Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 19 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అమావాస్య(ఉ. 8-22 వరకు) తదుపరి పాడ్యమి; మఘ నక్షత్రం (తె. 4-08 వరకు) తదుపరి పుబ్బ నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 1-49 నుంచి 3-22 వరకు), వర్జ్యం (సా. 4-35 నుంచి 6-07 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-38 నుంచి 12.28 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-21

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 19 Aug 2020 11:36 AM GMT

    నిర్మల్ జిల్లా:

    - బాసర రైల్వే స్టేషన్ రెండవ నెంబర్ ప్లాట్ వెనకాల ముండ్ల పొదలలో 1.5 సంవత్సరాలు గుర్తుతెలియని బాలుడి మృతదేహం లభ్యం దర్యాప్తు జరుపుతున్న బాసర పోలీసులు..

  • 19 Aug 2020 11:35 AM GMT

    సంగారెడ్డి: 

    - అరణ్య భవన్ లోఆర్థిక మంత్రి హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన సదాశిప పేట, సంగారెడ్డి మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్స్ .

    - కో ఆప్షన్ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించిన మంత్రి హరీశ్ రావు.

  • 19 Aug 2020 11:31 AM GMT

    నాగర్ కర్నూల్ జిల్లా:

    - తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ్రామంలో పల్లె ప్రగతి లో చేపట్టిన కార్యక్రమాలను పర్యవేక్షించిన కలెక్టర్ శర్మన్

  • 19 Aug 2020 11:27 AM GMT

    Lakshmi Barrage: లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

    - లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 100 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 94.60 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 4.050 టీఎంసీ

    - ఇన్ ఫ్లో 4,58,500 క్యూసెక్కులు

    - ఓట్ ఫ్లో 4,76,200 క్యూసెక్కులు

  • 19 Aug 2020 9:52 AM GMT

    JayaShankar Bhupallapally: సరస్వతి బ్యారేజ్ 10 గేట్లు ఎత్తిన అధికారులు

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

    - సరస్వతి బ్యారేజ్ 10 గేట్లు ఎత్తిన అధికారులు

    - పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

    - ప్రస్తుత సామర్థ్యం 114.00 మీటర్లు

    - పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    - ప్రస్తుత సామర్థ్యం 2.82 టీఎంసీ

    - ఇన్ ఫ్లో 90,926 క్యూసెక్కులు

    - ఓట్ ఫ్లో 22,500 క్యూసెక్కులు

  • 19 Aug 2020 9:51 AM GMT

    Warangal: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ట్రాక్టర్ ను డీ కొట్టిన బైక్..

    వరంగల్ రూరల్ జిల్లా:

    వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ట్రాక్టర్ ను డీ కొట్టిన బైక్..

    బైక్ పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు. హాస్పిటల్ కు తరలింపు..

    క్షతగాత్రులు నెక్కొండ గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు...

  • 19 Aug 2020 9:45 AM GMT

    Jagga Reddy: అసెంబ్లీలోనే కరొనా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే సీఎం కేసీఆర్ వ్యంగంగా మాట్లాడారు!.

    - అసెంబ్లీలోనే కరొనా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే సీఎం కేసీఆర్ వ్యంగంగా మాట్లాడారు!.

    - అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కరొనా పై ఎలా మాట్లాడారో ప్రజలందరూ గమనించారు!.

    - దేశంలో కరొనా గురించి రాహుల్ గాంధీ జనవరి లో చెప్పిన నెలకు మోడీ స్పందించారు.

    - మోడీ స్పందించిన తరువాత కేసీఆర్ కరొనాను పట్టించుకున్నారు.

    - టిఆర్ఎస్ ప్రభుత్వం-మంత్రులు మాటలతో టైం పాస్ చేయటం తప్ప కరొనా కట్టడికి ఎలా ప్రణాళికలు లేవు.

    - తెలంగాణ ప్రజలంటే కేసీఆర్ కి భయం లేదు- ప్రజల బలహీనతను కేసీఆర్ పట్టారు.

    - ఎన్నికల ముందు 5వేలు- 10వేలు ఇస్తే ఓట్లు పడతాయి అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

    - సీఎం కేసీఆర్ కు---సీఎస్ కు కనీసం హైకోర్టు అంటే కూడా భయం లేదు.

    - గతంలో ఉన్న గవర్నర్ అంటే ఎవ్వరికి లెక్కలేకుండా ఉండేది అనేది అందరికి తెలుసు.

  • 19 Aug 2020 9:44 AM GMT

    Jeevan Reddy: కరొనా విషయంలో న్యాయస్థానం పలు సార్లు ప్రభుత్వాన్ని చురకలు అంటించింది.

    - కరొనా విషయంలో న్యాయస్థానం పలు సార్లు ప్రభుత్వాన్ని చురకలు అంటించింది.

    - హైకోర్టు హెచ్చరికలతో కరోనా టెస్టులు పెంచుతామని చెప్పి కనీసం సగం కూడా చేయడం లేదు.

    - 40వేల టెస్టులు చేస్తామని కేబినెట్ లో చెప్పి- ఆచరణలో అమలు చేయకపోవడం దారుణం.

    - ప్రైవేట్ హాస్పిటల్స్ పై వైద్యమంత్రి హెచ్చరికలు తాటాకు చప్పుళ్లకు మాత్రమే పరిమితం అయింది.

    - కేంద్రంలో ఉన్న ఆయుష్మాన్ భారత్ లేదా ఆరోగ్యశ్రీ లో చేర్చాలి.

    - నిరుపేద కుటుంబాలకు కొరొనా ట్రీట్మెంట్ ఉచితంగా అందించాలి.

    - ర్యాపిడ్ టెస్టులు కేవలం 50శాతం కి మాత్రమే పరిమితం అయింది--ఆర్టీపీసీఆర్ టెస్టులు జిల్లాల్లో కేవలం రోజులు 30 మాత్రమే చేస్తున్నారు.

    - రాజ్యాంగ అధిపతి గవర్నర్ తన ప్రభుత్వ వైఫల్యాలను ఒప్పుకున్నారు కాబట్టి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.

  • 19 Aug 2020 9:43 AM GMT

    Bhatti Vikramarka: కరోనా విజృంభిస్తుంది అని గవర్నర్ ముందే గ్రహించి ప్రభుత్వానికి లేఖలు రాశారు.

    - కరోనా విజృంభిస్తుంది అని గవర్నర్ ముందే గ్రహించి ప్రభుత్వానికి లేఖలు రాశారు.

    - వైద్యశాఖలో పోస్టులు భర్తీ చేయండి- హాస్పిటల్స్ బెడ్స్ పెంచాలని గవర్నర్ కొన్ని నెలల క్రితమే లేఖలు రాశారు.

    - గవర్నర్ సూచనలను టిఆర్ఎస్ ప్రభుత్వం బేఖాతర్ చేయడం వల్ల రాష్ట్రం అంతా కొరొనా విజృంభించింది.

    - కరోనా తీవ్రతను ముందే పసిగట్టి మేము ప్రభుత్వానికి పలుసార్లు లేఖలు రాసాము.

    - గవర్నర్ ప్రభుత్వానికి మంచి సూచనలు చేస్తే గవర్నర్ పై విమర్శలు చేయడం కరెక్టేనా..

    - ప్రతిపక్షణాలను- మీడియా పై ఎదురుదాడి చేసిందే కాకా గవర్నర్ ను సైతం ఎదురిస్తారా

    - టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ విలువలను బేఖాతరు చేస్తోంది.

    - గవర్నర్ ప్రభుత్వం పై విమర్శలు-సూచనలు చేస్తే విలువలు ఉన్న సీఎంలు రాజీనామాలు గతంలో చేశారు.

    - రాజ్యాంగం-విలువలు ఉన్న వ్యక్తి కేసీఆర్ అయితే రాజీనామా చెయ్యాలి!.

    - కేసిఆర్ విలువలు లేని వ్యక్తి- కనీసం గవర్నర్ చెప్పిన సూచనలు అయినా అమలు చేయాలి.

    - రేషన్ తరహాలో కరొనా బారిన పడిన బీపీఎల్ కుటుంబాలకు కరోనా చికిత్స ఉచితంగా అందించాలి.

    - గవర్నర్ తన రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడటం అభినందనీయం.

    - గవర్నర్ తన వ్యాఖ్యలను మాటలకే పరిమితం చేయకుండా ప్రభుత్వాన్ని అదేశించి ఆచరణలో పెట్టించాలి.

    - రాజ్యాంగం సృష్టించిన అధిపతి గవర్నర్- గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సీఎం గవర్నర్ కి క్షమాపణ చెప్పాలి.

  • 19 Aug 2020 9:41 AM GMT

    Telangana High Court: నిలోఫర్‌లో భోజనం కాంట్రాక్టర్‌ అక్రమాలపై హైకోర్టు పిటిషన్

    టిఎస్ హైకోర్టు:

    - నిలోఫర్‌లో భోజనం కాంట్రాక్టర్‌ అక్రమాలపై హైకోర్టు పిటిషన్

    - దర్యాప్తు జరపాలని హైకోర్టు పిటిషన్‌ ....

    - కాంట్రాక్టర్‌ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు జరపాలన్న పిల్‌పై హైకోర్టులో విచారణ...

    - తప్పుడు బిల్లులతో నిధులు దుర్వినియోగం చేశారని విచారణ నివేదిక...

    - కాంట్రాక్టర్‌ సురేష్‌పై నివేదిక

    - సమర్పించిన నిలోఫర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

    - ఎందుకు చర్యలు తీసుకోలేదు హైకోర్టు...

    - కాంట్రాక్టర్‌ను గాంధీ, ఛాతీ ఆస్పత్రిల్లో ఎలా కొనసాగిస్తున్నారన్న హైకోర్టు...

    - ఏం చర్యలు తీసుకున్నారో సెప్టెంబర్‌ 16లోగా నివేదిక సమర్పించాలి హైకోర్టు...

Print Article
Next Story
More Stories