Live Updates:ఈరోజు (ఆగస్ట్-22) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 22 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 22 Aug 2020 11:33 PM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 22 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్ల పక్షం శు.తదియ రా.2.21 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఉత్తర రా.1.30 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.9.41 నుంచి 11.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.19 వరకు, అమృతఘడియలు... సా.6.42 నుంచి 7.42 వరకు. సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-19.

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు జేజేలు!

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • 22 Aug 2020 4:54 PM IST

    మహబూబాబాద్ :

    - మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తాళ్లూరి బాబు గుండెపోటుతో మృతి

    - సంతాపం ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్

  • 22 Aug 2020 4:53 PM IST

    Nirmal: నిర్మల్ కడెం ప్రాజెక్టు బారీగా చెరుతున్నా వరదనీరు..

    - నిర్మల్ కడెం ప్రాజెక్టు బారీగా చెరుతున్నా వరదనీరు..

    - కుడి,ఎడమ కాల్వలకు నుండి పంటల కోసం నీటిని విడుదల చేస్తున్నా అదికారులు.

    - కుడి కాల్వ నుండి 14 క్యూసెక్కుల నీరు

    - ఎడమ కాల్వ. నుండి 590 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అదికారులు

    - ఉన్నాతాదికారుల అదేశం మేరకు పంటపోలాలకు నీటిని విడుదల చేసి‌న అదికారులు

  • 22 Aug 2020 4:52 PM IST

    - నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట:- అగ్ని ప్రమాదానికి గురైన శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సి ఐ డి. విచారణ అధికారి గోవింద్ సింగ్, ఐజీ సుమతీ బృందం

  • 22 Aug 2020 4:51 PM IST

    ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లు రవి ల అరెస్ట్ లు అక్రమం..

    - ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లు రవి ల అరెస్ట్ లు అక్రమం..

    - ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్..

    - శ్రీశైలం లో జరిగిన దుర్ఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిల అరెస్టులు అక్రమం..

    - ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారు. ఇది హక్కులను హరించివేయుడమే...

    - వెంటనే ప్రజా ప్రతినిధులను అక్కడకి పంపి పరిశీలించేలా అవకాశం ఇవ్వాలి.

  • 22 Aug 2020 4:50 PM IST

    - మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ లో గొనె విద్యాసాగర్ రావు ఇంటి తో పాటు మరో ఇంట్లో పేకాట ఆడుతున్న 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ముగ్గురు పరారీ,

    - 2 లక్షల 70 వేల 250 రూపాయలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు,

    - గతంలో పలు జిల్లాల్లో పట్టుబడిన పేకటారాయుళ్లని తేల్చిచెప్పిన- రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ

  • 22 Aug 2020 4:50 PM IST

    Warangal: గిరిప్రసాద్ నగర్ కాలనీలో విషాదం

    వరంగల్ అర్బన్:

    - గిరిప్రసాద్ నగర్ కాలనీలో విషాదం

    - పొంగుతున్న నాలాలో పడి మూడేళ్ల చిన్నారి మృతి.

    - అధికారుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆగ్రహం.

  • 22 Aug 2020 4:48 PM IST

    Khairatabad: ఖైరతాబాద్ గణేష్ కు భారీగా చేరుకున్న భక్తులు

    ఖైరతాబాద్

    - ఖైరతాబాద్ గణేష్ కు భారీగా చేరుకున్న భక్తులు

    - ప్రస్తుతం దర్శనం ఆపేసిన నిర్వాహకులు

    - సాయంత్రం తరువాత మళ్ళి దర్శనం ఉంటుంది అని చెప్పనప్పటికినీ పెద్ద ఎత్తున గుమి కూడిన భక్తులు

  • 22 Aug 2020 4:47 PM IST

    Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద

    నిజామాబాద్:

    - శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద

    - ఇన్ ఫ్లో 40 వేల క్యుసెక్కులు

    - ఔట్ ఫ్లో 863 క్యూసెక్కుల

    - పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు

    - ప్రస్తుత నీటి మట్టం 1087 అడుగులు

    - నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు

    - ప్రస్తుతం 73 టిఎంసీ లు

  • 22 Aug 2020 3:37 PM IST

    Congress Leaders: డీజీపీ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నేతలు అరెస్ట్..

    - డీజీపీ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నేతలు అరెస్ట్..

    - డిజీపీ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్, అనిల్ కుమార్ యాదవ్,కిరణ్ కుమార్ లను అరెస్ట్ చేసిన పోలీసులు..

    - డిజీపీ కి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు..

    - డిజీపీ అపాయింట్ మెంట్ లేదన్న పోలీసులు..

    - శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదం పై వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన ఎంపీ రేవంత్ రెడ్డి , మల్లు రవి ఇతర కాంగ్రెస్ నేతలు అరెస్ట్ చేయడం పై డిజీపీ ని కలవడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు...

    - డిజీపీ ఇంటి దగ్గర అనుమతి లేదని కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.

    - అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలను పంజాగుట్ట పీఎస్ కు తరలించిన పోలీసులు.

  • 22 Aug 2020 3:07 PM IST

    సిద్దిపేట;

    - ఈనెల 16వ తేదిన దర్గాపల్లి వాగులో గల్లంతు అయిన జంగపల్లి శ్రీనివాస్, తంగళ్లపల్లి నివాసి, మృతదేహం దర్గాపల్లి వాగు, సికింద్లాపూర్ శివారులో లభ్యం...

K V D Varma

K V D Varma

Next Story