Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 21 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం తదియ(రా. 2-22 వరకు) తదుపరి చవితి; ఉత్తర నక్షత్రం (రా. 1-31 వరకు) తదుపరి హస్త నక్షత్రం, అమృత ఘడియలు (సా. 6-44 నుంచి 8-15 వరకు) వర్జ్యం (ఉ. 9-42 నుంచి 11-12 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-28 నుంచి 1-18 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 21 Aug 2020 5:06 AM GMT

    KCR Srisailam Tour: ఇవ్వాళ్టి ముఖ్యమంత్రి శ్రీశైలం పర్యటన రద్దు

    - శ్రీశైలంలో తెలంగాణ వైపునున్న ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదంపై దిగ్భ్రాంతి

    - ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందించాలని అధికారులకు ఆదేశం

    - వరుసగా రెండో ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ ముఖ్యమంత్రి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది.

    - అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

    - జలవిద్యుత్‌ కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు.

    - ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు.

    - తెలంగాణ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

    - చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు.

    - ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే వారికి అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.

    - ఈ నేపత్యంలో శ్రీశైలం పర్యటనను రద్దుచేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.

    - దీంతో ఇవ్వాళ్టి సీఎం శ్రీశైలం పర్యటనను రద్దుచేస్తున్నట్టుగా సీఎం అధికారులు వెల్లడించారు.

  • 21 Aug 2020 5:06 AM GMT

    కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

    -కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

    - మైనర్ బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన రోహన్ అనే యువకుడు

    - స్థానిక నేత కుమారుడు రోహన్

    - బోనాల ఉత్సవాల్లో మైనర్ బాలిక తో పరిచయం పెంచుకున్న రోహన్

    - బాలిక చేత బలవంతంగా మాత్రలు మింగించిన యువకుడు

    - విషయం బయటికి చెబితే చంపేస్తానంటూ బాలిక కు బెదిరింపులు..

    - ఆ యువకుడితో తమకు ప్రాణ హాని ఉందని కుల్సుంపూర పోలీస్ స్టేషన్ లో బాలిక కుటుంబీకులు ఫిర్యాదు.

    - ఈ నెల 12 న కుల్సుంపూరా లో కేస్ నమోదు చేసిన పోలీసులు

    - పరారీలో లో రోహన్.

  • 21 Aug 2020 3:33 AM GMT

    Jagadeesh Reddy: శ్రిశైలం పవర్ ప్రాజెక్ట్ ప్రమాదంపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రకటన

    - శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో ప్రమాదం దురదృష్టకరం

    - మొదటి యూనిట్లో ఫైర్ జరిగింది

    - నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయి

    - పదిమంది బయటకు వచ్చారు

    - లోపల తొమ్మిది మంది చిక్కు కున్నారు

    - లోపల దట్టమైన పొగ ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది

    - ఫైర్, పోలీస్ సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లారు

    -పొగ తో మూడు సార్లు లోపలికి వెళ్లి వెనక్కు వచ్చారు

    - ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా సంఘటనా స్థలానికి వెళ్ళ లేకపోతున్నారు

    - ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది లోపలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు

    - సింగరేణి సిబ్బంది సహాయం కోరాం

    - లోపల ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాం

    - జెన్ కో ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు వారు సేఫ్ గానే ఉన్నారు

  • 21 Aug 2020 2:57 AM GMT

    Bhadrachalam: భద్రాచలం పాల్వంచ మధ్య రాకపోకలు బంద్

    భద్రాద్రి కొత్తగూడెం:

    - భద్రాచలం  పాల్వంచ మధ్య రాకపోకలు బంద్

    - కిన్నెరసాని ప్రాజెక్టు కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో 12 గేట్లు ఎత్తి 85 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

    - వరద ప్రమాదం పొంచి ఉండడంతో నాగారం వద్ద కిన్నెరసాని బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు ...

  • 21 Aug 2020 2:55 AM GMT

    Tali peru Peoject: ప్రమాదకర స్దాయిలో ప్రవహిస్తున్న తాలిపేరు ప్రాజెక్ట్..

    భద్రాద్రి కొత్తగూడెం

    - ప్రమాదకర స్దాయిలో ప్రవహిస్తున్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్.

    - అర్ధరాత్రి భారీగా వరద నీరు రావడంతో 25 గేట్ల ద్వారా 2 లక్షల 617 క్యూసెక్కుల వరద గోదావరి లోకి విడుదల

    - ఉదయానికి వరద తగ్గుముఖం పట్టడంతో 25 గేట్లద్వారా 1 లక్షా 67 వేల 784 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల

    - ప్రాజెక్ట్ వద్ద 259.30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

  • 21 Aug 2020 2:54 AM GMT

    Bhadrachlam: భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి

    భద్రాచలం: 

    - భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి

    - 54 అడుగులకు నీటిమట్టం చెరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు

    - సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించిన కలెక్టర్

  • 21 Aug 2020 2:41 AM GMT

    కామారెడ్డి:

    - డైలీ మార్కెట్ రోడ్డు లో ఆటో పక్కకు తీయమని నందుకు శివం క్లాస్ స్టోరీ యజమాని పొలసా వెంకట పై 50 మంది ఆటో డ్రైవర్ ల దాడి కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు యజమాని వెంకట్ కు తీవ్ర గాయాలు

    - దాడి కి నిరసనగా నేడు పట్టణంలో బట్టల దుకాణాలు మూసి వేస్తున్నట్లు అసోసియేషన్ పతినిదులు ప్రకటన

  • 21 Aug 2020 2:40 AM GMT

    Mulugu District: రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి కొనసాగుతున్న వరద ఉధృతి

    ములుగు జిల్లా:

    - ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి కొనసాగుతున్న వరద ఉధృతి.

    - ప్రస్తుత నీటిమట్టం 9.580 మీటర్లు.

  • 21 Aug 2020 2:38 AM GMT

    Heavy Rains in Kamareddy: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షలు

    కామారెడ్డి :

    - జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షలు

    - గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 21.7 మి.మి.వర్షపాతం నమోదు

    - అత్యధికంగా తాడ్వాయి లో 36.4 మి.మి.వర్షపాతం నమోదు.

    - వరుస వర్షాలతో జిల్లా లోని అయా మండలాల్లో నీ చెరువులు కుంటలు చెక్ డ్యాం లు ఊట చెరువులు అలుగులు పరుతున్నాయి.

    - వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

  • 21 Aug 2020 2:37 AM GMT

    Karimnagar: లోయర్ మానేరు డ్యామ్ కి కొనసాగుతున్న వరద ప్రవాహం

    కరీంనగర్ :

    - లోయర్ మానేరు డ్యామ్ కి కొనసాగుతున్న వరద ప్రవాహం

    - లోయర్ మానేరు మొత్తం కెపాసిటీ 24టిఎంసి

    - ప్రస్తుతం 21.5టిఎంసి

    - ఇన్ ఫ్లో 11 వేల క్యూసెక్స్

    - మధ్యాహ్నం తరువాత మూడు గేట్లు ఏతే అవకాశం ...

    - దిగువ ప్రాంతాల్లో అలెర్ట్ ప్రకటించిన అధికారులు

Print Article
Next Story
More Stories