Live Updates:ఈరోజు (ఆగస్ట్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం, 21 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం తదియ(రా. 2-22 వరకు) తదుపరి చవితి; ఉత్తర నక్షత్రం (రా. 1-31 వరకు) తదుపరి హస్త నక్షత్రం, అమృత ఘడియలు (సా. 6-44 నుంచి 8-15 వరకు) వర్జ్యం (ఉ. 9-42 నుంచి 11-12 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-28 నుంచి 1-18 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు వరకు) సూర్యోదయం ఉ.5-47 సూర్యాస్తమయం సా.6-20

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 21 Aug 2020 12:24 PM GMT

    Anil Kumar Yadav: HMTV తో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్

    విజయవాడ:

    - రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా..

    - జూమ్ లో దాక్కున్నారు

    - రాష్ట్రంలో వర్షాలు కురిసి ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి

    - ముంపు మండలాల ప్రజల్ని అప్రమత్తం చేసాము..ముందు జాగ్రత్తలు తీసుకున్నాము

    - ఎప్పటికప్పుడు సీఎం ,అధికారులను ,కలెక్టర్ల ను అప్రమత్తం చేశారు

    - ముంపు బాధితులను పట్టించుకోలేదని ,ప్రణాళిక లేదనడం సరైంది కాదు

    - టిడిపి అంటే కరవు కాటకాలు.. చంద్రబాబు హయాంలో వర్షాలు పడ్డాయా

    - చంద్రబాబు నిర్వాకం వలన గోదావరి పుష్కరాల్లో అమాయకులు చనిపోయారు

    - రాయలసీమ కు నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే ..కొందరు అడ్డుకుంటున్నారు

    - గండికోట ,చిత్రావతి ప్రాజెక్టు లకు నిధులు ఇవ్వలేదు

    - పోతిరెడ్డిపాడు గురించి ఆలోచన చేసారా..

    - రాయలసీమ ఎత్తిపోతల పథకం పై టిడిపి ఎందుకు మాట్లాడటం లేదు

    - అఫెక్స్ కౌన్సిల్ కు సిద్ధం అవుతున్నాము

    - ఇప్పటికే టెండర్ ప్రక్రియ అయిపోయింది

    - మా ఎజెండా మాకుంది..గట్టిగా మాట్లాడతాము

  • 21 Aug 2020 12:23 PM GMT

    Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

    అమరావతి:

    నారా లోకేష్‌: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

    - ఈ ఏడాది కోవిడ్ వైర‌స్ క‌ష్ట‌న‌ష్టాలు తెచ్చిపెట్టింది.

    - క‌రోనా తెచ్చిన‌ విఘ్నాలు తొల‌గించాల‌ని వినాయ‌కుడిని మ‌న‌మంతా ప్రార్థిద్దాం.

    - వైర‌స్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న‌ ద‌శ‌లో స‌మూహంగా కాకుండా ఎవ‌రి ఇంట్లో వారు వినాయ‌క‌చ‌వితిని జ‌రుపుకోండి.

    - గ‌ణ‌నాథుడు క‌రుణ‌తో క‌రోనా క‌ష్టాలు త్వ‌ర‌లో తొల‌గాల‌ని ఆకాంక్షిస్తున్నాను.

    - అంద‌రికీ వినాయ‌క‌చ‌వితి శుభాకాంక్ష‌లు.

  • 21 Aug 2020 12:16 PM GMT

    అనంతపురం :

    - అక్రమంగా కర్ణాటక మద్యం ద్విచక్రవాహనంలో తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన విడపనకల్లు పోలీసులు.వారి వద్ద నుంచి 192 కర్ణాటక మద్యం బాటిళ్లు స్వాధీనం.

  • 21 Aug 2020 12:15 PM GMT

    Ananthapur: పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లి తండా లో కర్ణాటక మద్యం పట్టివేత...

    అనంతపురం:

    - పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లి తండా లో కర్ణాటక మద్యం పట్టివేత...

    - ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్దనుండి 1560 కర్ణాటక మద్యం బ్యాటిల్స్ స్వాధీనం చేసుకున్న పుట్టపర్తి ఎక్సైజ్ అధికారులు.

  • 21 Aug 2020 12:09 PM GMT

    Chandrababu Naidu: చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు

    అమరావతి:

    - చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు

    - తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

    - మనం చేపట్టిన పనులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతం కావాలని గణపతి పూజ చేస్తాం.

    - అటు కరోనా, ఇటు వరదలు జనజీవనాన్ని దుర్భరం చేశాయి.

    - పాలకుల బాధ్యతారాహిత్యం ప్రజల సహనానికి పరీక్షగా మారింది.

    - వీటన్నింటినీ అధిగమించేలా, ఆ విఘ్నేశ్వరుని చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుందాం.

    - కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా వినాయక చవితి వేడుకలను కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్నదే నా ఆకాంక్ష.

  • 21 Aug 2020 12:06 PM GMT

    Amaravati: అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వాలని ముఖ్యమంత్రికి నారా లోకేష్ లేఖ

    అమరావతి:

    - గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నోటిఫికేషన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తై మెరిట్ లిస్ట్లో వున్న అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వాలని ముఖ్యమంత్రికి నారా లోకేష్ లేఖ

    - నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

    - సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాదించిన అభ్యర్ధులందరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

    - గ్రామ స్వరాజ్యం అంటూ ఆర్భాటంగా ప్రకటించారు.

    - కానీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైనప్పటికీ చాలా మంది అపాయింట్ మెంట్ లెటర్ అందక ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

    - 0.25, 0.50, 0.75 & 1 మార్కుల తేడాతో అన్ని పోస్టులకు వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులు రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి వేలల్లో ఉన్నారు.

    - వీరికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల గురించి అధికారులను సంప్రదిస్తే ఎటువంటి ఆదేశాలు లేవని చెబుతున్నారు

    - ఇదే సమయంలో రెండో దఫా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తైన వారు, స్వల్ప తేడాతో ఎంపికై వెయిటింగ్ లో ఉన్నవారిలో ఆందోళన మొదలైంది.

    - కొత్త నోటిఫికేషన్ నిర్వహించడమంటే ఇప్పటి వరకు వెయిటింగ్ లో ఉన్న వారందరికీ అన్యాయం చేయడమే.

    - గ్రామ/వార్డ్ సచివాలయంలోని ఉద్యోగాలకు రాజీనామా చేసిన, ఇతరాత్రా కారణాలతో ఖాళీ అయిన స్థానాలను, తొలి విడత పరీక్షలో అర్హత సాధించి మెరిట్ లిస్ట్ లో వున్న వారితో, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులతో భర్తీ చేయాలి.

    - అదనంగా ప్రభుత్వం ప్రకటిoచిన 3000 పోస్టులను మొదటి నోటిఫికేషన్లో అర్హత సాధించి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులతో భర్తీ చేయాలి.

    - అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ పోస్టులు మిగిలిపోయాయనే కారణంతో రెండో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు.

    - ప్రస్తుత పరిస్థితులలో రెండవసారి పరీక్షలు నిర్వహించి, అభ్యర్ధులను ఎంపిక చేసే అవకాశం లేనందున మొదటి నోటిఫికేషన్ లో అర్హత సాధించిన అభ్యర్దులచే ఆయా పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి.

    - నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

  • 21 Aug 2020 12:04 PM GMT

    Andhra Pradesh: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ ప్రెస్ మీట్..

    అనంతపురం:

    - రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ ప్రెస్ మీట్.

    - చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కుంభకోణ లు జరిగినాయంటూ హైదరాబాద్ లో వుండి ఆరోపణలు చేస్తున్నారు

    - రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే హైదరాబాద్ లో కాలం వెళ్లబుచ్చుతున్నారు

    - అందరూ సామాజిక దూరం పాటిస్తుంటే చంద్రబాబు స్టేట్ డిస్టెన్స్ పాటిస్తున్నారు.. అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు

    - 20 సంవత్సరాల క్రితం అక్రమంగా లే అవుట్లు గా చేసుకుని పేదలకు ఇళ్ల పట్టాలు లేకుండా చేస్తున్నారు

    - పచ్చ చొక్కాలు వారు కోర్టు లో కేసులు వేస్తున్నారు

    - జూమ్ యాప్ ద్వారా సంకేతాలు ఇస్తున్నారు... జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రాకూడదని

    - 90 శాతం కు పైగా హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే

    - పేదలకు ఇళ్ళు పట్టాలు ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి?

    - జగన్మోహన్ రెడ్డి పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు

    - 40 సంవత్సరాల అనుభవంతో ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి

    - ఇప్పటికే 23 సీట్లు ఇచ్చారు..రాబోయే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవు

    - ఎవరి ఫోన్ ట్యాప్ చేశారో చెప్పాలి.. ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు

    - చంద్రబాబు కు పూర్తి స్థాయిలో మతిభ్రమించింది..కుయుక్తులు మానుకోవాలి

  • 21 Aug 2020 11:31 AM GMT

    Road Accident: దత్తిరాజేరు మండలం గొబ్యాం సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

    విజయనగరం:

    దత్తిరాజేరు మండలం గొబ్యాం సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి.

    మృతుడు గొబ్యాం గ్రామానికి చెందిన వైకుంఠం చందుగా గుర్తింపు

  • 21 Aug 2020 11:29 AM GMT

    Coronavirus: జిల్లాలో మరో 571 కరోనా కేసులు నమోదు..

    శ్రీకాకుళం జిల్లా..

    - జిల్లాలో మరో 571 కరోనా కేసులు నమోదు..

    - దీంతో 17,706 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య..

    - కరోనా నుంచి కోలుకుని ఈరోజు 499మంది డిశ్చార్..

    - ప్రస్తుతం జిల్లాలో 5,808 ఆక్టివ్ కేసులు..

  • 21 Aug 2020 11:28 AM GMT

    చంద్రబాబు కులం పేరుతో రాజకీయం చేస్తున్నాడు : ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్

    కృష్ణాజిల్లా :

    - చంద్రబాబు కులం పేరుతో రాజకీయం చేస్తున్నాడు : ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్

    - 13 జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఆపిందా?

    - కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు ఒక్కడే నాయకుడు కాదు,గతంలో చాలా మంది నాయకులు పని చేసారు

    - కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబుతోనే ముప్పు

    - ఆయనకు ఉన్న సమస్యలు అన్ని కులానికి రుద్దుతాడు

    - అలానే ఓటుకు నోటు కేసులో తెలంగాణలో 10 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా.,అక్కడ ఉండలేక ఎమ్మెల్యేలు అందరినీ కట్టుబట్టలతో విజయవాడకు తీసుకువచ్చాడు

    - అమరావతి అంటున్న చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లో 300 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు

    - సినీ. హీరో రామ్ రమేష్ హాస్పిటల్ గురించి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివాడు

    - రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్ళు మాత్రమే చూస్తారా ?వేరే వాళ్ళు చూడరా

    - వేరే కులం వారిని సినిమాలు చూడ వద్దని రామ్ ని చెప్పమనండి : వంశీమోహన్

Print Article
Next Story
More Stories