Live Updates: ఈరోజు (21 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం | 21 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పంచమి మ.02-47 వరకు తదుపరి షష్టి | జేష్ఠ నక్షత్రం ఉ.08-21 వరకు తదుపరి మూల | వర్జ్యం: సా.04-02 నుంచి 05-34 వరకు | అమృత ఘడియలు రా.01-14 నుంచి 02-52 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-23 నుంచి 12-10 వరకు | రాహుకాలం: మ.11-23 నుంచి 12-10 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Vijayawada updates: అపోలో హాస్పిటల్ నుంచి డిఛార్జ్ అయిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు..
    21 Oct 2020 12:17 PM GMT

    Vijayawada updates: అపోలో హాస్పిటల్ నుంచి డిఛార్జ్ అయిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు..

    విజయవాడ..

    //మంత్రి వేలంపల్లి..

    //ఇటీవల మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ అపొలో హాస్పటల్ లో చేరిన మంత్రి

    //నాపై అభిమానం తో నాకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు అభిమానులకు పెరు పేరున ధన్యవాదాలు

    //అమ్మ వారి కృపతో కోవిడ్ మహమ్మారి నుండి క్షేమంగా బయటపడ్డాను,,

  • Anantapur updates: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్!
    21 Oct 2020 12:12 PM GMT

    Anantapur updates: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్!

    అనంతపురం:

    //రాష్ట్రంలో జరుగుతుందని పడుకున్న వాళ్లను తీసుకు వెళ్లి లోపల వేశారు.

    //కర్ణాటక లో ఎందుకు లోకాయుక్త లో వేశారు.

    //రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుంది

    //రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి న్యాయం తేడా గా ఉంది.

    //ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వయంగా అక్కడ కేసు వేశారు

    //రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు

    //నా పేరుతో వాహనాలు లేవు... నాపై ఎలా కేసులు పెడతారు

    //మాది ప్రొఫెషనల్ ట్రాన్స్పోర్టర్స్... అనవసరంగా కేసులు పెడుతున్నారు.

    //ఇక్కడ బతకానీయకపోతే మరోచోటకు వెళతారు.

    //ఇక్కడి లాగా కర్ణాటక లో జరగదు.. అక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతారు.

    //ఇక్కడ ఏమి చేయకపోయినా కేసులు పెట్టి లోపల వేస్తున్నారు.

    //కేంద్ర ప్రభుత్వ చట్టాలు అందరికీ ఒకేలా ఉంటాయి

    //28 శాతం జిఎస్టీ కట్టి వాహనాలు కొనుగోలు చేసాం

    //స్పెషల్ స్టేటస్ వున్న రాష్ట్రల్లో పన్ను మినహాయింపు వుంటుంది. అందుకే ఆ రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేస్తున్నాం.

    //అశోక్ లే లాండ్ వాళ్ళను ఎందుకు విచారించడం లేదు.

  • Visakha updates: ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల మల్కాన్​గిరి జిల్లాలో విషాదం...
    21 Oct 2020 12:03 PM GMT

    Visakha updates: ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల మల్కాన్​గిరి జిల్లాలో విషాదం...

      విశాఖ..

    --ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో గల మల్కాన్​గిరి జిల్లాలో... ఇన్​ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య

    --మల్కాన్​గిరి జిల్లా కట్ ఆఫ్ ఏరియాలో గల జోడం పంచాయతీ ఖజిరిపుట్ గ్రామoలో దాస్ కీముడు అనే 25 ఏళ్ల యువకుడిని హత్య చేసిన మావోయిస్టు

    --ఇటీవల మావోయిస్టులు... భద్రత బలగాలు లక్ష్యంగా పాతి పెట్టిన 7 మందుపాతరలు గురించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో హత్య

    --అదే గ్రామనికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను సైతం మావోయిస్టులు గాయపరిచినట్లు సమాచారం.

    --ఘటనతో కట్ ఆఫ్ ఏరియాలోని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.

  • Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు..
    21 Oct 2020 11:59 AM GMT

    Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చరియలు..

      విజయవాడ.. 

    -కొండ చర్యలు విరిగిపడటంతో విరిగిన షెడ్డు...

    -కొండ రాళ్లు విరిగిపడిన చోటే మీడియా పాయింట్...

    -శిధిలాల కింద ఎవరైనా ఉన్నారో అన్న కోణంలో సహాయక చర్యలు...

    -నిలిపివేసిన అమ్మవారి దర్శనం...

    -కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఉన్న దృష్టా అధికారులు ఏర్పాట్లు...

    -కొనసాగుతున్న సహాయక చర్యలు...

    -సీఎం పర్యటన దృష్ట్యా దర్శనం నిలిపివేయడంతో తప్పిన పెను ప్రమాదం

  • Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డ ప్రదేశంలో వేదపండితులు సంప్రోక్షణ చేసారు..
    21 Oct 2020 11:56 AM GMT

    Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డ ప్రదేశంలో వేదపండితులు సంప్రోక్షణ చేసారు..

      విజయవాడ..

    -కొండచరియలు పడిపోవడంతో మొత్తం అంతా పక్కకి జరిపారు

    -సీఎం పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తుండడంతో అన్ని ఏర్పాట్లు చేసారు

    -ప్రమాదం సంభవించినా ఆలయ మర్యాదలు కాపాడుతూ సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు

    -మరికొద్దిసేపట్లో సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి రానున్నారు

  • Vijayawada updates: ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్..
    21 Oct 2020 11:53 AM GMT

    Vijayawada updates: ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్..

    విజయవాడ

    -- ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం

    -- సీఎం కు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు

  • Amaravati updates: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి  ప్రభుత్వ ఉత్తర్వులు..
    21 Oct 2020 10:15 AM GMT

    Amaravati updates: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి ప్రభుత్వ ఉత్తర్వులు..

      అమరావతి..

    -తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ప్రభుత్వ ఉత్తర్వులు

    -నగరి మున్సిపాలిటీ సహా మరో 13 మండలాలను విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేసిన పురపాలక శాఖ

    -తుడా పరిధిలోకి కొత్తగా 3260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ఉత్తర్వులు జారీ

    -వరదాయపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్ ఉన్న11 గ్రామాలను మినహాయిస్తూ ఉత్తర్వులు

    -శ్రీసిటీ సెజ్ ప్రస్తుతం నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోఉన్నందున తుడా నుంచి మినహాయిస్తూ ఆదేశాలు

    -నగరి మున్సిపాలిటీ సహా 13 మండలాలు కొత్తగా వచ్చి చేరటంతో 4472 చదరపు కిలోమీటర్లకు పెరిగిన తుడా పరిధి

  • Amaravati updates: చంద్రన్న బీమా కి నకలే వైఎస్సార్ బీమా..
    21 Oct 2020 10:11 AM GMT

    Amaravati updates: చంద్రన్న బీమా కి నకలే వైఎస్సార్ బీమా..

    అమరావతి..

    -టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా

    -తెలుగుదేశం పార్టీ పథకాలే పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది

    -దేశంలో మొదటి సారి పేద ప్రజలకు మేలు చేసే పథకాలు పెట్టింది చంద్రబాబే

    -బీమా పథకాన్ని గత 17 నేలల నుంచిచనిపోయిన వారి కుటుంబాలకు కూడా అమలు చేయాలి

    -సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా 3 వేల రూపాయలు పించన్ చెల్లించాలి

    -కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లలను నిర్వీర్యం చేశారు

    -కాపు,బ్రాహ్మణ కార్పొరేషన్ లకు తక్షణమే నిధులు మంజూరు చేయాలి

  • Visakha updates: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది..
    21 Oct 2020 10:02 AM GMT

    Visakha updates: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది..

      విశాఖ..

    -దానికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తున తుపాను ఆవర్తనం నెలకొంది.

    -ఇది రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రకు సమీపంగా పశ్చిమ‌మధ్య బంగాళాఖాతంలోకి పయనించి మరింత స్పష్టమైన అల్పపీడనంగా మారుతుంది.

    -ఆతర్వాత 24 గంటల్లో ఉత్తర ఈశాన్యంగా పయనిస్తూ బలపడి వాయుగుండంగా మారి వాయవ్య బంగాళాఖాతంలో ఒడిసా పశ్చిమబెంగాల్ తీరాల్లో   కేంద్రీకృతమవుతుంది.

    -దీని‌ ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమల్లో రానున్న రెండు రోజుల్లో అక్కడక్కడ భారీ జల్లులతో ఓ మోస్తరు వర్షాలు పడతాయి. ఆ తర్వాత వర్ష తీవ్రత   ఒడిసా, ఆవలి ప్రాంతాలకు మరలుతుంది.

    -ఈనెల 22 వరకూ మత్స్యకారులు మధ్య బంగాళాఖాతంలోనికి పోరాదు.

    -కర్నాటకలో కూడా రానున్న రెండు మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

  • Vijayawada updates: ఇంద్రకీలాద్రి పై పొంచి ఉన్న ప్రమాదం..
    21 Oct 2020 10:00 AM GMT

    Vijayawada updates: ఇంద్రకీలాద్రి పై పొంచి ఉన్న ప్రమాదం..

      విజయవాడ..

    --కొండపైన మౌన స్వామి ఆలయం వద్ద విరిగిపడేందుకు సిద్ధంగా ఉన్న కొండ చరియలు

    --గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల దాటికి నాలుగు అంగులాల మేర బీటలు వారిన కొండ

    --ఇప్పటికే చిన్న చిన్న రాల్లు దొర్లి పడుతుండడంతో అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు

    --రెండు మూడు రోజుల్లోనే కొండ చరియలు విరిగిపడే ప్రమాదముందని ఆలయ అధికారులకు బాబు సమాచార మందించిన ఇంజనీరింగ్ అధికారులు

    --సాయంత్రం ముఖ్యమంత్రి రాకతో తర్జన బర్జనలో దుర్గగుడి అధికారులు

Print Article
Next Story
More Stories