Live Updates: ఈరోజు (సెప్టెంబర్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 18 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి మ.2-55 వరకు తదుపరి విదియ | ఉత్తర నక్షత్రం ఉ.9-35 తదుపరి హస్త | వర్జ్యం: సా.5-25 నుంచి 6-55 వరకు | అమృత ఘడియలు: రా.2-23 నుంచి 3-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-05 వరకు, తిరిగి మ.12-19 నుంచి 1-08 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-59

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 18 Sep 2020 6:41 AM GMT

    Guntur Distrct updates: వైసీపీ అధికారంలోకి వచ్చాక, పూర్తిగా హిందు మతాన్ని టార్గెట్ చేసినట్లు కనపడుతుంది..కన్నా లక్ష్మీనారాయణ..

    గుంటూరు...

    బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ..

    -దేవాలయాలు ఆస్తులు ద్వంసం చేస్తున్నారు... ఆస్తుల అమ్మకాలు పెట్టారు...

    -హిందు ధర్మం ని నిర్వీర్యం చేస్తున్నారు..

    -గతంలో మతమార్పిడి ని అడ్డుకుంటే,వెనక్కి తగ్గే వాళ్ళు..ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు...పోలీసు కేసులు కూడా పట్టించుకోవటం లేదు..

    -పాస్టర్లు కి 5వేలు ఇచ్చినప్పుడు కూడా ఆందోళన చేశాం..

    -ఒక చర్చి పై రాళ్లు వేస్తే 40మందిని అరెస్ట్ చేసి నాన్ బెయిల్ కేసులు పెట్టారు..

    -ఎన్ని ఆందోళనలు చేస్తున్న చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్లు ఉంది..

    -గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వం కూడా హౌస్ అరెస్టు లు చేస్తున్నారు..

    -జరుగుతున్న విషయాల న్నీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నాం.....

  • National updates: తిరుమల బస్సు టికెట్లపై మతప్రచారం చేసినప్పుడే ప్రభుత్వ వైఖరి బయటపడింది: సీఎం రమేశ్..
    18 Sep 2020 6:29 AM GMT

    National updates: తిరుమల బస్సు టికెట్లపై మతప్రచారం చేసినప్పుడే ప్రభుత్వ వైఖరి బయటపడింది: సీఎం రమేశ్..

    జాతీయం

     సీఎం రమేశ్, బీజేపీ ఎంపీ..

    -ఎవరో వాట్సాప్‌లో మెసేజ్ ఫార్వార్డ్ చేశారని అరెస్టు చేశారు.

    -విశాఖ నుంచి కర్నూలు తీసుకెళ్లి కోవిడ్ వచ్చి చనిపోయేలా చేశారు.

    -ఒక చిన్న సంఘటనపై అంత పెద్దగా స్పందించిన ప్రభుత్వం, ఇన్ని పెద్ద ఘటనలు జరిగినా పట్టించుకోవడం లేదు

    -షిరిడీ సాయిబాబా తల పగులగొట్టారు, నందిని ధ్వంసం చేశారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నా పట్టించుకోవడం లేదు

    -ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కుంది

    -ఆ క్రమంలో న్యాయం చేయమంటూ బీజేపీ నేతలు, హిందువులు నిరసన ప్రదర్శన చేపట్టాలనుకుంటే అరెస్టులు చేస్తున్నారు

    -ప్రశ్నించినవారిని జైల్లో పెట్టి నోరు మూయాలని చూస్తున్నారు

    -కోర్టులు మొట్టికాయలు వేసినా ఏపీ పోలీసుల తీరు మారడం లేదు

    -అరెస్టు చేసిన ప్రజాప్రతినిధులను విడుదల చేయాలి, కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి

  • National updates: ఏపీలో వైసీపీ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది: జీవీఎల్ నరసింహారావు..
    18 Sep 2020 6:14 AM GMT

    National updates: ఏపీలో వైసీపీ ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది: జీవీఎల్ నరసింహారావు..

    జాతీయం

    -హిందూ ఆలయాలపై దాడులు జరిగితే ఒకలా, ఇతర ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగితే మరోలా స్పందిస్తోంది

    -చర్చిపై 4 రాళ్లు పడ్డాయని, 41 మందిని అరెస్టు చేశారు

    -అంతర్వేది రథం ఘటనపై సీబీఐకి అప్పగించి చేతులు దులుపుకున్నారు

    -ప్రభుత్వ తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశాం

    -చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు హిందువులు గుర్తొచ్చారు

    -టీడీపీ హయాంలోనూ హిందూ ఆలయాలపై వివక్ష కొనసాగింది

    -విజయవాడ దుర్గ గుడిలో క్షుద్రపూజలు కూడా బాబు హయాంలోనే జరిగాయ

    -పాకిస్తాన్‌లో అణచివేతకు గురవుతున్న హిందువులు భారత్ శరణు కోరుతున్నారు

  • 18 Sep 2020 5:57 AM GMT

    National updates: దేవాలయాల పై జరుగుతున్న దాడుల నిరోధానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశాం..

    జాతీయం

    -జీవీఎల్ నరసింహారావు, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి..

    -చర్చి పై రాళ్ళు వేశారని ఆరోపణలతో అరెస్టు చేసిన 41 మందిని తక్షణమే విడుదల చేయాలి

    -అంతర్వేది , అమరావతి ల పై సిబిఐ దర్యాప్తు జరపాలి

    -గతంలో జరిగిన అవినీతి పైన దర్యాప్తు జరగాల్సిందే

    -చంద్రబాబు హయాంలో అనేక దేవాలయాలను కూల్చి వేశారు

    -పుష్కరాల సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు

    -హిందూ ఉద్దరకుడిగా ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు..

  • 18 Sep 2020 5:32 AM GMT

    Kanaka Durgamma updates: దుర్గ గుడి ఫ్లై ఓవర్ ప్రారంభం వాయిదా..

    అమరావతి...

    -కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం..

    -ప్రారంభం అయ్యేవరకూ ఎలాంటి రాకపోకలకు అనుమతి లేదు.

    -రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు....

  • 18 Sep 2020 5:28 AM GMT

    Amalapuram updates: అమలాపురం చేరుకున్న ఏమ్మేల్సీ మాధవ్...

    యాంకర్:

    -అంతర్వేది ఘటనలో బాద్యులను వదిలేసి, నిరసన తెలపుతున్న బీజేపీ నేతలను అరెస్టులు చేయడం దుర్మార్గం...

    -రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది...

    -తరుచూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలు ను దెబ్బతీస్తున్నాయి ..

    -రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనలకు బాధ్యత వహించాలి..

  • Vijayawada Durgamma updates: దుర్గగుడి వెండి సింహాల మాయంలో కీలక పరిణామాలు...
    18 Sep 2020 5:22 AM GMT

    Vijayawada Durgamma updates: దుర్గగుడి వెండి సింహాల మాయంలో కీలక పరిణామాలు...

    విజయవాడ..

    -విజయవాడ దుర్గగుడిలోని రథం వెండి సింహాల మాయం విషయంలో పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే.

    -ఉత్సవం సమయంలో మాత్రమే రథాన్ని బయటకు తీస్తామని, మిగతా సమయంలో రథం ఆలయంలోపలే ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

    -గత 18 నెలలుగా రథాన్ని బయటకు తీయలేదని అధికారులు చెప్తున్నారు.

    -రథంలోని వెండి సింహాలు ఎప్పుడు మాయం అయ్యాయి, ఎలా మాయం అయ్యాయి అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభము.

    -ఈ విచారణ పోలీసులకు సవాల్ గా మారింది

    -ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆధారాల సేకరణకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు

    -పోలీసుల ఫిర్యాదు కంటే ముందే అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వెండి రథాన్ని సందర్శించారు.

    -దీంతో వేలి ముద్రలు, డాగ్ స్క్వాడ్ ద్వారా నిందితులను కనుగొనడం కష్టంగా మారుతుంది.

    -ఆలయ అప్రైజర్ షమ్మీ, ఏఈవో రమేష్ లను పోలీసులు ఇప్పటికే విచారించారు.

    -ఈరోజు మరికొందరు ఉద్యోగులు, ఆలయ సెక్యూరిటీని విచారించే అవకాశం.

  • 18 Sep 2020 4:58 AM GMT

    East Godavari updates: అమలాపురం పట్టణంలో పూర్తి కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్నది..

    తూర్పుగోదావరి..

    -బీజేపీ 'ఛలో అమలాపురం' పిలుపునివ్వడంతో పోలీసులు అమలాపురం వైపు వచ్చేరహదారులన్నిటినీ అదుపులోనికి తీసుకున్నారు.

    -పట్టణంలోనికి ఇతర వ్యక్తులు రాకుండా భారీ గేట్లను ఏర్పాటు చేశారు.

    -అమలాపురంతో పాటు కోనసీమలోకి వచ్చే రహదారుల వద్ద కూడా పోలీసులు చెక్ పోస్టులు పెట్టీ తనిఖీలు చేస్తున్నారు.

  • 18 Sep 2020 4:53 AM GMT

    Antarvedi updates: అంతర్వేది లక్ష్మీనరశింహస్వామీ రధం దగ్ధమైన ఘటనకు నిరసనగా ఛలో అమలాపురం నకు పిలుపునివ్వడంతో కాకినాడలో పలువురు బిజేపి నేతల హౌస్ అరెస్ట్..

    తూర్పుగోదావరి :

    -కాకినాడలో మాజీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న గృహ నిర్భంధం..

    -రూరల్ మండలంలో బిజేపి అధికార ప్రతినిధి తుమ్మల పద్మజ, రంభాల వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి రవికిరణ్ లను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..

    -నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న బిజేపి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు వేటుకూరి సూర్యనారాయణరాజు..

    -గన్ మ్యాన్ ను కాకినాడలో విడిచిపెట్టి అజ్ఞాతంలో వెళ్లిన ఎమ్మెల్సీ మాధవ్, అమలాపురంలో రహస్యం ప్రాంతంలో ఉన్నట్టు అనుమానిస్తోన్న పోలీసులు.

  • 18 Sep 2020 4:49 AM GMT

    Prakasam updates: జిల్లా జాయింట్ కలెక్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ..

    ప్రకాశం జిల్లా..

    -జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట మురళీకృష్ణ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.

    -హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న జేసి.

Print Article
Next Story
More Stories