Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Rajath kumar: చరిత్ర లో ఎప్పుడు ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు..
    21 Oct 2020 11:08 AM GMT

    Rajath kumar: చరిత్ర లో ఎప్పుడు ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు..

    రజత్ కుమార్ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి @జల సౌధ

    #గత నాలుగు ఐదు రోజుల నుండి భారీ వర్షాలు పడుతున్నాయి.

    #లాస్ట్ వన్ వీక్ లో చాలా వర్షపాతం నమోదు అయింది.

    #నగరంలో 185 చెరువులు ఉన్నాయి,అన్ని జాగ్రత్తలు తీసుకంటున్నాం.

    #185 చెరువులు పూర్తి స్థాయి లో నిండి ఉన్నాయి

    #అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నాం

    #సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 15 టీం లు ఏర్పాటు చేస్తున్నాం.

    #ఈ బృందాలు అన్ని చెరువులను పరిశీలిస్తారు ,పరిశీలించడమే కాదు ఎక్కడికక్కడ చెరువులను బాగు చేసేందుకు నిధులు విడుదల చేస్తారు.

    #చెరువుల పునరుద్ధరణ కు 2 కోట్లు విడుదల చేస్తారు.

    #మూడు చెరువులు గండి పడినాయి, వీటిని అన్నిటినీ మరమ్మతులు చేస్తున్నాం.

    #53 డ్యామేజ్ అయ్యాయి ,ముసా పెట్,బండ్ల గూడ, మాన్సూర బాద్ చెరువులు తెగినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇవి అవాస్తవం కానీ పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి.

    #చెరువుల కబ్జా చేసినవాటి జోలికి మేము వెళ్లడం లేదు .చెరువుల కబ్జా పై చర్యలు చేపడుతాం.

    #నగర ప్రజలకి అత్యవసర పరిస్థితి లలో నేపథ్యంలో తీసుకోవల్సిన వాటిపై దృష్టి పెట్టాం.

    #శాశ్వత మరమ్మతులు కోసం 40 కోట్ల రూపాయలు అవసరం.

    #హైదరాబాద్ నగరంలో 53 చెరువుల డ్యామేజ్ అయ్యాయి.

    #నా విజ్ఞప్తి చెరువుల దగ్గర ఎవరు సెల్ఫీ లు దిగవద్దు,చెరువుల దగ్గరకు వెళ్లవద్దు.

  • A.C.B.Court updates: ఓటుకు నోటు కేసు పై ఏసీబీ కోర్ట్ విచారణ...
    21 Oct 2020 10:52 AM GMT

    A.C.B.Court updates: ఓటుకు నోటు కేసు పై ఏసీబీ కోర్ట్ విచారణ...

    ఏసీబీ కోర్ట్......

    -తమ పేర్లు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు..

    -డిశ్చార్జ్ పిటిషన్లపై నేడు కౌంటరు దాఖలు చేసిన ఏసీబీ..

    -ఏసీబీ ధాఖలు చేసిన కౌంటర్ పై ఈ నెల 23 న వాదనలు వింటామన్న ఏసీబీ..

    -తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్.

  • Siddipet updates: ఆర్ఎస్ కు మద్దతుగా మహిళ ల భారీ ర్యాలీ.. ర్యాలీ లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు..
    21 Oct 2020 10:38 AM GMT

    Siddipet updates: ఆర్ఎస్ కు మద్దతుగా మహిళ ల భారీ ర్యాలీ.. ర్యాలీ లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు..

    సిద్దిపేట..

    - దుబ్బాక పుర విధుల్లో టి ఆర్ఎస్ కు మద్దతుగా మహిళ ల భారీ ర్యాలీ.. ర్యాలీ లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ..

    - గులాబీ మయమైన దుబ్బాక పట్టణం..

    - మంగళ హరతులు.. డప్పు చప్పుళ్ల తో భారీగా తరలివచ్చిన మహిళ లోకం..

    - కాసేపట్లో ప్రారంభం కానున్న మహిళ బహిరంగ సభ...

  • K Krishna Sagar Rao: దుబ్బాక ఉప ఎన్నికల్లో పచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది...
    21 Oct 2020 10:33 AM GMT

    K Krishna Sagar Rao: దుబ్బాక ఉప ఎన్నికల్లో పచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది...

    బీజేపీ మీడియా ప్రకటన..

    -కె.కృష్ణసాగర రావు...బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి.

    -కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న టిఆర్ ఎస్ ప్రభుత్వం దుబ్బాక ఉప ఎన్నికల్లో పచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది.

    -బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు ప్రచారానికి అప్రజాస్వామికంగా, అనైతికంగా, అక్రమ మార్గాల్లో టిఆర్ఎస్ అడ్డంకులు సృష్టించడాన్ని బీజేపీ ఖండిస్తోంది.

    -దీనిపై బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తుంది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని చట్టపరమైన చర్యలనూ పరిశీలిస్తాం.

    -ఈ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం టిఆర్ఎస్ లో కనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉన్నందున పోలీసులను, అధికార యంత్రాంగాన్ని అనైతికంగా వాడుకుంటూ   నీతి, నిజాయితీ లేని రాజకీయాలు చేస్తోంది టిఆర్ ఎస్

    -దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావుకి సమాన అవకాశాలు కల్పించకుండా, ఆయన హక్కులను కాలరాస్తూ, ఆయనపై అధికార దుర్వినియోగానికి   పాల్పడితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో బాధ్యత వహించాలి.

  • 21 Oct 2020 10:24 AM GMT

    Nizamabad updates: పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు..

    నిజామాబాద్..

    -పోలీస్ పరేడ్ మైదానం లో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవ వేడుకలు

    -హాజరైన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ కార్తికేయ, కామారెడ్డి ఎస్.పి. శ్వేతా రెడ్డి.

    -విధి నిర్వహణలో అమరులైన వారికి నివాళులు

  • Hyderabad updates: రేపు తెలంగాణ కి కేంద్ర బృందం..
    21 Oct 2020 10:22 AM GMT

    Hyderabad updates: రేపు తెలంగాణ కి కేంద్ర బృందం..

    #రేపు సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కేంద్ర బృందం.

    #రెండు రోజుల పాటు రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం

    #వరద ప్రాంతాల్ల నష్టం తీవ్రతను అంచనా వేయనున్న కేంద్ర బృందం.

    #ఈ 13వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో 5 వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం...

    #తక్షణ సహాయంగా 1350 కోట్ల ను విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి లేఖ రాసిన సీఎం కేసీఆర్

    #ఈ నేపథ్యంలో నే కేంద్ర బృందం రాక

  • Hyderabad updates: హైదరాబాద్ లో గంగమ్మ తల్లి కి పూజలు...
    21 Oct 2020 10:19 AM GMT

    Hyderabad updates: హైదరాబాద్ లో గంగమ్మ తల్లి కి పూజలు...

    హైదరాబాద్.. 

    -నగరం లో పెద్ద ఎత్తున్న వరదలు వస్తుండడంతో మూసి నది ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి కి పూజలు చేస్తున్న నగర మంత్రులు, మేయర్ , మేయర్

    -1908 లో వరదల సమయంలో పూజలు చేసిన నిజాం రాజులు

    -మళ్ళి అలాంటి వరదలు రావడంతో పండితుల సూచన మేరకు గంగమ్మ తల్లి పూజలు

  • 21 Oct 2020 9:48 AM GMT

    Mahabubabad district updates: కిడ్నప్ అయ్యిన బాలుడి తల్లికి ఫోన్ చేసిన ఆగంతకుడు!

    మహబూబాబాద్ జిల్లా...

    -డబ్బులు రెడి అయ్యాయా?

    -డబ్బులు రెడి చేసుకోండి.. రేపు మళ్ళీ ఫోన్ చేసి చెప్పుతా ఎక్కడికి తీసుకరవాలో అని చెప్పినట్లు సమాచారం.

    -నిన్న 12 గంటల తరువాత ఈరోజు 8.30 ఫోన్ వచ్చింది.

    -11.గంటలకు ఫోన్ చేస్తా ఆనంటుగానే కాల్ చేసిన కిడ్నాపర్.. 45 లక్షలు రెడీ చేసినట్లు వీడియో తీసి రెడీ చెయ్యాలి అని ఆదేశించిన కిడ్నపర్..

  • Jurala Project updates: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...
    21 Oct 2020 9:32 AM GMT

    Jurala Project updates: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...

    మహబూబ్ నగర్ జిల్లా :

    -26 గేట్లు ఎత్తివేత..

    -ఇన్ ఫ్లో: 3, 54,000 క్యూసెక్కులు

    -ఔట్ ఫ్లో: 3,75,079 వేల క్యూసెక్కులు.

    -పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:

    -9.657 టీఎంసీ.

    --ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.396 టీఎంసీ.

    -పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.

    -ప్రస్తుత నీటి మట్టం: 317.890 మీ.

  • Hyderabad updates: ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్వల్ప అగ్ని ప్రమాదం!
    21 Oct 2020 9:24 AM GMT

    Hyderabad updates: ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్వల్ప అగ్ని ప్రమాదం!

    హైదరాబాద్.. 

    -హైదరాబాద్ ఆదర్శనగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్వల్ప అగ్ని ప్రమాదం.

    -మంటలు ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది.

    -ఆంద్రప్రదేశ్ కి చెందిన మాజీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏసీ లో షాట్ సర్క్యూట్ కావడం వల్లా అగ్నిప్రమాదం... 

Print Article
Next Story
More Stories