep 2020 11:08 AM GMT

    Pragathi Bhavan: ప్రగతి భవన్ లో మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం..

    ప్రగతి భవన్..

    -రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్ లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర     అంశాలపై చర్చ..

    -ఈ సమావేశం లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం...

    -హైదరాబాద్ లో ఆర్ టి సి బస్సులపై తిరిగే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం..

    -హైదరాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఆర్ టి సి బస్ లు తిప్పడానికి అనుమతి ఇవ్వాలని సీఎం కొరనున్నరూ..

    -హైదరాబాద్ లో 10 శాతం ఆర్ టి సి బస్ లు నడిపించేందుకు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం...

  • 24 Sep 2020 10:49 AM GMT

    Telangana High Court: అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంపై హైకోర్టులో విచారణ..

    టీఎస్ హైకోర్టు....

    -న్యాయవాది గోపాల్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ

    -రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

    -అక్టోబరు 14 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం,

    -తదుపరి విచారణ ను అక్టోబర్ 15కి వాయిదా వేసిన హైకోర్టు.

  • 24 Sep 2020 10:46 AM GMT

    Telangana High Court: కరోనాకు సంబంధించిన పిటీషన్ లపై హైకోర్టులో విచారణ..

    టీఎస్ హైకోర్టు.....

    -రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎందుకు తగ్గించారని ప్రశ్నించిన హైకోర్టు

    -మహారాష్ట్రలో రోజుకు లక్షన్నర కరోనా పరీక్షలు చేస్తున్నారన్న హైకోర్టు

    -రోజుకు 40వేల పరీక్షలు చేస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదన్న హైకోర్టు

    -డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు ఎందుకు లేవన్న హైకోర్టు

    -మిగతా రాష్ట్రాల కన్నా ఎందుకు వెనకబడి ఉన్నారో తెలపాలన్న హైకోర్టు

    -వెయ్యి మందికి కనీసం మూడు బెడ్ లు లేక పోవడానికి కారణాలు తెలపాలన్న హైకోర్టు

    -తదుపరి విచారణ ను అక్టోబరు 8 కి వాయిదా వేసిన హైకోర్టు

  • 24 Sep 2020 10:43 AM GMT

    Pragathi Bhavan: మరికాసేపట్లో ప్రగతి భవన్ లో మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం..

    ప్రగతి భవన్..

    -రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేత్తర ఆస్తుల ఆన్ లైన్ నమోదు, నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర   అంశాలపై చర్చ.

    -ఈ సమావేశం లో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్.

  • T Harish Rao Comments: గతంలో పాస్ బుక్కుల కోసం ఆఫీసు ల చుట్టు తిరిగే పరిస్థితి: మంత్రి హరీష్ రావు!
    24 Sep 2020 10:41 AM GMT

    T Harish Rao Comments: గతంలో పాస్ బుక్కుల కోసం ఆఫీసు ల చుట్టు తిరిగే పరిస్థితి: మంత్రి హరీష్ రావు!

    -రైతులు బ్యాంకుల చుట్టు, రెవెన్యూ ఆఫీసు ల చుట్టూ తిరగకుండా కొత్త రెవెన్యూ చట్టం ఉపయోగపడుతుంది.

    -రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చాము.

    -పంట పంటకు ఏడాదికి ఎకరానికి 10 వేలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీ ఆర్ ఎస్ మాత్రమే.

    -తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పింఛన్లు కోసం 11400 కోట్లు ఖర్చు పెడుతుంది, కేంద్రం కేవలం 200 కోట్లు మాత్రమే ఇచ్చ గొప్పలు చెప్పుకుంటున్నారు.

    -దుబ్బాక ఉప ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ అభ్యర్థి ని గెలిపించండి.

    -డిజిటల్ సర్వే తో భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చేస్తాము.

    -సమగ్ర భూ సర్వే రైతులపాలిట వరం.

    -రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మందికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వార సహాయం చేసాము.

    -కరోన కారణం గా ఆదాయం తగ్గి ఆర్ధిక ఇబ్బందులు ఉన్న...సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఆపలేదు.

    -మన రాష్టానికి వాటా గా వచ్చే 10 వేల కోట్లు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది.

    -రాష్టానికి రావాల్సిన GST బకాయిలను చెల్లించిన తర్వాత బీజేపీ నాయకులు మాట్లాడాలి - మంత్రి హరీష్ రావు..

  • 24 Sep 2020 10:30 AM GMT

    Warangal Urban Updates: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్‌పెక్టర్ల బదిలీ..

    వరంగల్ అర్బన్..

    -వి.ఆర్ లో వున్న జె. రామకృష్ణ కు టాస్క్ ఫోర్స్.

    -ఎ. శ్రీనివాస్ కు స్టేషన్ ఘన్‌పూర్ కు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.

Print Article
Next Story
More Stories