Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 19 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అమావాస్య(ఉ. 8-22 వరకు) తదుపరి పాడ్యమి; మఘ నక్షత్రం (తె. 4-08 వరకు) తదుపరి పుబ్బ నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 1-49 నుంచి 3-22 వరకు), వర్జ్యం (సా. 4-35 నుంచి 6-07 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-38 నుంచి 12.28 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-21

రోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 19 Aug 2020 12:23 PM GMT

    కరోనా వచ్చిన 5 నెలల్లో 4 రోజులు మాత్రమే ఏపీలో చంద్రబాబు ఉన్నాడు : ఎమ్మెల్యే వంశీమోహన్

    కృష్ణాజిల్లా:

    - కరోనా వచ్చిన 5 నెలల్లో 4 రోజులు మాత్రమే ఏపీలో చంద్రబాబు ఉన్నాడు : ఎమ్మెల్యే వంశీమోహన్

    - ఏపీలో పనిలేని చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది : వంశీమోహన్

    - ఆంధ్రా వదిలి రూంలో కూర్చుని చంద్రబాబు జూమ్ లో మాట్లాడుతున్నాడు : వంశీమోహన్

    - చంద్రబాబు మానసిక బ్రా0తొలో ఫోన్ ట్యాప్ అయిందంటున్నాడు : వంశీమోహన్

    - రమేష్ హాస్పిటల్ లో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో తప్పేముంది : వంశీమోహన్

    - తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుంది : వంశీమోహన్

    - రమేష్ హాస్పిటల్ కు ఆరోగ్యశ్రీ కింద నగదు చెల్లించినప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మంచితనం కనపడలేదా ? :వంశీమోహన్

    - విశాఖ యల్.జి ఫాలిమర్స్ లో ప్రమాదం జరిగినప్పుడు యాజమాన్యం మీద చర్యలు తీసుకోమని చంద్రబాబు, లోకేష్ లేఖలు రాయలేదా : వంశీమోహన్

    - తప్పు చేయని రమేష్ పారిపోవాల్సిన అవసరం ఏముంది : వంశీమోహన్

    - 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో హాస్పిటల్ యాజమాన్యం పై కేసులు పెట్టడం ప్రభుత్వం విధి : వంశీమోహన్

    - రమేష్ హాస్పిటల్ ఏమైనా పెదవాళ్ళకు ఉచితంగా వైద్యం చేసిందా? : వంశీమోహన్

    - కోవిడ్ కేర్ సెంటర్ లు పెట్టి కరోనా లేని వాళ్ళ వద్దకుడా లక్షలు వసూళ్లు చేశారు : వంశీమోహన్

    - తెలంగాణలో కేసీఆర్ కోవిడ్ హాస్పిటల్ లపై తప్పు చేస్తే చర్యలు తీసుకోలేదా ? : వంశీమోహన్

    - చంద్రబాబు,లోకేష్ లు జాతీయ పార్టీ వాళ్లుగా తెలంగాణలో ఎందుకు మాట్లాడరు : వంశీమోహన్

    - చట్టం ముందు అందరూ సమానులే : వంశీమోహన్.

  • 19 Aug 2020 12:22 PM GMT

    కర్నూలు

    కరోనా సోకిన వారిని హోం హైసోలేషన్ నుండి ప్రభూత్వ క్వరంటైన్ కి తరలించాలనే ఉద్దేశాన్ని కర్నూలు జిల్లా కలేక్టర్ విరమించుకొవాలని సి.పి.యం పార్టి నేతలు డిమాండ్..

  • 19 Aug 2020 12:21 PM GMT

    Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

    కర్నూలు జిల్లా:

    - శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

    - ఇన్ ఫ్లో : 3,85,880 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో : 66,954 క్యూసెక్కులు

    - పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

    - ప్రస్తుతం : 881.10 అడుగులు

    - నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు

    - ప్రస్తుతం : 193.4090 టిఎంసీలు

    - కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

    - ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 19 Aug 2020 12:20 PM GMT

    JC Prabhakar Reddy: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు

    అనంతపురం:

    - తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు

    - ఈ నెల ఆరవ తేదీన కడప సెంట్రల్ జైలు నుంచి తాడిపత్రికి వస్తూ, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం, తాడిపత్రి రూరల్ సిఐని దూషించిన అభియోగలపై ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.

    - అదే కేసులో మరుసటి రోజు అరెస్టు.. రిమాండ్ కి తరలింపు.

    - ఆరోగ్యం సరిగా లేదన్న విషయం పై ఇవాళ కోర్టు లో బెయిల్ పిటిషన్ వేయగా బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి.

  • 19 Aug 2020 12:19 PM GMT

    తూ.గో కొత్తపేట:

    - కొత్తపేట మండలం కండ్రిక వద్ద గుర్తించిన గుర్తు తెలియని మృతదేహం బొబ్బర్లంక ముక్తేశ్వరం పంట గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • 19 Aug 2020 11:56 AM GMT

    Kurnool District: ఆదోని లో అక్రమ మద్యం స్వాధీనం

    కర్నూలు జిల్లా:

    - ఆదోని లో అక్రమ మద్యం స్వాధీనం

    - సిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేసిన 1టౌన్ పోలీస్ లు

    - కర్ణాటక నుండి అక్రమంగా ఆంధ్రకు మద్యం తరలిస్తున్న ఇద్దరు యువకులు అరెస్టు ..

    - పంట పొలాల్లో ఉపయోగించే స్ప్రెయింగ్ మిషన్ లో, మరియు ద్విచక్ర వాహనం లో సుమారు 180 టెట్రా మద్యం ప్యాకెట్లు స్వాధీనం

  • 19 Aug 2020 11:51 AM GMT

    Coronavirus in Nellore: నెల్లూరు జిల్లా లో కొనసాగుతున్న కరోనా విలయం.

    నెల్లూరు: 

    -- నెల్లూరు జిల్లా లో కొనసాగుతున్న కరోనా విలయం.

    -- గడచిన 24 గంటల్లో 755 మందికి సోకిన మహమ్మారి.

    -- జిల్లాలో తాజా కేసులతో 19,300కి చేరిన బాధితుల సంఖ్య.

  • 19 Aug 2020 11:50 AM GMT

    Disaster Management: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

    అమరావతి:

    - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

    - వాయువ్య బంగాళాఖాతం అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు, రేపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం.

    - గోదావరికి వరద ఉధృతి ఉన్నందున జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు

    - లోతట్టు ప్రాంత , లంక గ్రామల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

    - తీరం వెంబడి గంటకు 40-50 కీ.మీ వెగంతో గాలులు వీస్తాయి.

    - మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.

    -విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు

    3 రోజుల వాతావరణ వివరాలు:-

    - ఆగష్టు 19వ తేదిన:-

     - తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం.

    - శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం.

    - రాయలసీమ, నెల్లూరు చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం

    ఆగష్టు 20వ తేదిన:-

    - తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం.

    - శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం.

    - రాయలసీమ, నెల్లూరు చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం.

    ఆగష్టు 21వ తేదిన:-

    - తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం.

    - రాష్ట్రంలో మిగిలిన చోట్ల చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం.

  • 19 Aug 2020 11:48 AM GMT

    AP Cabinet Meeting: క్యాబినెట్ సమావేశం ముగిశాక మంత్రులు, సీఎం జగన్ మధ్య ఆసక్తికరమైన చర్చ

    అమరావతి:

    - క్యాబినెట్ సమావేశం ముగిశాక మంత్రులు, సీఎం జగన్ మధ్య ఆసక్తికరమైన చర్చ

    - పార్టీకి కొంత సమయం కేటాయించాలని జగన్ ను కోరిన మంత్రి అవంతి.

    - పార్టీ పరిస్థితిపై జిల్లాల వారిగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్య నేతలతో సమీక్ష చేయాలన్న మంత్రులు.

    - నియోజకవర్గ పరిధిలో రోడ్లు దెబ్బతిన్నాయనీ, కొంత మేర నిధులు కేటాయించాలని కోరిన మంత్రులు.

    - పంచాయతీ రాజ్, ఆర్&బి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుందామన్న సీఎం.

  • 19 Aug 2020 11:38 AM GMT

    Guntur: తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం

    గుంటూరు జిల్లా:

    - గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల లో వాలంటీర్ ఆకుల గోపి ఇంట్లో 34 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు....

    - పరారీలో వాలంటీర్ గోపి...

    - గోపి తండ్రిని అదుపులోకి విచారిస్తున్న పోలీసులు....

Print Article
Next Story
More Stories