Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 21 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం తదియ(రా. 2-22 వరకు) తదుపరి చవితి; ఉత్తర నక్షత్రం (రా. 1-31 వరకు) తదుపరి హస్త నక్షత్రం, అమృత ఘడియలు (సా. 6-44 నుంచి 8-15 వరకు) వర్జ్యం (ఉ. 9-42 నుంచి 11-12 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-28 నుంచి 1-18 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 21 Aug 2020 10:18 AM GMT

    Harish Rao: మంత్రి హరీష్ రావు కామెంట్స్

    * జర్నలిస్ట్ సంక్షేమ నికి 100 కోట్లు నిధులు కేటాయించి వారిని అదుకుంటునం

    * జహీరాబాద్ జర్నలిస్ట్ కాలానికి కి రామలింగారెడ్డి కాలనీ గా పెట్టుకోవడం చాలా సంతోషం

    * కరోన వచ్చిన జర్నలిస్ట్ కు 20 వేళా రూపాయలు అందిస్తున్నాం

    * జహీరాబాద్ అభివృద్ధికి అత్యధిక నిధుల తో అభివృద్ధి చేస్తున్నాము

    * అర్హులైన జర్నలిస్ట్ లకు అందరికి డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తాం

  • 21 Aug 2020 10:17 AM GMT

    Saraswathi Barrage: సరస్వతి బ్యారేజ్ 29 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

    - సరస్వతి బ్యారేజ్ 29 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 113.500 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 2.42 టీఎంసీ

    - ఇన్ ఫ్లో 1,60,000 క్యూసెక్కులు

    - ఓట్ ఫ్లో 1,33,000 క్యూసెక్కులు

  • 21 Aug 2020 10:16 AM GMT

    Gachibowli: గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ ఫరిధిలోని PhD విధ్యార్ధి మృతి...

    సైబరాబాద్:

    - హైదరాబాద్ సేంట్రల్ యునివర్సిటీ లో PhD విధ్యార్ధి మృతి...

    - ఈనెల 17 వ తేదీ అనారోగ్యంతో శేరిలింగంపల్లి సిటిజన్ హాస్పిటల్ చేరిన సూర్య ప్రతాప్( 30)

    - సుర్య ప్రతాప్ కు కరోనా టేస్టును నిర్వహించాలనీ కోరిన ఆసుపత్రి యాజమాన్యం...

    - కరోనా నెగిటివ్ అని చేప్పి మరో రోజు కరోనా పాజిటివ్ వచ్చిందని చికిత్స అందించకుండా కాలయాపన చేసిన ఆసుపత్రి సిబ్బంది...

    - దీంతో గచ్చిబౌలి లోని మరో హాస్పిటల్ కి తరలించగా అక్కడ కరోనా నెగిటివ్ రావడంతో చికిత్స అందించిన వైద్యులు..

    - సూర్య ప్రతాప్ చికిత్స పొందుతూ మృతి చేందండంతో సిటిజన్ వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయాడని చందానగర్ పోలీస్ స్టేషన్ లో సిటిజన్ హాస్పిటల్ పై ఫిర్యాదు చేసిన యునివర్సిటీ విధ్యార్ధి సంఘం నాయకులు....

  • 21 Aug 2020 10:16 AM GMT

    KCR on Srisailam Incident: శ్రైశైలం అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి..

    - శ్రైశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు.

    - దీనిని అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

    - మృతుల కుటుంబ సబ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    - ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని సిఎం ఆకాంక్షించారు.

    - చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో వైద్య చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

    - సంఘటనా స్థలంలో ఉన్న విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో – జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తో సిఎం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

  • 21 Aug 2020 10:12 AM GMT

    Hyderabad: ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ ముందు దారుణం..

    హైదరాబాద్: 

    - అప్పుడెపుట్టిన ఆడ శివును కుక్కలు తీసుకెళ్తుండటం తో దారిలో వెళ్తున్న కొంతమంది యువకులు చూసి పోలిసులకు ఫోన్ చేయడం తో ఘటనా స్థలానికి చేరుకున్న ఎల్బీనగర్ పోలీసులు..

    - పోలీసులు కేసు నమోదు చెసుకోని చిన్న పాప ను ఎక్కడ నుండి వచ్చిందో ఆర తిస్తున్నా పోలీసులు....

  • Minister Harish Rao visits Sangareddy: మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి పర్యటన
    21 Aug 2020 8:07 AM GMT

    Minister Harish Rao visits Sangareddy: మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి పర్యటన

    సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణం లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యటన.

    సంగారెడ్డి ఎక్స్ రోడ్ లో పట్టణ ప్రగతిలో భాగంగా మరుగుదొడ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు.

    సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో అమీన్ పూర్ , సదాశివ పేట, బొల్లారం పురపాలక సంఘం కోసం ఏర్పాటయిన మూడు మోబైల్ బయో టాయిలెట్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

  • Protest: నిరసన
    21 Aug 2020 8:04 AM GMT

    Protest: నిరసన

    సంగారెడ్డి జిల్లా: అమీన్ పూర్ మున్సిపల్ లో భీరం గూడ కమాన్ నుండి కిష్టారెడ్డి పేట వెళ్లే ప్రధాన రహదారి ని భారీగా గుంతలు పడి గత కొన్ని ఏళ్ళు గా ప్రజలకు ఇబ్బందిగా ఉన్న రోడ్డును బాగు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్ పై నిరసన కార్యక్రమము.

  • 21 Aug 2020 5:09 AM GMT

    Lakshmi Barrage: లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    - లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 95.50 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 5.327 టీఎంసీ

    - ఇన్ ఫ్లో 4,69,781 క్యూసెక్కులు

    - ఓట్ ఫ్లో 4,69,781 క్యూసెక్కులు

  • 21 Aug 2020 5:08 AM GMT

    - భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ రహదారి పై అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన లారీ.. భారీగా నిలిచిపోయిన వాహనాలు.

  • 21 Aug 2020 5:07 AM GMT

    Nizamabad: నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో ప్రారంభమైన జెండా బాలాజీ జాతర..

    నిజామాబాద్‌ :

    - నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో ప్రారంభమైన జెండా బాలాజీ జాతర.

    - ఉత్సవమూర్తులు, జెండాకు ప్రత్యేక పూజలు

    - జెండాను పురవీధుల గుండా తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించిన అర్చకులు.

    - సెప్టెంబర్ 2 వరకు కొనసాగనున్న జాతర.

    - కోవిడ్ నిబంధనల దృష్ట్యా జాతరలో భక్తులకు కేవలం జెండా దర్శనం మాత్రమే: వేణు, ఆలయ ఈవో.

Print Article
Next Story
More Stories