Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 19 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అమావాస్య(ఉ. 8-22 వరకు) తదుపరి పాడ్యమి; మఘ నక్షత్రం (తె. 4-08 వరకు) తదుపరి పుబ్బ నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 1-49 నుంచి 3-22 వరకు), వర్జ్యం (సా. 4-35 నుంచి 6-07 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-38 నుంచి 12.28 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-21

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 19 Aug 2020 12:22 PM GMT

    Nirmal District: కడెం ప్రాజెక్టు లో బారీగా చేరుతున్న వరదనీరు

    నిర్మల్ జిల్లా:

    - కడెం ప్రాజెక్టు లో బారీగా చేరుతున్న వరదనీరు

    - ప్రస్తుతం నీటిమట్టం 697.000Ft

    - ప్రస్తుతం నీటినిల్వ 6.843TMC

    - ఇ‌న్ ప్లో: 5463.7 c/s

    - అవుట్ ప్లో‌: 6315.10c/s

    - ఒక గెట్ ను ఎత్తి6109 క్యూసెక్కుల

    - వరదనీరు బయటకు వదులుతున్నా అదికారులు

  • 19 Aug 2020 12:19 PM GMT

    కామారెడ్డి :

    జుక్కల్. నిజాంసాగర్ మండలం సింగీతం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండడంతో ఒక గేట్ ను ఎత్తివేసి425క్యూసెక్కుల నీటిని దిగువన గల నిజాంసాగర్ ప్రధాన కాల్వ లోకి విడుదల చేసిన నీటిపారుదల అధికారులు.

  • 19 Aug 2020 11:58 AM GMT

    Hyderabad: హైదరాబాద్లో కరోనా వైరస్ వ్యాప్తిపై సంచలన పరిశోధన చేసి సీసీఎంబీ

    హైదరాబాద్:

    - హైదరాబాద్లో కరోనా వైరస్ వ్యాప్తిపై సంచలన పరిశోధన చేసి సీసీఎంబీ

    - మురుగు నీటిలో వైరస్ వ్యాప్తిపై సీసీఎంబీ పరిశోధన

    - సీసీఎంబీ అంచనా ప్రకారం హైదరాబాద్లో 6 లక్షల మందికి వైరస్ సోకి ఉండొచ్చు

  • 19 Aug 2020 11:57 AM GMT

    Taliperu Reservoir: చర్ల మండలంలోని తాలిపేరు రిజర్వాయర్ కు మళ్లీ వరద ఉదృతి..

    భద్రాద్రి కొత్తగూడెం:

    - చర్ల మండలంలోని తాలిపేరు రిజర్వాయర్ కు మళ్లీ వరద ఉదృతి.

    - ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతమయిన చత్తీస్‌గఢ్ అటవీప్రాంతం లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రిజర్వాయర్ లోకి భారీగా వరద వచ్చిచేరుతోంది

    - దీంతో అప్రమత్తమయిన అదికారులు ప్రాజెక్ట్ కు చెందిన 17 గేట్లను ఎత్తి 74 వేల 870 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు.

    - ప్రాజెక్ట్ రిజర్వాయర్ లోకి 74 వేల 160 క్యూసెక్కుల వరద వస్తుడటంతో వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.

  • 19 Aug 2020 11:55 AM GMT

    నల్గొండ జిల్లా:

    - రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమా విడుదల నిలిపివేత పిటిషన్‌పై తీర్పును ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసిన నల్గొండ కోర్టు

  • 19 Aug 2020 11:55 AM GMT

    Coronavirus: మల, మూత్రాల నుంచి కరోనా వైరస్ విసర్జితమవుతుంది.

    - మల, మూత్రాల నుంచి కరోనా వైరస్ విసర్జితమవుతుంది.

    - హైదరాబాద్లో మురుగు నీటిని పరీక్షించిన సీసీఎంబీ

    - వ్యాధి సోకిన వారి నుంచి సుమారు 35 రోజుల వరకూ విసర్జితాల్లో వైరస్ ఉంటుంది.

    - ఈ పరిశీలనల వల్ల నెలరోజుల్లో ఎందరికి వ్యాధి సోకిందో గుర్తించవచ్చు

    - హైదరాబాద్లో 1800 మిలియన్ల నీటిలో 40 మురుగు నీటిని శుభ్ర పరుస్తారు

    - సీసీఎంబీ, ఐఐసీటీలు కలసి పరిశోధన చేశాయి

    - మురుగు నీటిలో వైరస్ ఉంది కానీ, అది శుద్ధి చేసిన తరవాత వైరస్ లేదు

    - మురుగు నీటిలో వైరస్ వల్ల వేరే వారికి వ్యాధి రాదు

    - ఈ పరీక్షలు 80 శాతం మురుగునీటి కేంద్రాల్లో చేశారు. దాని ఆధారంగా సుమారు 2 లక్షల మందికి వైరస్ వచ్చినట్టు అంచనా.

    - n40 శాతం మురుగు నీరే శుద్ధి చేస్తారు కాబట్టి, ఆ ప్రకారం లెక్కిస్తే సుమారు 6.6 లక్షల మంది హైదరాబాదీలకు వైరస్ సోకి తిరిగి కోలుకుని ఉంటారని అంచనా.

    - ఈ పరిశోధనలను మెడ్ రెక్సివ్ లో ప్రచురించారు.

    - లక్షణాలు లేకుండా ఎక్కువ మందిలో వైరస్ ఉంటోంది.

    - వ్యాధి తీవ్రత ఉన్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా సరైన చర్యలు తీసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ అన్నారు

  • 19 Aug 2020 11:54 AM GMT

    Kamareddy: పిట్లం లో అనుమతి లేకుండా తిరుమల ఆసుపత్రి నిర్వహణ..

    కామారెడ్డి :

    - పిట్లం లో అనుమతి లేకుండా తిరుమల ఆసుపత్రి నిర్వహణ.

    - హాస్పిటల్ లో వైద్య శాఖ అధికారులు తనిఖీలు.

    - వైద్యుని వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్ , అనుమతి లేకుండా ల్యాబ్ నిర్వహణ పై ఆగ్రహం.

    - ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స చేయవద్దని ఆదేశాలు.

  • 19 Aug 2020 11:53 AM GMT

    మెదక్;

    - తూప్రాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 28 మందికి కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా తూప్రాన్ కు చెందిన ఒకే కుంటుంబానికి చెందిన 7గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...

  • 19 Aug 2020 11:50 AM GMT

    నాగర్ కర్నూల్ జిల్లా:

    - బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ను విదులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ శర్మన్

  • 19 Aug 2020 11:36 AM GMT

    Leopard: నిర్మల్ జిల్లా తనూర్ మండలం బెళ్తారోడ్ గ్రామంలో శివారులో చిరుతలు...

    నిర్మల్ జిల్లా:

    - నిర్మల్ జిల్లా తనూర్ మండలం బెళ్తారోడ్ గ్రామంలో శివారులో చిరుతలు....

    - గ్రామ శివారులోని పత్తి చెనులో రెండు కుక్కలను తిన్న చిరుతపులి పులియొక్క రెండు పిల్లలు, చెనుకు కావాలి గా కుక్కలు.

    - ఉదయం చెనుకు వెళ్లిన రైతులు కుక్కలని తిన్న అనవాళ్లను చూసి భయాందోళనకు గురై ఆడవిశాఖ అధికారులకు సమసారం ఇవ్వగా, కుక్కలని చిరుతలుగా చంపినట్లుగా వెల్లడించిన అడవి శాఖ అధికారులు..

Print Article
Next Story
More Stories